279

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 279*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 194*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

     *గజ్వయె బనీయిల్ ముస్తలిక్ : - 4*

బనీ ముస్తలిక్ తో పోరాటం అనంతరం, తిరుగు ప్రయాణంలో దుష్ప్రచారం చేసేందుకుగాను మునాఫిక్ లకు రెండు అవకాశాలు లభించాయి. వాటిని ఆసరాగా తీసుకొని ముస్లిములలో విభేదాలు, వైషమ్యాలు సృష్టించి దైవప్రవక్త (సల్లం)కు వ్యతిరేకంగా నీచమైన దుష్ప్రచారం చేశారు. ఈ రెండు సంఘటనలలో మొదటి సంఘటన "మదీనా నుండి అతి నీచమైన వ్యక్తిని గెంటివేసే విషయం" గురించి మునుపటి భాగంలో చదువుకున్నాం. ఇప్పుడు రెండవ సంఘటన "ఇఫ్క్" సంఘటన గురించి తెలుసుకుందాం.

*2. ఇఫ్క్ సంఘటన : - - : విశ్వాసుల మాతపై కపటుల నీలాపనిందలు*

ఈ గజ్వాకు సంబంధించిన మరో ముఖ్య సంఘటన 'ఇఫ్క్' సంఘటన. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటంటే...., ↓

దైవప్రవక్త (సల్లం), ఏదైనా ప్రయాణానికి బయలుదేరే ముందు తమతో పాటు ఏ సతీమణిని తీసుకు వెళ్ళాలి అని చీటీ వేసి, ఎవరి పేరు వస్తే వారిని తమ వెంట తీసుకువెళ్ళడం రివాజు. ఈ గజ్వాలో కూడా అలా చీటీ వేయడం జరిగింది. అందులో 'హజ్రత్ ఆయిషా (రజి)' గారి పేరు రావడం వలన ఆమె (రజి)ను తమ వెంట తీసుకువెళ్ళారు.

బనీ ముస్తలిక్ పోరాటం అనంతరం తిరుగు ప్రయాణంలో ఇస్లామీయ సైన్యం ఓ చోట విడిది చేసినప్పుడు హజ్రత్ ఆయిషా (రజి) బహిర్భూమికని వెళ్ళడం జరిగింది. ఆయిషా (రజి) అవసరం తీరాక సైనికశిబిరాల సమీపానికి వచ్చి చూసుకుంటే ఆమె (రజి) మెడలో కంఠహారం కనపడలేదు. బయటకి వెళ్ళేటప్పుడు ఆమె (రజి) తన సోదరి వద్ద నుండి అడిగి ధరించిన కంఠహారం అది. ఈ సంగతి ఆమె (రజి)కు తెలియగానే తిరిగి అదే ప్రదేశానికి వెళ్ళి వెదకనారంభించారు.

ఈ లోపు ఇస్లామీయ సైన్యానికి బయలేదేరే ఆదేశం అందగానే, ఆయిషా (రజి) అంబారీలోనే ఉన్నారని భావించి, అంబారీని ఒంటెపై ఎత్తిపెట్టేవారు వచ్చి అంబారీని ఎత్తి ఒంటెపైకి ఎక్కించారు. వారు హజ్రత్ ఆయిషా (రజి) అందులోనే ఉన్నారని తలచడం జరిగింది. అంబారీ తేలికగా ఉండటాన్ని వారు పట్టించుకోలేదు. ఎందుకంటే హజ్రత్ ఆయిషా (రజి) గారి వయస్సు పిన్న వయస్సు. శరీరం ఏమంత బరువుగా కూడా లేదు. అదే కాకుండా ఆ అంబారీని చాలా మంది పట్టి పైకి ఎక్కించడం మూలంగా ఈ విషయం వారికి అర్థం కాలేదు. ఒకరు ఇద్దరు ఎత్తితే బహుశా బరువు గురించి అనుమానం వచ్చి ఉండేదేమో.

ఎలాగయితేనేమి, హజ్రత్ ఆయిషా (రజి) తన హారాన్ని వెతికి దాన్ని తీసుకొని విడిదికి వచ్చి చూడగా సేన మొత్తం వెళ్ళిపోయి ఖాళీగా ఉంది. పిలిచేవారుగాని, పిలుపుకు సమాధానం పలికేవారుగాని ఎవ్వరూ లేరు అక్కడ. అందుకని ఆమె, తాను సేన వెంట లేననే విషయం తెలుసుకొని ఎవరైనా తిరిగి రాకమానరనే ఉద్దేశ్యంతో అక్కడనే ఓ ఇసుక తిన్నె మీద కూర్చుండిపోయారు. అయితే అల్లాహ్ ఏది తలిస్తే అది అయితీరుతుంది. ఆయన ఆకాశం నుంచి ఏ ఆదేశం ఇస్తాడో అదే అమలు జరుగుతుంది. దిక్కుతోచని స్థితిలో ఆయిషా (రజి) అక్కడే ఒక చోట దుప్పటి కప్పుకొని పడుకున్నారు. పడుకోగానే ఆమె (రజి)కు గాఢ నిద్రపట్టింది.

*ఆయిషా (రజి) వద్దకు సుఫ్వాన్ (రజి) రాక : -*

సూర్యుడు పడమటి ఇసుక తిన్నెల వెనక్కి వెళ్ళి కనుమరుగైపోయాడు. చీకటి పడిపోయి నక్షత్రాలు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఇస్లామీయ సైన్యం ఆ ఎడారి ప్రాంతాన్ని దాటుకొని ముందుకు వెళ్ళిపోయింది. అందరికంటే వెనుక ఒక కావలివాడు సైన్యం వెళ్ళిన దారిని పరిశీలిస్తూ, తాను కూర్చొని ఉన్న ఒంటెను ముందుకు ఉరికిస్తున్నాడు. ఆయన పేరు 'సుఫ్వాన్ బిన్ ముఅత్తల్ (రజి)'. ఈయన 'సులైమ్' తెగకు చెందినవారు.

ముస్లింల వస్తువులు ఏవైనా దారిలో పడిపోతే వాటిని తీసుకువచ్చే బాధ్యత ఆయనకు అప్పజెప్పబడింది. సైన్యం నడిచిన దారిని పరిశీలించుకుంటూ వెనుక నుంచి వస్తున్నారాయన. సైన్యం చాలా దూరం వెళ్ళిపోయింది. తిరిగి సైన్యంలో కలవటానికి ఆయన త్వరత్వరగా వెళుతున్నారు. దారిలో ఆయనకు ఏదో వస్తువు నేల మీద పడిఉన్నట్లు కనిపించింది. వెంటనే ఆయన ఒంటెను ఆపడానికి ప్రయత్నించారు. కాని వేగంతో ఉన్న ఆ ఒంటె కాస్త ముందుకు పోయిగాని ఆగలేదు.

ఆ తర్వాత ఆయన (రజి) ఒంటె దిగి వచ్చారు. చూస్తే ఎవరో మనిషి దుప్పటి కప్పుకొని పడుకొని ఉన్నట్లు కనిపించింది. అప్పుడప్పుడే సూర్యుడు అస్తమించినందున చుట్టూ మసక చీకటి ఉంది. అయినా పరిసరాలు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి. పడుకున్న ఆ వ్యక్తి వైపు ఆయన బాగా పరిశీలనగా చూశారు. ఆమె, దైవప్రవక్త (సల్లం) గారి భార్య ఆయిషా (రజి) అని తెలియగానే *"ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్"* అని పఠిస్తూ, *"అయ్యో! ఈమెగారు దైవప్రవక్త (సల్లం) గారి సతీమణి....!"* అని ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అక్కడ జరిగిన అలికిడికి ఆయిషా (రజి)కు మెలుకువ వచ్చింది. ఆమె ఉలిక్కిపడి లేచారు. ఎవరో వ్యక్తి ముందు నిలుచుని ఉండటం చూసి గబాలున ముఖం మీద వస్త్రం కప్పుకున్నారు.

హజ్రత్ సుఫ్వాన్ (రజి), ముస్లిముల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రజి)ను చూసి గుర్తుపట్టారు. ఎందుకంటే పరదా ఆదేశం వెలువడక పూర్వం ఆయన ఆమెను చూసి ఉన్నారు. ఆయన ఇన్నాలిల్లాహ్ తప్ప తన నోట మరే పలుకూ పలకలేదు.

ఆ తర్వాత హజ్రత్ సుఫ్వాన్ (రజి) తన ఒంటెను ఆమె దగ్గరగా కూర్చోబెట్టి, ఆమెతో ఏమీ మాట్లాడకుండా కొంచెం దూరం వెళ్ళి కూర్చున్నారు. హజ్రత్ ఆయిషా (రజి) కూడా మౌనంగా లేచి ఒంటె మీద ఎక్కి కూర్చున్నారు. ఆయిషా (రజి) ఒంటెపై కూర్చోగానే హజ్రత్ సుఫ్వాన్ (రజి) ఒంటెను లేపి దాని పగ్గం పట్టుకొని సైన్యం వెళ్ళిన దారిలో నడవటం ప్రారంభించారు. ఆ చీకట్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వారిరువురి మధ్య ఎలాంటి సంభాషణ జరగలేదు.

*సైన్యం దగ్గరికి చేరుకున్న సుఫ్వాన్ (రజి), ఆయిషా (రజి) : -*

ఇస్లామీయ సైన్యం కొన్ని మైళ్ళు ప్రయాణం చేసిన తరువాత విశ్రాంతి కోసం మరో మజిలీ దగ్గర విడిది చేసింది. హజ్రత్ సుఫ్వాన్ (రజి) ఒంటె మీద హజ్రత్ ఆయిషా (రజి)ను తీసుకొని నడుస్తూ మధ్యాహ్న సమయానికి ఇస్లామీయ సైన్యం విడిది చేసిన చోటికి చేరుకున్నారు.

*విశ్వాసుల మాతపై ఘోరమైన అపనిందను మోపిన కపటులు : -*

వీలు చిక్కితే చాలు, ఏదో ఒక ఉపద్రవం లేవనెత్తడానికి అనుక్షణం కాచుకొని ఉండే కపట విశ్వాసి 'అబ్దుల్లా బిన్ ఉబై'కి ఇప్పుడు మరో అవకాశం లభించింది. అతని హృదయంలో కాపట్యం, ఈర్ష్యాజ్వాలలు ఏవయితే రగులుతున్నాయో, ఆ బాధను బయటపెట్టడానికి అతను ముందుకు వచ్చాడు. ముస్లిముల మాతృమూర్తి హజ్రత్ ఆయిషా (రజి)పై అపవాదు వేస్తూ కట్టు కథలు అల్లడం ఆరంభించాడు. ఆయిషా (రజి)ని మరియు సుఫ్వాన్ (రజి)ని ఆ విధంగా చూడగానే, *"ఇదిగో చూడండి. మీ ప్రవక్తగారి భార్యామణి రాత్రి ఓ పరపురుషునితో గడిపి, ఇప్పుడు బహిరంగంగానే అతనితో కలసి వస్తోంది!"* అన్నాడతను.

అతని శిష్యులు ఎగిరి గంతేసి తమకు చేతి నిండా పని దొరికిందని తెగ సంబరపడిపోయారు. వారు ఈ విషయాన్ని సైనికుల్లో ప్రచారం చేయడం మొదలెట్టారు. వారి ప్రచార జాలంలో 'మిస్తహ్ బిన్ ఉసాసా', ప్రముఖ కవి 'హస్సాన్ బిన్ సాబిత్' వంటి కొందరు ముస్లిములు కూడా చిక్కుకున్నారు. ఈ దుష్ప్రచారం సంగతి తెలిసి దైవప్రవక్త (సల్లం) ఎంతో బాధపడ్డారు. ఆయన (సల్లం) సైన్యానికి తక్షణమే బయలుదేరాలని ఆదేశించారు.

అయితే దారిలో కూడా ఈ దుష్ప్రచారం కొనసాగింది. దాంతో అది క్రమంగా ముస్లిములందరి చెవులకు ప్రాకింది. అనేకమంది ముక్కు మీద వేలేసుకున్నారు. కొందరు సందిగ్ధంలో పడిపోయారు. మరికొందరు ఇది పచ్చి అపనిందని కొట్టిపారేశారు. ఆయిషా (రజి) తండ్రి హజ్రత్ అబూ బక్ర్ (రజి) పరిస్థితి అర్థంకాక లోలోన చాలా బాధపడసాగారు. తన వెనుక ఇంత కుట్ర జరుగుతోందని హజ్రత్ ఆయిషా (రజి)కి ఏమాత్రం తెలియదు.

*మదీనా చేరుకున్న ఇస్లామీయ సైన్యం : -*

అలాంటి పరిస్థితుల్లో సైన్యం మదీనా సమీపానికి చేరుకుంది. అబ్దుల్లా (రజి), తన తండ్రి అబ్దుల్లా బిన్ ఉబై మాటలను ఖండిస్తూ మదీనా ప్రవేశ ద్వారం వద్ద కత్తి దూసి నిలబడ్డారు. తన తండ్రి అబ్దుల్లా బిన్ ఉబై అక్కడికి చేరగానే అతనిని అడ్డుకుంటూ, *"దైవసాక్షి! మీరు ఇక్కడ నుండి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. దైవప్రవక్త (సల్లం) అనుమతిస్తే తప్ప, ఎందుకంటే దైవప్రవక్తే అందరికంటే గౌరవనీయులు. మీరే అందరికంటే నీచులు."* అని నిలదీశారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) అక్కడకు చేరగానే అతణ్ణి మదీనాలోనికి ప్రవేశించే అనుమతి ఇచ్చారు. అప్పుడుగాని అతని కుమారుడు అతని మార్గానికి అడ్డుతొలగలేదు.

ఆ సందర్భంలోనే అబ్దుల్లా బిన్ ఉబై కుమారుడు అబ్దుల్లా (రజి) దైవప్రవక్త (సల్లం)తో, *"దైవప్రవక్తా! తమరే అతణ్ణి హతమార్చదలుచుకుంటే నాకు ఆదేశం ఇవ్వండి. దైవసాక్షి ! నేను ఆయన తలను నరికి మీ కాళ్ళ దగ్గర పడవేస్తాను."* అని విన్నవించుకోవడం కూడా జరిగింది.

*హజ్రత్ ఆయిషా (రజి)పై అపనిందలా....! : -*

ముస్లిం యోధులు విజయోత్సాహంతో మదీనాలో ప్రవేశించారు. ఇద్దరు సైనికులు హజ్రత్ ఆయిషా (రజి) కూర్చున్న ఒంటెను ఆమె పుట్టింటికి తీసుకెళ్ళి ఆపారు. హజ్రత్ ఆయిషా (రజి) అంబారీ నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళారు.

కాని ఆమె (రజి) మదీనా తిరిగిరాగానే జబ్బుపడ్డారు. దాదాపు నెలరోజుల దాకా కోలుకోలేక పోయారు. మరోవైపు అబ్దుల్లా బిన్ ఉబై రగిలించిన దుష్ప్రచారపు చిచ్చు ఇంకా మండుతూనే ఉంది. ఈ సంగతి హజ్రత్ ఆయిషా (రజి)కు ఇంకా తెలియదు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో తెలుసుకుందాం.*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

280

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 280*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 195*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*2. ఇఫ్క్ సంఘటన : - 2*

*హజ్రత్ ఆయిషా (రజి)పై అపనిందలా....! : -*

ముస్లిం యోధులు విజయోత్సాహంతో మదీనాలో ప్రవేశించారు. ఇద్దరు సైనికులు హజ్రత్ ఆయిషా (రజి) కూర్చున్న ఒంటెను ఆమె పుట్టింటికి తీసుకెళ్ళి ఆపారు. హజ్రత్ ఆయిషా (రజి) అంబారీ నుంచి దిగి ఇంట్లోకి వెళ్ళారు.

కాని ఆమె (రజి) మదీనా తిరిగిరాగానే జబ్బుపడ్డారు. తీవ్రమైన జ్వరం కారణంగా కొన్ని రోజులు ఆమె (రజి) మంచానికే పరిమితమయ్యారు. ఇంట్లో ఆమె బాగోగులు చూసేవారు, ఆమెకు ధైర్యం చెప్పేవారు అందరూ ఉన్నారు. కాని ఆమె అస్వస్థత తగ్గే సూచనలు మాత్రం కనిపించలేదు. ఈ విధంగా దాదాపు నెలరోజుల దాకా కోలుకోలేక పోయారు. మరోవైపు అబ్దుల్లా బిన్ ఉబై రగిలించిన దుష్ప్రచారపు చిచ్చు ఇంకా మండుతూనే ఉంది. ఇటు ఆయిషా (రజి)కు ఈ అపవాదు గురించి ఏమాత్రం తెలియదు. 

ఆయిషా (రజి) త్వరగా కోలుకోలేక పోవడానికి మరొక కారణం కూడా ఉంది. అది ఏమిటంటే....; ↓

దైవప్రవక్త (సల్లం) అప్పుడప్పుడు వస్తూ ఆమె ఆరోగ్యపరిస్థితి గురించి ఆమె తల్లిదండ్రుల్ని అడిగితెలుసుకొని వెళ్ళిపోయేవారు. అంతేగాని ఆమెను కలుసుకొని మాట్లాడేవారు కాదు. ఇలా ఆయన (సల్లం) తనతో ఎందుకు ముభావంగా ఉన్నారో ఆయిషా (రజి)కు అర్థమయ్యేది కాదు. అయితే ఆమెకు మాత్రం దైవప్రవక్త (సల్లం) వ్యాధి సమయంలో చేసే పరామర్శ గురించి బాగా తెలుసు. ఆయన (సల్లం) మాటిమాటికి పరామర్శించడానికి వచ్చేవారు. అంతకు ముందు ఎప్పుడు జబ్బుపడినా దైవప్రవక్త (సల్లం) ఆమె ప్రక్కన కూర్చొని ఆమెకు ధైర్యం చెబుతుండేవారు. కాని ఇప్పుడు ఒక నెల అయిపోయినా తన వైపు చూడనైనా చూడడం లేదు. ఇదే ఆమె మనస్సును తొలుస్తున్న ప్రశ్న.

కొన్ని రోజుల తర్వాత అల్లాహ్ కృపతో ఆయిషా (రజి) అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్నారు.

*తనపై పడ్డ అపనింద వార్త విన్న ఆయిషా (రజి) : -*

ఓ రోజు ఆయిషా (రజి) బహిర్భూమికని బయలు ప్రదేశానికి వెళ్ళారు. ఆమె (రజి) వెంట ఉమ్మె మిస్తహ్ (మిస్తహ్ తల్లి) కూడా ఉన్నారు. మిస్తహ్ నికార్సయిన ముస్లిం అయినప్పటికీ ఆయిషా (రజి) విషయంలో మాత్రం ఆయన విశ్వాసం ఆయన్ని కపటులతో వంతపాడకుండా ఆపలేకపోయింది.

ఉమ్మె మిస్తహ్, ఆయిషా (రజి)కి తోడుగా నడుస్తుండగా అనుకోకుండా తాను కప్పుకున్న పొడవాటి దుప్పటి కాళ్ళలో పడి ఆమె క్రింద పడిపోయారు. అలా పడిపోతూ ఆమె నోట అప్రయత్నంగా, *"మా మిస్తహ్ నాశనం గాను!"* అని తన కుమారుడ్ని శపించారు. 

అది విని ఆయిషా (రజి) నిర్ఘాంతపోయారు. తల్లి తన సొంత కుమారుణ్ణే శపిస్తుండటం ఆమె (రజి)కు విస్మయం కలిగించింది. *"ఉమ్మె మిస్తహ్! బద్ర్ యుద్ధంలో ఇస్లాం కోసం వీరోచితంగా పోరాడిన యోధుడు మీ అబ్బాయి. ఆయన్ని గురించి ఎందుకు అలా అంటారు?"* అని మాములుగానే అడిగారు ఆయిషా (రజి).

*"నీకు ఈ విషయం తెలియదా అమ్మా?"* అని అమాయకంగా అడుగుతూ, మదీనా నగరంలో ఆయిషా (రజి) గురించి చెప్పుకుంటున్న విషయాలన్నీ (తనపై పడ్డ అపనింద గురించి) ఆవిడ (రజి) ముందు ఏకరువుపెట్టింది ఉమ్మె మిస్తహ్.

ఆ అపనిందల గురించి వినగానే ఆయిషా (రజి)కు గుండె ఆగినంత పనయింది. పొర్లుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ వెంటనే అక్కణ్ణుంచి ఇంటికి పరుగెత్తారు. ఇంటికి చేరుకోగానే తల్లిదండ్రుల ముందు భోరున ఏడ్చేశారు. అలా రెండు రాత్రులు, ఒక పగలు కన్నీరుమున్నీరుగా దుఃఖిస్తూ గడిపారు.

ఇటు మహాప్రవక్త (సల్లం) విషయానికొస్తే, ఈ సంఘటన గురించి ఆయనలో సహజంగానే ఆందోళన పెరిగింది. ఓ సుదీర్ఘకాలం వరకు దైవవాణి అవతరించకపోవడంతో, ఆయన హజ్రత్ ఆయిషా (రజి)కు దూరంగా ఉండిపోయే విషయంలో తన అనుచరులతో సంప్రదించాల్సి వచ్చింది. వెంటనే తనకు నమ్మకస్తులైన సహచరులను, దగ్గరి బంధువులను పిలిచి వారి అభిప్రాయాలు అడిగారు. సహచరులలో 'హజ్రత్ అలీ (రజి)'ని, 'హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రజి)'ని పిలిపించి ఆరాదీశారు.

*"ఉసామా! ఆయిషా గురించి ప్రచారం జరుగుతున్న విషయాలన్నీ విన్నావు కదా? వాటిని గురించి నీ అభిప్రాయం ఏమిటి?"* అని ప్రశ్నించారు దైవప్రవక్త (సల్లం).

*"దైవప్రవక్తా! మీ శ్రీమతిలో నేను మంచితనం తప్ప మరో విషయం చూడలేదు. ఇక ఆమె (రజి) గురించి జనం చెప్పుకుంటున్న మాటలంటారా? అవన్నీ అబద్ధం, అపనిందలు తప్ప మరేమీ కాదు."* అన్నారు హజ్రత్ ఉసామా బిన్ జైద్ (రజి).

*"అలీ! మరి నువ్వేమంటావు?"* అని అడిగారు ప్రవక్త (సల్లం).

*"దైవప్రవక్తా! నేను కూడా ఆమెలో అలాంటి విషయమేదీ ఇంతవరకు చూడలేదు. కాని మీరేమో చాలా విచారంతో ఉన్నట్లు కనిపిస్తున్నారు."* అన్నారు హజ్రత్ అలీ (రజి).

*"ఔను. నాకు ఈ విషయంలో చాలా విచారంగానే ఉంది. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"విచారించకండి. మిమ్మల్ని భర్తగా పొంది, ఆ విషయం తమకు గర్వకారణంగా భావించే స్త్రీలు చాలామంది ఉన్నారు."* అని చెప్పారు హజ్రత్ అలీ (రజి).

*"కాని ఆయిషా (రజి) సంగతి....?"* ప్రశ్నించారు ప్రవక్త (సల్లం).

*"ఆమె (రజి) ఏ పాపం ఎరగని అమాయకురాలని నా అభిప్రాయం. సరే, మీరొక సారి ఆమె (రజి) సేవకురాలు 'బరీరా' ను కూడా పిలిపించి విషయం అడిగి తెలుసుకోండి."* అన్నారు అలీ (రజి).

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) హజ్రత్ అబూ బక్ర్ (రజి) ఇంటికెళ్ళి, బరీరాను పిలిచి అడిగారు. దానికి ఆమె ఇలా సమాధానమిచ్చింది....; ↓

*"మీకు సత్యధర్మం ఇచ్చి పంపిన దేవుని సాక్షిగా చెబుతున్నాను. నేను ఆయిషా (రజి)లో ఇంతవరకు ఎలాంటి చెడు విషయం చూడలేదు. కాకపోతే నేను పిండి నానబెట్టి మరో పని మీద వెళ్తూ, 'నేనిప్పుడే వస్తా, కాస్త పిండి వైపు చూస్తుండమ్మా!' అని చెబితే, తర్వాత ఆమె ఆ సంగతి మరచిపోయి ఆదమరచి నిద్రపోతారు. అంతలో మేకలు, కోళ్ళు మొదలైనవి వచ్చి ఆ పిండి మొత్తం ఆరగించి వెళ్ళిపోతాయి. అంతకు మించిన నిర్లక్ష్యం ఏదీ నేను ఆమెలో చూడలేదు."* అన్నది బరీరా.

ఆ తర్వాత దైవప్రవక్త (సల్లం), తన మరో భార్య, తన మేనత్త కూతురైన 'హజ్రత్ జైనబ్ (రజి)' దగ్గరకు వెళ్ళారు. దైవప్రవక్త (సల్లం) పట్ల ప్రేమ విషయంలో జైనబ్ (రజి)కు మరియు ఆయిషా (రజి)కు మధ్య ఎప్పుడూ పోటీ ఉండేది.

మహాప్రవక్త (సల్లం), హజ్రత్ జైనబ్ (రజి)తో, *"ఆయిషా (రజి)పై జరుగుతున్న ఈ దుష్ప్రచారం గురించి నీకేమైనా తెలుసా?"* అని అడిగారు.

తాను ఆ నోట, ఈ నోట విన్న ఒకటి అరా మాటలు జైనబ్ (రజి) దైవప్రవక్త (సల్లం)తో చెప్పారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో ఏ స్త్రీ అయినా తన సవతి గురించి ఒకటికి నాలుగు అబద్ధాలు జోడించి చెబుతుంది. కాని జైనబ్ (రజి) మాత్రం ఆయిషా (రజి)కు వ్యతిరేకంగా పల్లెత్తు మాట అనలేదు. పైగా ఆయిషా (రజి)ని మెచ్చుకుంటూ మాట్లాడారు. *"ఇటువంటి అభాండాల గురించి నేను నా చెవుల్ని, దృష్టిని కాపాడుకుంటాను. ఆయిషా (రజి) గురించి నాకు బాగా తెలుసు. తను చాలా మంచి అమ్మాయి. అల్లాహ్ ఉన్నాడన్న మాట ఎంత సత్యమో నేను చెబుతున్న ఈ మాట కూడా అంతే సత్యం."* అన్నారు జైనబ్ (రజి).

ఈ విధంగా ప్రవక్త (సల్లం) సహచరులు దుష్ప్రచారాలకు చెవులొగ్గవద్దని సలహా ఇచ్చారు. ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) మస్జిద్ లో ఉపన్యాసమిచ్చేందుకు మెంబరుపై నిలబడి, అబ్దుల్లా బిన్ ఉబై ఆగడాల నుండి తనను రక్షించమని సహచరులకు చెప్పడం జరిగింది.

*↑ ఇందులోని వివరణను In Sha Allah రేపటి భాగంలో తెలుసుకుందాం.*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

281

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 281*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 196*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*2. ఇఫ్క్ సంఘటన : - 3*

*ఆయిషా (రజి)పై జరుగుతున్న దుష్ప్రచారం గురించి దైవప్రవక్త (సల్లం) మస్జిద్ లో ప్రసంగిస్తున్న సందర్భం : -*

చాలా రోజులు గడిచిపోయాయి. దైవప్రవక్త (సల్లం) ఆయిషా (రజి)ను కలవలేదు. అయితే లోకం ముందు నిజాన్ని నిరూపించటానికి జిబ్రీల్ దూత (అలైహి) అల్లాహ్ సందేశం తీసుకొని రావాలని ఆయన (సల్లం) ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఒక రోజు ఆయన (సల్లం) మస్జిద్ కు వెళ్ళి ప్రజలందరినీ సమావేశపరిచి ఇలా ప్రసంగించారు....; ↓

*"ప్రజలారా! మీలో కొందరు నా కుటుంబం గురించి అసత్యాలను వ్యాపింపజేసి నన్ను బాధపెడుతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? నా కుటుంబసభ్యులపై నిందలు మోపి, నా మనస్సును తీవ్రంగా గాయపరచిన వ్యక్తి (అబ్దుల్లా బిన్ ఉబై) చేస్తున్న దుష్ప్రచార దాడుల నుంచి నా గౌరవం కాపాడేవారు ఎవరైనా ఉన్నారా మీలో?  నా కుటుంబంలో మంచి తప్పితే మరేమీ నాకు తెలియదు. అల్లాహ్ ఉనికి ఎంత సత్యమో నేను చెబుతున్న మాటలు కూడా అంతే సత్యం. దైవసాక్షి! నేను నా అర్థాంగిలో ఎలాంటి చెడు చూడలేదు. మీరు ఆరోపిస్తున్న వ్యక్తి 'సుఫ్వాన్ (రజి)' గురించి అనుమానాలు పెట్టుకోవడానికి కూడా నా దగ్గర ఎటువంటి ఆధారం లేదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు తప్ప ఇంకెన్నడూ అతను నా ఇంటి గడప కూడా తొక్కలేదు."* అన్నారు బాధాతప్త హృదయంతో.

అప్పుడు 'హజ్రత్ ఉసైద్‌ బిన్ హుజైర్ (రజి)' లేచి, *"దైవప్రవక్తా! ఆ వ్యక్తి మా తెగ (అవస్)కు చెందినవాడయితే మేము అతని శిరస్సు ఖండిస్తాం. ఒకవేళ అతను మా సోదర తెగ (ఖజ్రజ్)కు చెందినవాడయితే మీరు ఆజ్ఞాపించండి. మీ ఆజ్ఞను శిరసావహించడానికి మేము సిద్ధంగా ఉన్నాం."* అని చెప్పారు.

అయితే, అబ్దుల్లా బిన్ ఉబై తెగ ఖజ్రజ్ తెగకు నాయకుడైన 'సఅద్ బిన్ ఉబాదా (రజి)'కు ఈ మాటలు రుచించలేదు. ఆయనకు తెగ దూరాభిమానం పొడుచుకు వచ్చింది. వెంటనే సఅద్ (రజి) దిగ్గున లేచి, *"నువ్వు అబద్ధమాడుతున్నావు. నువ్వతడ్ని వధించలేవు. ఆ మనిషి ఖజ్రజ్ తెగకు చె౦దినవాడు గనక నువ్వతడ్ని హతమార్చుతానని అంటున్నావు. ఆ వ్యక్తి మీ తెగ వాడయితే నువ్వెన్నటికీ 'అతని శిరస్సు ఖండిస్తాం' అని చెప్పవు."* అన్నారు ఆవేశంతో.

*"నువ్వు కపటవిశ్వాసివి. అందుకే నువ్వు కపటుల్ని వెనకేసుకొస్తున్నావు."* అన్నారు హజ్రత్ ఉసైద్‌ బిన్ హుజైర్ (రజి).

అలా ఆ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి అవస్, ఖజ్రజ్‌ తెగల మధ్య పెద్ద రభస జరిగింది. ఇరువైపుల నుంచి కఠిన పదజాలాలు వెలువడనారంభించాయి. ఇంకాస్తయితే ఉభయ తెగలవారు మస్జిద్ లోనే ముష్టియుద్ధాలకు పాల్పడేవారు. కాని అంతలో దైవప్రవక్త (సల్లం) కల్పించుకొని సర్దిచెప్పారు. అంతటితో రభస సద్దు మణిగింది. దైవప్రవక్త (సల్లం) కూడా ఆ విషయాన్ని గూర్చి మరి మాట్లాడలేదు. కాస్సేపటి తరువాత అందరూ మస్జిద్ నుండి వెళ్ళిపోయారు.

కాని హజ్రత్ ఆయిషా (రజి)పై వచ్చిన అపనింద వదంతి నగరంలో ఇంకా చెలరేగుతూనే ఉంది. దాంతో ఆమె కన్నీరుమున్నీరుగా దుఃఖిస్తూనే ఉన్నారు. నిద్రాహారాలు కూడా మానేశారు. అలా ఏడుస్తూ గుండె పగిలి చనిపోతానేమో అని అనుకున్నారామె. ఇటు ప్రవక్త (సల్లం) కూడా ఆయిషా (రజి) పరిస్థితి చూసి లోలోన కుమిలిపోతున్నారు. ఆయిషా (రజి) తల్లిదండ్రులు కూడా ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేక పుట్టెడు దుఃఖంతో సతమతమవుతున్నారు.

*ఆయిషా (రజి) సఛ్ఛీలం గురించి అవతరించిన దైవవాణి : -*

చివరికి ఒక రోజు దైవప్రవక్త (సల్లం), దాదాపు నెలరోజుల తరువాత మొదటిసారిగా ఆయిషా (రజి) వద్దకు వెళ్ళారు. అప్పటికి ఆమె (రజి) ఇంకా తన పుట్టింట్లోనే ఉన్నారు. దైవప్రవక్త (సల్లం) అక్కడికి చేరుకున్నప్పుడు ఆయిషా (రజి) తన తల్లిదండ్రుల ముందు ఏడుస్తూ కూర్చున్నారు. అక్కడ మరో అన్సార్ మహిళ కూడా ఉంది. దైవప్రవక్త (సల్లం) వారందరికీ సలాం చేశారు. సద్వచనంతో కూడిన ఖుత్బా చదివిన తరువాత ఆయన (సల్లం), ఆయిషా (రజి)ని ఉద్దేశించి ఇలా అన్నారు....; ↓

*"ఆయిషా! ప్రజలు నీ గురించి ఏం అనుకుంటున్నారో నువ్వు విని ఉంటావు. నువ్వు ఏ తప్పు ఎరుగని దానివయితే, అల్లాహ్ స్వయంగా నీ నిర్దోషిత్వాన్ని లోకం ముందు చాటిచెబుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. ఒకవేళ నువ్వు దానికి ఒడిగట్టి ఉంటే మాత్రం పశ్చాత్తాపపడు, క్షమాభిక్ష కోసం అల్లాహ్ ను వేడుకో. ఎందుకంటే, దాసులు తన పాపాలను ఒప్పుకొని దైవం ఎదుట పశ్చాత్తాపపడితే, అల్లాహ్ క్షమిస్తాడు."* అని అన్నారు.

హజ్రత్‌ ఆయిషా (రజి) ఈ మాటలు విని మరింత బాధపడ్డారు.

తన తండ్రి అబూ బక్ర్ (రజి) వైపు చూస్తూ, *"నాన్నా! దైవప్రవక్త (సల్లం) అడిగిన మాటలకు మీరు సమాధానం చెప్పండి."* అన్నారు ఆమె (రజి).

*"తల్లీ! ఏం సమాధానమివ్వాలో నాకేమీ అర్థం కావడం లేదు."* అన్నారు హజ్రత్‌ అబూ బక్ర్‌ (రజి).

తర్వాత ఆయిషా (రజి), కందిపోయిన ముఖంతో తన తల్లి 'ఉమ్మె రూమాన్ (రజి)' వంక చూస్తూ, *"అమ్మా! నువ్వయినా దీనికి సమాధానం చెప్పు."* అని అన్నారు.

*"నేను మాత్రం ఏం చెప్పగలనమ్మా! నాక్కూడా ఏమీ అర్థం కావడం లేదు."* అన్నారు హజ్రత్ ఉమ్మె రూమాన్ (రజి).

అప్పుడు స్వయానా ఆయిషా (రజి)నే వారందరికి చాలా గట్టిగా జవాబు చెప్పారు....; ↓

*"దైవసాక్షి! నాకు తెలుసు. ఈ విషయాన్ని వినీ వినీ అది మీ హృదయాల్లో ముద్రించుకుపోయిందని. మీరంతా దీన్ని నిజం అని అనుకుంటున్నారు. కాబట్టి ఒకవేళ నేను ఇది తప్పు అని, నాకు దానితో ఏ సంబంధం లేదని చెప్పినా మీరు నమ్మరు. ఒకవేళ నేను దీన్ని ఒప్పుకుంటే, మీరు అది నిజమే అని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితులో, నాకూ మీకు నడుమగల విషయం అచ్చం 'హజ్రత్ యూసుఫ్ (అలైహి)' గారి తండ్రి చెప్పిన విషయం, 'సహనమే మేలైనది. మీరు చెప్పే విషయాలను గురించి నాకు అల్లాహ్ సహాయం ఒక్కటే చాలు' అన్నట్లు ఉంటుంది."* అన్నారు.

_↑ ఆయిషా (రజి), తన తల్లిదండ్రులకు మరియు దైవప్రవక్త (సల్లం)కు ఇచ్చిన ఈ సమాధానం గురించి వేరొక సీరతుల్ కితాబ్ ప్రకారం ↓_

ఆయిషా (రజి) తన తల్లిదండ్రులతో దైవప్రవక్త (సల్లం)కు సమాధానం ఇవ్వండి అని చెప్పారు. అయితే ఏమని సమాధానం ఇవ్వాలో వారికి తోచలేదు. అందుకని ఆమెయే స్వయంగా కల్పించుకొని, *"దైవసాక్షి! మీరందరూ నా గురించి ఏదో విని నమ్మేశారు. ఇప్పుడు నేను, 'నాకేమి తెలియదు, నేను నిర్దోషిని' అని అంటే, మీకు నా మీద నమ్మకం కలగదు. చేయని తప్పుని చేశానని నేను ఒప్పుకుంటే ఆ అబద్ధాన్ని మీరు నమ్మేస్తారు. ఏమైనా, నేను ఏ తప్పూ చేయలేదన్న సంగతి అల్లాహ్ కు బాగా తెలుసు."* అన్నారు.

ఈ సందర్భంగా ఆమె (రజి), యాఖూబ్ ప్రవక్త (అలైహి) పేరు గుర్తుతెచ్చుకోవటానికి ప్రయత్నించారు. కాని ఆ నిస్పృహ స్థితిలో ఆమె (రజి)కు ఆయన (అలైహి) పేరు గుర్తుకురాలేదు. *"'ఫసబ్రున్ జమీల్ (ఈ దుష్పరిణామాన్ని నేను అత్యుత్తమ సహనంతో ఎదుర్కొంటాను.)' యూసుఫ్ (అలైహి) తండ్రి చెప్పిన మాటలే నేను చెబుతున్నాను."* అని మాత్రం అనగలిగారు. ఆ తరువాత ఆయిషా (రజి) మరో ప్రక్కకు తిరిగి పడుకున్నారు.

అల్లాహ్ తనకు న్యాయం చేస్తాడని ఆయిషా (రజి) గట్టిగా నమ్మారు. అయితే తన సౌశీల్యతను ఋజువు చేస్తూ దైవసందేశం అంత త్వరగా అవతరిస్తుందనీ, ప్రళయదినం వరకూ తనకు సంబంధించిన వ్యాక్యాలు ముస్లిముల నోట పఠించబడతాయని ఆమె (రజి) అస్సలు ఊహించలేదు. ఏదో ఒక కల ద్వారా అల్లాహ్ దైవప్రవక్త (సల్లం)కు నిజం తెలియపరుస్తాడని ఆవిడ (రజి) భావించారు.

ఆ సమయంలోనే అనుకోకుండా ఒక్కసారిగా దైవప్రవక్త (సల్లం)ను ఒక విచిత్రమైన పరిస్థితి ఆవహించింది. ఆయన (సల్లం)పై దివ్యావిష్కృతి అవతరింపనారంభించింది. దాని తాలూకు ఆనవాళ్ళు ఆయన (సల్లం) ముఖారవిందంపై స్పష్టంగా కనిపించాయి. మెల్లగా మగతలోకి జారుకున్నారు. ఆయన (సల్లం) తల కింద ఒక దిండు ఉంచారు. ఈ హఠాత్పరిణామానికి అక్కడున్న వారంతా చాలా ఆందోళన పడ్డారు. కుటుంబసభ్యులందరూ ఆయన చుట్టుముట్టారు. తీవ్రమైన చలిలో సైతం ఆయన (సల్లం) నుదుటి నుంచి చెమట బిందువులు ముత్యాల్లా రాలిపడుతున్నాయి. ఊపిరి బిగబట్టి అందరూ మౌనంగా కూర్చొని ఉన్నారు. ఆయిషా (రజి) నిర్భయంగా ఉన్నారు. కాని ఆమె (రజి) తల్లిదండ్రులు ఆందోళనతో వణికిపోసాగారు.

కొద్దిసేపటి తర్వాత దివ్యవాణి అవతరణ కఠినత్వం పూర్తిగా తొలిగిపోగానే దైవప్రవక్త (సల్లం) మగత నుంచి తెరుకున్నారు. ఆయన (సల్లం) ముఖారవిందం ఆనందంతో కళకళలాడుతూ ఉంది. ఆయన (సల్లం) నోటి నుంచి వెలువడిన మొట్టమొదటి మాటలు, *"శుభాకాంక్షలు ఆయిషా! అల్లాహ్ నీ నిర్దోషిత్వానికి సంబంధించి ఋజువు పంపించాడు."* అని పలికారు.

ఈ సందర్భంలో *ఇఫ్క్* సంఘటనకు సంబంధించిన ఏ వాక్యాలు అయితే "నూర్" సూరాలో అవతరించాయో అవి....; ↓

*"ఇన్నల్లజీన జాఊబిల్ ఇఫ్కి ఉస్బతమ్ మిన్'కుమ్" (ఈ అభాండాన్ని సృష్టించి తీసుకువచ్చిన వారు, మీలోని ఒక వర్గం వారే).* (ఖుర్ఆన్ 24:11) నుండి ప్రారంభమవుతాయి.

_(ఈ సందర్భం గురించి బోధించే దివ్య ఖుర్ఆన్ 24:11 నుంచి 21 వరకు గల ఆయత్ లను In Sha Allah రేపటి భాగంలో మరింత వివరంగా తెలుసుకుందాం.)_

ఈ వ్యాక్యాలు వినగానే అందరి హృదయాల్లోనూ ప్రశాంతత నెలకొంది. ఆయిషా (రజి) తల్లి ఉమ్మె రూమాన్ (రజి) సంతోషం పట్టలేక తన కుమార్తె (రజి)తో, *"లే, లేచి దైవప్రవక్త (సల్లం)కు కృతజ్ఞత తెలుపుకో."* అని అంది.

కాని ఈ సంఘటన వల్ల బాగా మనస్తాపానికి గురైన ఆయిషా (రజి), *"నేను కృతజ్ఞతలు తెలుపుకోవలసినది ఆయనకో లేక మీ ఇద్దరికో (తల్లిదండ్రులకు) కాదు. నా నిర్దోషిత్వాన్ని ఋజువుచేసిన మహోన్నతుడైన అల్లాహ్ కు ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను."* అన్నారు.

ఆ తరువాత ఈ దైవసూక్తులు ఇతర విశ్వాసులకు కూడా తెలియజేయబడ్డాయి. దాంతో ముస్లింలందరూ సంతోషించారు.

తదుపరి ఈ అపవాదును, అభాండాన్ని విశ్వసించి ప్రచారం చేసిన నేరానికిగాను ముస్లిములైనటువంటి 'మిస్తహ్ బిన్ అసాసా (రజి)', 'హస్సాన్ బిన్ సాబిత్ (రజి)', 'హమ్నా బిన్తె హజష్ (రజి)'లకు ఎనభైయ్యేసి కొరడాల దండన విధించడం జరిగింది.★

_(★→ ఇస్లామీయ చట్టంలో ఎవరయితే ఒకరిపై వ్యభిచారానికి సంబంధించిన అపవాదు వేస్తాడో దానికి తగిన సాక్ష్యాలు చూపకపోతే (ఆ అపవాదు వేసేవానికి) ఎనభై కొరడాల శిక్ష విధించాలని ఉంది.)_

అయితే ద్రోహి, నీచుడు అయిన 'అబ్దుల్లా బిన్ ఉబై' వీపు, ఈ కొరడాల బారిన పడకుండా తప్పించుకుంది. అభాండాలు వేసిన వారిలో అగ్రగణ్యుడు. అతడే ఈ వ్యవహారంలో ప్రముఖ పాత్రను పోషించినవాడు. అతనికి శిక్ష పడకపోవడానికి కారణం బహుశా, ఎవరికయితే దైవం నిర్దేశించిన శిక్షలు పడతాయో, వారి కోసం పరలోకంలో పడబోయే శిక్షల్లో తగ్గింపుగాని, క్షమాపణగాని లభించడమే అయి ఉండవచ్చు. ఇహలోకంలో పడే శిక్ష వల్ల వారికి మన్నన లభించడం జరుగుతుంది. అల్లాహ్, అబ్దుల్లా బిన్ ఉబై కు పరలోకంలో భయంకరమైన శిక్షకు లోనుచేయదలచి ఉండడం వల్లనే ఇహలోక శిక్ష పడలేదు. ఈ కారణం మూలంగానే అతణ్ణి హతమార్చడం జరగలేదేమో.

ఇలా ఒక నెల తరువాతగాని మదీనా వాతావరణం నుండి అనుమాన మేఘాలు దూరం కాలేదు. అబ్దుల్లా బిన్ ఉబై అగౌరవంపాలై తిరిగి తల ఎత్తుకోలేకపోయాడు.

ఇబ్నె ఇస్'హాక్ కథనం ప్రకారం....; ↓

అబ్దుల్లా బిన్ ఉబై ఎప్పుడైనా నీచ కార్యానికి లేదా ముస్లిముల్లో భేదాభిప్రాయాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే స్వయంగా అతని జాతివారే అతణ్ణి ఎత్తిపొడుస్తూ తిట్టేవారు. అతని ఈ పరిస్థితిని చూసి దైవప్రవక్త (సల్లం) ఉమర్ (రజి)తో, *"చూశావా ఉమర్! నీవు అతణ్ణి చంపివేయమని సలహా ఇచ్చిన నాడే అతణ్ణి హతమార్చి ఉన్నట్లయితే ప్రజలు మనలను తూలనాడేవారు కాదా? కాని ఈ రోజు అతనికి మరణ శిక్షను విధిస్తే వారే ఆ పని చేసిపెట్టేటట్లు ఉన్నారు."* అని అనగా; ఉమర్ (రజి), *"దైవసాక్షి! ఈ విషయం నాకు బాగా అర్థం అయిపోయింది. దైవప్రవక్త (సల్లం) నిర్ణయమే నా నిర్ణయం కంటే మేలైన నిర్ణయం."* అని అన్నారు.

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

282

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 282*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 197*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*హజ్రత్ జువైరియా (రజి)తో దైవప్రవక్త (సల్లం) వివాహం : -*

దైవప్రవక్త (సల్లం) యుద్ధరంగం నుంచి మదీనాకు తిరిగివచ్చాక యుద్ధంలో లభించిన సమరసోత్తును యోధులకు పంచి పెట్టారు. సమరసొత్తులో అపార ధనం, ఆయుధాలతో పాటు స్త్రీ పురుష ఖైదీలు కూడా ఉన్నారు.

యుద్ధ ఖైదీలలో బనీ ముస్తలిక్ తెగ నాయకుడు 'హారిస్' కుమార్తె 'జువైరియా (రజి)' కూడా ఉన్నది. ఈమె 'హజ్రత్ సాబిత్ బిన్ ఖైస్ (రజి)'కు లభించిన వాటాలో వచ్చింది.

నిన్నటిదాకా స్వేచ్ఛావాయువుల్ని పీల్చుతూ కాలం గడిపిన జువైరియా (రజి)కు ఇప్పుడిలా బానిసగా ఉండాలంటే మనసు ఒప్పడం లేదు. యజమాని సాబిత్ (రజి)కు కొంత డబ్బిచ్చి బానిస బ్రతుకు నుండి బయటపడదామనుకుంది. ఆ విషయాన్ని గురించి ఆమె హజ్రత్ సాబిత్ (రజి) దగ్గర ప్రస్తావించింది. దానికి ఆయన సంతోషంగా అంగీకరించారు.

యజమాని తనకు స్వేచ్ఛనివ్వడానికయితే అంగీకరించాడు. మరి అందుకు ప్రతిఫలంగా ఆయనకు డబ్బివ్వాలి కదా! అదెలా లభిస్తుంది? ఈ విషయంలో ఆమె దైవప్రవక్త (సల్లం) సహాయం అర్థించడానికి వెళ్ళింది.

*"అయ్యా! నేను హారిస్ కూతుర్ని. నా పేరు జువైరియా. మా నాన్న మా తెగకంతటికీ నాయకుడు. నేనిక్కడ ఎలాంటి ఆపదలో చిక్కుకున్నానో మీకు తెలుసు. నేను సాబిత్ (రజి) గారికి లభించిన వాటాలో వచ్చాను. ఆయన నాకు స్వేచ్ఛనివ్వడానికి ఒప్పుకున్నారు. ఈ విషయంలో నేను మీ సహాయం కోరడానికి వచ్చాను."* అన్నది ఆమె.

*"దానికంటే మంచి మార్గం మరొకటి చెప్పనా?"* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"చెప్పండి"* అన్నది జువైరియా ఉత్సాహంతో.

*"సాబిత్ కు నువ్వు చెల్లించాల్సిన పైకం మొత్తం నేనే చెల్లిస్తాను. నిన్ను అనాథగా వదలిపెట్టకుండా వివాహం కూడా చేసుకుంటాను."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"మహాప్రసాదం! దైవప్రవక్తా! మహాప్రసాదం!! అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? నాకు ముమ్మాటికి ఇష్టమే"* అన్నది ఆమె విప్పారిన ముఖంతో.

అంతేకాదు, అప్పటికప్పుడు ఆమె సత్యధర్మాన్ని విశ్వసించి ముస్లింగా మారిపోవడం కూడా జరిగింది. దాంతో ఆమె అదృష్టతార మరింత ప్రకాశించింది.

హజ్రత్ జువైరియా (రజి) ఇప్పుడు సాధారణ ముస్లిం మహిళ కాదు. ఆమె దైవప్రవక్త (సల్లం) అర్థాంగి. యావత్ ముస్లిం సమాజానికే మాతృమూర్తి. పవిత్ర స్త్రీల జాబితాలో చేరి ప్రథమాంకంలో నిలచిన మహిళా జ్యోతి.

ఈ శుభవార్త తెలిసి ముస్లిములు ఆనందభరితులయ్యారు. వెంటనే వారు తమ దగ్గరున్న బనీ ముస్తలిక్ తెగ బానిసలందరినీ బానిసత్వం నుండి విముక్తం చేశారు.

*"ఇప్పుడు వీరు దైవప్రవక్త (సల్లం)కు సన్నిహితులు. ఆయన శ్రీమతి హజ్రత్ జువైరియా (రజి) తరఫు బంధువులు. అందువల్ల వీరిప్పుడు ఎంతో గౌరవనీయులు."* అన్నారు ముస్లిములు బనీముస్తలిక్ తెగవారికి అమితమైన గౌరవమిస్తూ.

*"జువైరియా ఎంతటి శుభప్రదమైన స్త్రీ! ఆమె మూలాన ఆమె తెగవాళ్ళందరికీ స్వేచ్ఛ లభించింది. ఏ స్త్రీకి ఇంతటి మహాభాగ్యం లభించలేదు. ఈ ఆమె ప్రతిష్ఠ ఆమె ఒక్క దానికే లభించింది."* అన్నారు హజ్రత్ ఆయిషా (రజి) ఈ శుభవార్త విని.

   *గజ్వయె బనీ ముస్తలిక్ తరువాత చేపట్టిన సైనిక చర్యలు*

*1. సరియ్యా దయారె బనీ కల్బ్ (దూమతుల్ జందల్ ప్రాంతం) : -*

ఈ సైనిక పటాలాన్ని 'హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి)' గారి సారథ్యంలో షాబాన్ నెల హి.శ - 6లో పంపడం జరిగింది. దైవప్రవక్త (సల్లం) ఆయన్ను తన ఎదురుగా కూర్చోబెట్టుకొని స్వయంగా తన చేతి మీదుగా ఆయన తలపై తలపాగా కట్టారు. యుద్ధంలో మేలైన తీరును అవలంబించమని హితవు జేస్తూ, "వారే గనక మీకు విధేయులైపోతే వారి రాకుమార్తెను వివాహమాడండి" అని చెప్పి సాగనంపారు.

అచ్చం దైవప్రవక్త (సల్లం) గారు చెప్పినట్లే జరిగింది. హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి), 'తమాజిర్ బిన్తె అజ్బగ్'ను వివాహమాడారు. ఆ తరువాత ఈమె అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) గారి కుమారుడు 'అబూ సల్మా'కు తల్లి అయింది. ఈ మహిళ తండ్రి తన జాతికి చెందిన సర్దారు మరియు రాజు కూడాను.

*2. సరియ్యా దయారె బనీ సఅద్ (ఫిదక్ ప్రాంతం) : -*

ఈ సైనిక పటాలం 'హజ్రత్ అలీ (రజి)' గారి నేతృత్వంలో షాబాన్ నెల హి.శ - 6లోనే పంపబడింది. ఈ సైనిక చర్యకు గల కారణం, బనూ సఅద్ తెగ ఓ యూదుల సైన్యానికి సహాయం అందిస్తూ ఉంది అనే వార్త అందడమే. కాబట్టి దైవప్రవక్త (సల్లం) హజ్రత్ అలీ (రజి) గారికి తోడు రెండు వందల సైనికుల నిచ్చి పంపించారు. వీరు రాత్రి పూట ప్రయాణిస్తూ పగలు దాగి ఉండేవారు. చివరికి వారికి ఓ వేగులవాడు పట్టుబడ్డాడు. అతను, యూదులకు ఖర్జూరాలు సరఫరా చేసేందుకు సహాయం చేయడానికి సిద్ధపడ్డాడన్న విషయాన్ని అంగీకరించాడు. అదే కాకుండా ఆ వేగులవాడు, బనూ సఅద్ ఏ ప్రదేశంలో ప్రోగై ఉన్నారో కూడా తెలిపాడు. హజ్రత్ అలీ (రజి), వారిపై రాత్రి పూట దాడి చేసి అయిదువందల ఒంటెల్ని, రెండు వేల మేకల్ని హస్తగతం చేసుకున్నారు. అయితే బనూ సఅద్ తమ భార్యాపిల్లలతో సహా పారిపోవడంలో కృతకృత్యులయ్యారు. వారి సర్దారు పేరు 'వబ్ర్ బిన్ అలీమ్'.

*మిగిలినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

283

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 283*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 198*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

*3. సరియ్యా వాదియుర్ ఖురా (ఖురా లోయ) : -*

ఈ సైనిక చర్య 'హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజి)' లేదా 'హజ్రత్ జైద్ బిన్ హారిసా (రజి)' గారి నేతృత్వంలో రమజాన్ మాసం హిజ్రీ శకం - 6లో పంపబడిన సైనిక చర్య. ఈ సైనిక పటాలాన్ని పంపడానికి గల కారణం, ఫజారా తెగకు చెందిన ఓ శాఖ, మోసంతో దైవప్రవక్త (సల్లం)ను హతమార్చే పథకం వేయడమే. కాబట్టి మహాప్రవక్త (సల్లం) హజ్రత్ అబూ బక్ర్ (రజి)ను పంపించడం జరిగింది. హజ్రత్ సల్మా బిన్ అకూ (రజి) ఆయన వెంట ఉన్నారు. హజ్రత్ సల్మా బిన్ అకూ (రజి) గారి కథనం ప్రకారం....; ↓

*"ఈ సరియ్యాలో నేను కూడా అబూ బక్ర్ (రజి) వెంటే ఉన్నాను. మేము ఫజ్ర్ నమాజు చేసిన తరువాత హజ్రత్ అబూ బక్ర్ (రజి) దాడి చేయమని ఆదేశించగానే మేము వారిపై దాడి చేశాము. అక్కడున్న ఊట బావిని హస్తగతం చేసుకున్నాము. అబూ బక్ర్ (రజి) కొందరిని చంపేశారు. నేను, స్త్రీలు పిల్లలు కలిగిన ఓ గుంపును చూశాను. వీరు నా కంటే ముందు కొండపైకి వెళ్ళిపోతారేమోననే అనుమానం కలిగింది నాకు. కాబట్టి నేను వారిపై బడ్డాను వారికి, కొండకు నడుమన ఉండి వారిపై శరపరంపరలను కురిపించగా వారు అక్కడనే ఆగిపోయారు. ఆ గుంపులో 'ఉమ్మె ఖర్ఫా' పేరు గల ఓ మహిళ కూడా ఉంది. ఆమె పాత చొక్కాను తొడుక్కొని ఉంది. ఆమె వెంట ఆమె కుమార్తె కూడా ఉంది. ఈమె అరేబియాలోనే అతి అందగత్తెగా పేరుగాంచిన స్త్రీ. వారందరినీ అబూ బక్ర్ (రజి) దగ్గరకు తీసుకొని వచ్చాను. ఆయన ఆ అమ్మాయిని నాకు బహుకరించారు. కాని నేను ఆమె ముసుగును మాత్రం తొలగించలేదు."*

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) ఈ యువతిని హజ్రత్ సల్మా బిన్ అకూ నుండి వేరు చేసి మక్కాకు పంపించారు. ఆమెకు బదులు అక్కడ నివసించే అనేక మంది ముస్లిము ఖైదీలను విడిపించడం జరిగింది.★

_(★→ చూడండి, సహీ ముస్లిం - 2/89; ఈ సరియ్యా హిజ్రీ శకం - 7లో సంభవించింది అని చెప్పుకోవడం కూడా జరిగింది.)_

ఉమ్మె ఖర్ఫా ఓ షైతాను స్త్రీ. దైవప్రవక్త (సల్లం)ను హతమార్చడానికి అనేక పన్నాగాలు పన్నేది. దీని కోసమని ఆమె తన కుటుంబానికి చెందిన ముప్పై మంది ఉష్ట్రారోహుల్ని సిద్ధపరచి ఉంచింది కూడా. దానికి ఆమెకు సరియైన ప్రతిఫలమే లభించింది. ఆ ముప్పై మంది ఉష్ట్రారోహులు చంపివేయబడ్డారు.

*4. సరియ్యా ఉర్ నియ్యీన్ : -*

ఈ సైనిక పటాలం షవ్వాల్ నెల హిజ్రీ శకం - 6లో, 'హజ్రత్ కర్జ్ బిన్ జాబిర్ ఫహరీ (రజి)'■ గారి నేతృత్వంలో పంపబడింది. అక్ల్ మరియు ఉరీనాకు చెందిన కొందరు వ్యక్తులు మదీనాకు వచ్చి ఇస్లాం స్వీకరించారు. వారు మదీనాలో ఉంటూ ఉండగా అక్కడి వాతావరణం వారికి సరిపడక రోగగ్రస్తులయ్యారు. దైవప్రవక్త (సల్లం) వారికి కొన్ని ఒంటెలనిచ్చి పచ్చికబయళ్ళలలో ఉంటూ ఒంటెల పాలు, దాని మూత్రం త్రాగుతూ ఉండండి అని పంపించారు. వీరు అలా చేసి ఆరోగ్యవంతులయ్యారు. దైవప్రవక్త (సల్లం)గారు, వారి వెంట పంపించిన కాపరిని హతమార్చి వారు ఒంటెల్ని తోలుకొని వెళ్ళిపోయారు. అంటే, ఇస్లాం స్వీకరించిన తరువాత తిరిగి ముర్తిద్ లు (ధర్మభ్రష్టులు) అయ్యారన్నమాట. కాబట్టి వారిని పట్టుకోవడానికిగాను కర్జ్ బిన్ జాబిర్ ఫహరీ (రజి)కి ఇరవై మందిని ఇచ్చి పంపించడం జరిగింది. పోయేటప్పుడు దైవప్రవక్త (సల్లం) అల్లాహ్ ను ఇలా వేడుకున్నారు.

*"ఓ అల్లాహ్! ఉర్నీలకు మార్గం అగుపడకుండా చెయ్యి. వారి మార్గాన్ని కష్టతరం చెయ్యి."*

అల్లాహ్, ప్రవక్త (సల్లం) గారి ఈ దుఆను మన్నించాడు. వారికి మార్గం ఏమీ తోచలేదు. వారు పట్టుబడిపోయారు. వారు ముస్లిం కాపరులు ఎడల అవలంబించిన తీరుకు ప్రతీకారంగా వారి కాళ్ళు చేతులు నరికి వేయడం, వారి కళ్ళకు వాతలు పెట్టడం జరిగింది. అలా వారిని హర్రాలోని ఓ మారుమూల ప్రదేశంలో వదిలేయడం వల్ల అక్కడే అంతమైపోయారు.

ఈ సంఘటన 'హజ్రత్ అనస్ (రజి)'గారు ఉల్లేఖించినట్లు సహీ బుఖారీ వగైరా గ్రంథాల్లో ఉంది.

సీరత్ చరిత్రకారులు ఆ తరువాత మరో సరియ్యా గురించి రాస్తారు. అది 'హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి)', 'హజ్రత్ సల్మా బిన్ అబీ సల్మా (రజి)' కలిసి షవ్వాల్ నెల హిజ్రీ శకం - 6లో నడిపినట్లుగా చెప్పబడుతోంది. దీని వివరాల్లోనికి వెడితే, హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి), అబూ సుఫ్'యాన్ ను హతమార్చే ఉద్దేశ్యంతో మక్కాకు వెళ్ళారు. ఎందుకంటే, అబూ సుఫ్'యాన్ ఓ బద్దూ (పల్లెవాసి)ను, దైవప్రవక్త (సల్లం)ను హతమార్చే ఉద్దేశ్యంతో మదీనాకు పంపించడం జరిగింది. అయితే ఆ ఉభయుల్లో ఏ ఒక్కరూ తాము చేపట్టిన కార్యంలో కృతకృత్యులు కాలేకపోయారు.

       అహ్జాబ్ యుద్ధం మరియు బనీ ఖురైజా గజ్వా తరువాత చోటు చేసుకున్న సరాయాలు మరియు గజ్వాలు ఇవి. వీటిలో ఎలాంటి భయంకరమైన యుద్ధమూ జరగలేదు. కేవలం మామూలు దాడులు మాత్రమే జరిగాయి. కాబట్టి వీటిని పోరాటాలకు బదులు సైనిక చర్యలుగానే చెప్పుకోవడం సమంజసమైన విషయం. ఇవి కేవలం సైనిక కవాతుల్లాంటివి. వీటి ఉద్దేశ్యం బద్దూలను, శత్రువులను భయభీతులు చేయడమే అని చెప్పవచ్చు. ఆ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తే, అహ్జాబ్ యుద్ధం తరువాత వాటిలో మార్పు రావడం గమనించవచ్చు. ఇస్లాం విరోధులు ధైర్యాలు దెబ్బతినసాగాయి. ఇక ఇస్లాం ప్రాభవాన్ని భంగపరచి ఇస్లామీయ ప్రచారాన్ని అడ్డుకోవడంలో ఎలాంటి ఆశ వారిలో మిగిలిలేదు. కాని ఈ మార్పు ప్రస్ఫుటంగా అగుపించింది ముస్లిములు *హుదైబియా ఒప్పందం* చేసుకున్నప్పుడు మాత్రమే. ఈ ఒప్పందం అసలు ఇస్లామీయ శక్తిని గుర్తించి చేసుకున్న ఒప్పందం. ఆ కాలంలో ఈ శక్తికి అరేబియా ద్వీపకల్పంలో వ్యాపింపజేయకుండా ఉండడానికి ఏ శక్తీ అడ్డుకోజాలదు అనే యదార్థాన్ని చాటి చెప్పిన ఒప్పందం అది.

_(■→ బద్ర్ యుద్ధానికి పూర్వం గజ్వయె సఫ్'వాన్ లో మదీనా పశువులపై దాడి చేసి వాటిని మక్కాకు తోలుకుపోయిన 'వర్జ్ బిన్ జాబిర్ ఫహరీయే ఈయన. ఆ తరువాత ఆయన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి మక్కా విజయం సందర్భంగా అమరగతినొందారు.)_

*In Sha Allah రేపటి భాగంలో....; ↓*

*హుదైబియా ఒప్పందం*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*