284

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 284*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 199*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

        *హుదైబియా ఒప్పందం : - 1*
       *(జీఖాదా మాసం, హిజ్రీ శకం - 6)*

*ఉమ్రా కొరకు వెళ్ళడానికి గల కారణాలు : -*

అరేబియా ద్వీపకల్పంలో పరిస్థితులు చాలామటుకు ముస్లింలకు అనుకూలంగా మారిపోయినందున ఇస్లామీయ సందేశ ప్రచారం విజయవంతం అవుతుందనే శుభ సూచనలు ఒక్కొక్కటిగా స్పష్టంగా గోచరించసాగాయి. ఆరు సంవత్సరాల వరకు ముస్లింల కొరకు మూయబడిన 'మస్జిదె హరాం' ద్వారాలు తెరుచుకొని, వారి ఆరాధనకు అడ్డు తగిలిన పరిస్థితులు కూడా మారిపోనారంభించాయి.

*ప్రవక్త (సల్లం) స్వప్న వృత్తాంతం : -*

ఒకరోజు రాత్రి దైవప్రవక్త (సల్లం)కు, తాము, తమ అనుచరగణం కలసి మస్జిదె హరాంలో ప్రవేశిస్తున్నట్లుగా, ఆయన (సల్లం) కాబా తాళపు చెవులను తన చేతిలో తీసుకొని సహాబా (రజి)తో సహా బైతుల్లాహ్ (కాబా) తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తున్నట్లుగా, కొందరు తల వెంట్రుకలను గొరిగించుకున్నట్లుగా, మరికొందరు వెంట్రుకల్ని కత్తిరించుకున్నట్లుగా కలలో చూయించడం జరిగింది. దైవప్రవక్త (సల్లం)కు కల వచ్చిందంటే అది దాదాపు 'వహీ' (దైవవాణి) వంటిదే.

ఆ రోజు నిద్రలేవగానే ఆయన (సల్లం) ముఖారవిందం ఆనందంతో కాంతులీనసాగింది. తన సహచరులందరినీ ఆయన (సల్లం) మస్జిద్ వద్దకు రమ్మని కబురు చేశారు. దైవప్రవక్త (సల్లం) తమల్ని అందరినీ ఒకేసారి రమ్మని కబురు పంపారంటే, ఎంతో ముఖ్యమైన సమాచారం తెలియజేయటానికే అయివుంటుందని వారికి బాగా తెలుసు. సహచరులు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దైవప్రవక్త (సల్లం) చెప్పిన చోటికి చేరుకున్నారు. దైవప్రవక్త (సల్లం) తాను చూసిన కల గురించి సహచరులకు వివరిస్తూ ఇలా అన్నారు....; ↓

*"విశ్వాసులారా! ముస్లింలు నిర్భయంగా మక్కాలో ప్రవేశిస్తున్నట్టు నేను కలలో చూశాను. కనుక మీరు త్వరలోనే (కాబా) ప్రతిష్ఠాలయంలో ప్రవేశించబోతున్నారు. దైవచిత్తమయితే మీరు తప్పకుండా ప్రతిష్ఠాలయంలో ప్రవేశిస్తారు. ఎలాంటి భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా ప్రవేశిస్తారు. కనుక ఉమ్రా యాత్ర చేసిరావటానికి మక్కా వెళ్ళేందుకు సిద్ధమవ్వండి. కాబా గృహానికి గౌరవంగా బలి ఇచ్చేందుకుగాను జంతువులను కూడా వెంట తీసుకురండి."* అని సూచించారు.

ఈ శుభవార్త వినగానే సహాబా (రజి)లు ఆనందపరవశులయ్యారు. ఈ సంవత్సరమే తమకు మక్కాలో ప్రవేశించే భాగ్యం లభిస్తుందని తలపోశారు. ఇది దైవనిర్ణయమని, ఈ శుభవార్త వినిపించింది దైవప్రవక్త (సల్లం) అని వారికి తెలుసు. అందువల్ల ఇక తాము తప్పకుండా 'కాబా'ను సందర్శించగలమని దృఢంగా నమ్మారు.

మదీనాలో ఉంటున్న మక్కావాసులకు ఈ వార్త ఎనలేని సంతోషాన్ని కలిగించింది. ఎందుకనగా, మక్కా పట్టణం ముస్లింల ప్రియనగరం. కాని శత్రువులు వారిని అనేక హింసలు పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోయేలా చేశారు. దైవధర్మం కోసం, దైవప్రీతి కోసం వారు మాతృభూమిపై ఉన్న మమకారాన్ని బలవంతంగా చంపుకొని, ఆవేదనాభరిత హృదయాలతో మక్కా వదలి మదీనాకు వలస పోవలసి వచ్చింది.

అటువంటి విపత్కర పరిస్థితుల్లో మదీనాకు వలస వచ్చిన విశ్వాసులకు, ఆరు సంవత్సరాల తరువాత, కాబా గృహం పట్ల గౌరవభావంతో ఉమ్రా యాత్ర చేసేందుకు, తమ సొంత గడ్డపై మళ్ళీ అడుగుపెట్టే అవకాశం లభిస్తున్నందుకు ఎంతగానో పొంగిపోయారు. మక్కాలో నిర్భందించబడ్డ తమ భార్యాపిల్లల్ని, బంధుమిత్రుల్ని కలుసుకోబోతున్నామన్న వార్త ఆ వలస జీవుల మనసుల్ని పులకింపజేసింది.

అందువల్లనే దైవప్రవక్త (సల్లం) నోట ఈ శుభవార్త వెలువడగానే వారి ఆనందం అవధులు దాటింది. ముందెన్నడూ లేనంత ఉత్సాహంతో ఇళ్ళకు వెళ్ళి తమ కుటుంబసభ్యులకు, ఇతర బంధుమిత్రులకు ఈ శుభవార్త తెలియజేశారు.

అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ముస్లింలు మక్కాలో ప్రవేశించడం సాధ్యమవుతుందా? కాబా గృహాన్ని ఎలా సందర్శించగలుగుతారు? అసలే ఖురైషీయులు ముస్లింల పేరు వింటేనే మండిపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మక్కాలో అడుగుపెట్టేందుకు వారితో యుద్ధం చేయవలసి వస్తుందా? లేక వారే మక్కా వీడిపోతారా? పరిస్థితి అర్థంకాక ముస్లింలు తికమక పడుతున్నారు. 

ఆ తరువాత కొన్ని రోజులకే దైవప్రవక్త (సల్లం) కాబా యాత్ర ప్రకటన గావించారు. ఈ ప్రకటన వినగానే ముస్లింలు ప్రయాణ సన్నాహాలు ప్రారంభించారు. బలి పశువుల్ని కూడా సిద్ధం చేసుకోసాగారు.

దైవప్రవక్త (సల్లం) మదీనా చుట్టుపట్ల ఉన్న తెగల్లో, తన వెంట ఉమ్రా చేయడానికి బయలుదేరమని ప్రకటన చేయించారు. కొన్ని తెగలు దైవప్రవక్త (సల్లం)గారి ఆదేశాన్ని శిరోధార్యంగా భావించి తక్షణమే ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని మదీనా చేరుకున్నారు. అయితే కొన్ని తెగలు మాత్రం మక్కా బయలుదేరాడానికి బద్ధకం చేశాయి. మరికొందరయితే సాకులు చూపారు.

*"దైవప్రవక్తా! మేము ఈ సంవత్సరం అనేక సమస్యల్లో చిక్కుకొని ఉన్నాము. మోయలేని ఆపదలు వచ్చి పడ్డాయి. సంతానం, సిరిసంపదలు మా కాళ్ళకు బంధాలు వేశాయి."* అంటూ రకరకాల సాకులు చెప్పారు వారు. అంతటితో వారు మౌనంగా ఉండలేదు. *"చూశారా ఈ పిచ్చివాళ్ళు ఏం చేయబోతున్నారో! మక్కా వెళ్ళి పర్వతాలను ఢీకొనబోతున్నారు, పులులతో చేలగాటమాడబోతున్నారు!! అసలు అక్కడికి పోయి ఒక్కడయినా ప్రాణాలతో తిరిగివస్తాడా అని?"* ఈ విధంగా వారు తమ సమావేశాల్లో ముస్లింలను హేళన చేయడం ప్రారంభించారు.

ఈ మాటలు కొందరు ముస్లిం ప్రముఖుల చెవుల్లో పడ్డాయి. హజ్రత్ ఉమర్ (రజి) వారి మాటలు విని పళ్ళు పటపట నూరారు. *"దైవప్రవక్తా! ఈ దుర్మార్గుల తలల్ని నరికివేయాలి."* అన్నారు ఆవేశంతో.

కాని విశ్వకారుణ్యమూర్తి (సల్లం) అందుకు ఒప్పుకోలేదు. ప్రయాణానికి సిద్ధంకమ్మని ఆయన అనుచరులను ఆదేశించారు.

*ఉమ్రా సంకల్పంతో మదీనా వీడిన ముస్లింల బృందం : -*

ఉమ్రా యాత్ర గురించి ప్రకటన గావించటం వల్ల, యాత్ర గురించిన సమాచారం మదీనాలో, మదీనా చుట్టు ప్రక్కల గ్రామాల్లో దావానంలా వ్యాపించింది. మదీనా నగరం నలువైపులా నుంచి తండోపతండాలుగా, జన ప్రవాహం కదిలివచ్చింది. దైవప్రవక్త (సల్లం) కలను నిజం చేయటానికి, తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకోవటానికి ప్రజలు గుంపులుగా గుంపులుగా వచ్చి దైవప్రవక్త (సల్లం) దగ్గర చేరారు.

ప్రయాణ సన్నాహాలు పూర్తయ్యాయి. దైవప్రవక్త (సల్లం), మదీనా వ్యవస్థను పర్యవేక్షించడానికి 'ఇబ్నె ఉమ్మె మక్తూమ్ (రజి)', మరో ఉల్లేఖనంలో, 'నమీలా లైసీ (రజి)'ను నియమించి తన 'ఖస్వా' పేరు గల ఒంటెనెక్కి, జీఖాదా మాసం ఒకటవ తేదీ (హిజ్రీ శకం - 6) సోమవారం రోజున బయలుదేరారు.

మహాప్రవక్త (సల్లం) గారి వెంట ఉమ్ముల్ మోమినీన్ (ముస్లిముల మాతృమూర్తి) హజ్రత్ ఉమ్మె సల్మా (రజి) కూడా ఉన్నారు. మొత్తం బయలుదేరి వెళ్ళిన సహాబా (రజి)ల సంఖ్య పదునాలుగు వందలు (పదిహేను వందలు అని ఓ ఉల్లేఖనంలో ఉంది).

ముస్లింల వెంట డెబ్భై బలిపశువులు ఉన్నాయి. ఖడ్గాలు, ధనుర్బాణాలు తప్ప ఇతరత్రా ఆయుధాలు ఏమీ లేవు. కేవలం ప్రయాణంలో వెంట ఉంచుకునే ఆయుధాలు అంటే ఒరలోనే ఉన్న ఖడ్గాలు తప్ప మరే ఆయుధాలు వారి వద్ద లేవు.

*దైవప్రవక్త (సల్లం), తన అనుచరుల్ని వెంటబెట్టుకొని ఉమ్రా యాత్రకు బయలుదేరారని ఖురైషీయులకు అందిన సమాచారం : -*

అటు మక్కాలో ఖురైషీయులకు, దైవప్రవక్త (సల్లం) వేలాది అనుచరుల్ని వెంటబెట్టుకొని మక్కా వస్తున్నారని తెలిసింది. ఇంకేముంది! వారి గుండెలు పగిలినంత పనయింది. తమతో యుద్ధాలు చేసిన ముహమ్మద్ (సల్లం) మళ్ళీ మక్కా ముఖం చూస్తారనుకోలేదు వారు. కాని ఇప్పుడెలా?

వారికి సావకాశంగా ఆలోచించి తగిన పథకం రూపొందించుకునేంత వ్యవధి కూడా లేదు. అయితే సైనికుల్ని మాత్రం ఆదరాబాదరాగా సమీకరించుకున్నారు. సైన్యాధికారులుగా ఖాలిద్ బిన్ వలీద్, ఇక్రమా బిన్ అబూ జహల్ లు నియమితులయ్యారు. వీరిద్దరూ మక్కా దారిలో ఓ చోట ముస్లింల కోసం మాటుకాచి కూర్చున్నారు.

*మక్కా వైపునకు ముస్లింల కదలిక : -*

దైవప్రవక్త (సల్లం) మక్కా వైపునకు బయలుదేరి ప్రయాణం చేస్తూ 'జుల్ హలీఫా' అనే ప్రదేశానికి వెళ్ళి 'హదీ'★ పశువుల మెడల్లో పట్రాలు తొడిగారు. ఒంటెల మూపరాలను చీల్చి గుర్తులు పెట్టి ఉమ్రా ఎహ్రామ్ కట్టుకున్నారు. ఇలా చేయడం వల్ల చూసేవారు, వారు యుద్ధం చేయడానికి రాలేదని తెలియపరచడం.

_(★→ 'హదీ' అంటే హజ్ లేదా ఉమ్రాకు వెళ్ళేవారు 'మినా' అనే ప్రదేశంలో జిబహ్ చేసే జంతువులు. అరేబియా సంప్రదాయం ప్రకారం, హదీ పశువు మేక లేక గొర్రె అయినట్లయితే అది జిబహ్ చేసే జంతువు అని తెలియడానికిగాను దాని మెడలో ఖలాదా (పట్టా) వేసేవారు. అదే ఒంటె అయితే దాని మూపరాన్ని చీల్చి దానిపై రక్తం పులిమేవారు. అరబ్బులు ఇలాంటి జంతువు జోలికి పోయేవారు కారు. ఆ తరువాత ఇస్లామీయ ధర్మశాస్త్రం ఆ సంప్రదాయాన్నే కొనసాగించింది.)_

*మిగిలినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

285

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 285*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 200*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 2*

*మక్కా వైపునకు ముస్లింల కదలిక : -*

దైవప్రవక్త (సల్లం) మక్కా వైపునకు బయలుదేరి ప్రయాణం చేస్తూ 'జుల్ హలీఫా' అనే ప్రదేశానికి వెళ్ళి 'హదీ' పశువుల మెడల్లో పట్రాలు తొడిగారు. ఒంటెల మూపరాలను చీల్చి గుర్తులు పెట్టి ఉమ్రా ఎహ్రామ్ కట్టుకున్నారు. ఇలా చేయడం వల్ల చూసేవారు, వారు యుద్ధం చేయడానికి రాలేదని తెలియపరచడం.

అలా చేసిన తరువాత, మక్కా పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఖురైషీయులు ఏమనుకుంటున్నారో తెలుసుకురమ్మని ప్రవక్త (సల్లం), 'బనీ ఖుజాఅ' తెగకు చెందిన 'బిషర్ బిన్ సుఫ్యాన్'ని మక్కాకు పంపడం జరిగింది.

బనీ ఖుజాఅ తెగ ముస్లింల మిత్రపక్షం. బిషర్ కూడా ముస్లింల సానుభూతిపరుడే. అందువల్ల అతను ఖురైషీయులను గురించి నిజమైన సమాచారమే చెబుతాడని దైవప్రవక్త (సల్లం)కు పూర్తి నమ్మకం.

ముస్లిములు ప్రయాణిస్తూ 'అస్ఫాన్' దాపుకు చేరగానే బిషర్ బిన్ సుఫ్యాన్ వచ్చి ప్రవక్త (సల్లం)తో, *"దైవప్రవక్తా! మీరు చెప్పినట్టుగానే నేను మక్కా వెళ్ళివచ్చాను. మీ కల గురించి, మీ మక్కా ప్రయాణం గురించి వారికి తెలిసిపోయింది."* అని సమాచారం అందించాడు.

*"మక్కా వారి స్పందన ఎలా ఉంది?"* అని దైవప్రవక్త (సల్లం) అడిగారు.

దానికి సమాధానమిస్తూ అతను, *"వాళ్ళంతా ఏకమయి, మిమ్మల్ని మక్కాలోకి రానీయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నారండీ! కఅబ్ బిన్ లువై అనేవాడు తమతో ఢీకొనడానికి అహాబీష్ ను (మిత్రపక్షాల సైన్యాన్ని) సమీకరిస్తున్నాడు, తమరు కాబా గృహానికి వెళ్ళకుండా అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్నాడు."* అని వార్తనందించాడు.

ఈ వార్త అందిన తరువాత మహాప్రవక్త (సల్లం) తన సహచరులను సంబోధిస్తూ, *"వీరు ఖురైష్ కొమ్ముకాస్తున్నారు. అందుకని మనం వారి కుటుంబాలపై విరుచుకుపడి వారిని ఎందుకు పట్టుకోకూడదు? మనం అలాగే మిన్నకుండిపోతే వారు, మనం యుద్ధం వల్ల ఏర్పడిన దుఃఖం వల్ల మిన్నకుండిపోయాము అని అనుకుంటారు. మీ సలహా ప్రకారం మనం కాబా గృహం వైపునకు ప్రయాణించి ముందుకు వెళితే మనకు ఎదురైన వారితో తలపడాల్సి ఉంటుంది. ఈ విషయంలో మీరిచ్చే సలహా ఏమిటో చెప్పండి."* అని అడిగారు.

దీనికి హజ్రత్ అబూ బక్ర్ సిద్దీఖ్ (రజి) లేచి, *"ఈ విషయం అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త (సల్లం) గారికే బాగా తెలుసు. కాని మనం మాత్రం ఉమ్రా చేయడానికి బయలుదేరివచ్చినవారం. ఎవరితోనూ యుద్ధం చేయడానికి రాలేదు. అయితే మనకూ, దైవగృహానికి మధ్య ఎవరైనా అడ్డుగా నిలిస్తే మాత్రం వారిని చీల్చి చెండాడుతాం."* అని విన్నవించుకున్నారు.

దైవప్రవక్త (సల్లం) ఈ మాటలు విని, *"సరే పదండి అలానే చేద్దాం."* అని తమ ప్రయాణాన్ని కొనసాగినంచనారంభించారు.

*కాబా గృహానికి రాకుండా ముస్లిములను అడ్డుకునే ప్రయత్నం : -*

ఇటు ప్రవక్త శ్రీ (సల్లం) ఉమ్రా కోసం బయలుదేరిన విషయం తెలిసిన ఖురైషీయులు ఓ సలహా సంఘాన్ని పిలిచారు. ఎలాగైనా సరే ముస్లిములను కాబా గృహానికి దూరంగా ఉంచడమే వారి అభిమతం. దైవప్రవక్త (సల్లం) అహాబీష్ (నీగ్రో) మూకలను తప్పించుకొని తమ ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా, బనీ కఅబ్ తెగకు చెందిన ఓ వ్యక్తి వచ్చి, *"దైవప్రవక్తా! ఖురైషీయులు 'తువా' అనే ప్రదేశంలో విడిది చేసి మీకోసం ఎదురుచూస్తున్నారు. ఖాలిద్ బిన్ వలీద్ రెండు వందల ఉష్ట్రారోహుల్ని వెంటబెట్టుకొని 'కురా అల్ గనీమ్' అనే చోట వేచి చూస్తున్నాడు."* అనే వార్తను అందించాడు. (కురా అల్ గనీమ్ మక్కాకు వెళ్ళే ప్రధాన వ్యాపార రహదారిపై ఉంది).

అప్పుడు దైవప్రవక్త (సల్లం), *"ఖురైషుల పరిస్థితి కడు శోచనీయం. గత యుద్ధంలో వారు వినాశపు అంచులకు చేరుకున్నారు. అయినా గాని వారికి బుద్ధి రాలేదు. నేను వారిని వారి మానాన వదిలేస్తానని వారనుకుంటున్నారేమో? లేదు. అలా ఎన్నటికీ జరగదు. అల్లాహ్ నన్ను, తన సందేశం ఇచ్చి పంపాడు. నా అంతిమ శ్వాస వరకు నేను ఆయన మార్గంలో కృషి చేస్తూనే ఉంటాను. ఖాలిద్ తో, అతని అశ్వదళంతో మనకు పనిలేదు. మనం యుద్ధానికి వెళ్ళటం లేదు. శాంతియుతంగా ఉమ్రా యాత్ర చేయటానికి మాత్రమే వెళుతున్నాం."* అన్నారు.

ఇటు ఖాలిద్ బిన్ వలీద్, ముస్లిములను మక్కాకు వెళ్ళకుండా అడ్డగించడానికి తన ఉష్ట్రారూఢుల్ని కనుచూపు మేరలో నిలబెట్టాడు. ఖాలిద్, ముస్లిములు జొహ్ర్ నమాజులో రుకూ మరియు సజ్దాలు చేస్తుండగా చూసి, వీరు ఏమరుపాటులో ఉన్నారు. ఈ సమయంలో దాడి చేస్తే ఎంత బాగుండును అని అనుకున్నాడు. ఆ తరువాత అతను అస్ర్ నమాజులో ముస్లిములపై ఒక్కసారే విరుచుకుపడడానికి నిర్ణయం తీసుకున్నాడు. కాని అల్లాహ్ ఈలోపు 'సలాతుల్ ఖౌఫ్' (యుద్ధ పరిస్థితిలో చేసే నమాజు విధానం) గురించి ఆదేశాలు అవతరింపజేయడం వల్ల ఖాలిద్ కు ఆ అవకాశం కూడా చేదాటి పోయినట్లయింది.

*భీకర పోరాటాన్ని తప్పించుకోవడానికి మార్గాన్ని మార్చడం : -*

ఆ తరువాత మహాప్రవక్త (సల్లం) తన అనుచరుల్ని ఉద్దేశించి, *"ముస్లిములారా! ఖురైషీయులు మనతో పోరాడటానికి బయలుదేరారు. మన ప్రయాణం ఈ దారినే కొనసాగితే మనం వారితో ఢీకొనక  తప్పదు. అప్పుడు ఘోర రక్తపాతం తప్పదు. ఇది నాకిష్టం లేదు. కనుక ఈ మార్గం తప్పించి, ఖాలిద్ కు ఎదురుపడకుండా మక్కాకు వెళ్ళే వేరొక మార్గాన తీసుకొని పోయేవారు ఎవరైనా ఉన్నారా మీలో?"* అని అడిగారు.

*"దైవప్రవక్తా! వేరే మార్గం గుండా నేను తీసుకెళ్తాను."* అన్నాడు అస్లం తెగకు చెందిన ఒకతను.

*"అయితే నువ్వు ముందు నడు. మేము నీ వెనకాల నడుస్తాం."* అన్నారు దైవప్రవక్త (సల్లం).

ఆ వ్యక్తి దైవప్రవక్త (సల్లం) కూర్చొని ఉన్న ఒంటె 'ఖస్వా' ముకుతాడు పట్టుకొని ముందుకు దారితీశాడు. ఇతర ముస్లిములు కూడా అతణ్ణి అనుసరించారు.

ఈ విధంగా మహనీయ ముహమ్మద్ (సల్లం), కురా అల్ గనీమ్ ప్రధాన రహదారిని వదిలి ఓ క్లిష్టమైన మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ దారి, దుర్గమ పర్వత లోయల గుండా వెళ్ళే దారి. కొండలు, పెద్ద పెద్ద ఇసుకతిన్నెలతో కూడిన భయంకరమైన దారి అది. అంటే ఆయన (సల్లం) కుడి ప్రక్కగా బయలుదేరి 'హమష్' మధ్య భాగం నుండి వెళుతున్నారు. అది 'సనియతుల్ మరార్' అనే ప్రదేశం గుండా పోయే మార్గం. 'సనియతుల్ మరార్'ను దాటి "హుదైబియా" అనే ప్రదేశంలో విడిది చేశారు ఆయన (సల్లం) మరియు ఆయన అనుచరగణం.

ఈ హుదైబియా మక్కాకు దిగువన ఉన్న ప్రాంతం. ఈ మార్గాన్ని ఎంచుకోవడం వల్ల మహాప్రవక్త (సల్లం)కు చేకూరిన ప్రయోజనం ఏమిటంటే, తన్ఈమ్ మీదుగా హరంకు (కాబాకు) వెళ్ళే మార్గం కురా అల్ గనీమ్ రాచమార్గం ఎడమ వైపున ఉండిపోతుంది. ఈ మార్గం పైన్నే ఖాలిద్ బిన్ వలీద్ సైనిక పటాలం మాటువేసి ఉంది.

ఖాలిద్ బిన్ వలీద్ ముస్లిములు రేపే దుమ్మును చూసి వారు మార్గాన్ని మార్చి, 'హుదైబియా'కు వచ్చి విడిది చేశారని తెలుసుకొని మక్కాకు తిరుగుముఖం పట్టాడు. హుటాహుటిన ఖురైషీయులకు ఈ క్రొత్త పరిస్థితిని తెలియజేసేందుకు పరుగులు తీస్తూ మక్కా చేరాడు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

286

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 286*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 201*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 3*

ఖాలిద్ బిన్ వలీద్ ముస్లిములు రేపే దుమ్మును చూసి వారు మార్గాన్ని మార్చి, 'హుదైబియా'కు వచ్చి విడిది చేశారని తెలుసుకొని మక్కాకు తిరుగుముఖం పట్టాడు. హుటాహుటిన ఖురైషీయులకు ఈ క్రొత్త పరిస్థితిని తెలియజేసేందుకు పరుగులు తీస్తూ మక్కా చేరాడు.

ఇటు మహాప్రవక్త (సల్లం) తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ 'సనియ్యతుల్ మరార్' చేరగా, దైవప్రవక్త (సల్లం) కూర్చున్న ఒంటె అకస్మాత్తుగా ఆగిపోయింది. అడుగు ముందుకు వేయకుండా నడిబాటలో కూర్చుండిపోయింది. దైవప్రవక్త (సల్లం) ఒంటెను చాలా అదిలించారు. కాని లాభం లేకపోయింది. ఒంటె మొండికేసిందని కొంతమంది అన్నారు. కాని అసలు విషయం ఏమిటో దైవప్రవక్త (సల్లం)కు అర్థమయింది.

తన సహచరులతో ఆయన (సల్లం), *"లేదు, ఒంటె మొండికేయలేదు. మునుపటిలాగే అది ఇప్పుడు కూడా విధేయంగానే ఉంది."* అని చెప్పారు. తర్వాత ఆయన (సల్లం) అబ్రహా, అతని ఏనుగు మక్కాపై దాడి చేసిన సంగతిని సూచిస్తూ, *"ఎవరయితే మక్కాలోకి ఏనుగు(ల)ను ప్రవేశించకుండా అడ్డుకున్నాడో ఆయనే ఈ ఒంటెను కూడా ముందుకు వెళ్ళకుండా ఆపాడు. ఇందులో ఓ మంచి సూచన కూడా ఉంది. ఎవరి చేతుల్లోనయితే ముహమ్మద్ (సల్లం) ప్రాణం ఉందో ఆయన సాక్షి! ఖురైషులు నాతో చర్చలు జరపటానికి వస్తారు. విశ్వాసానికి విఘాతం రానంత వరకు వారు ఎటువంటి షరతులు పెట్టినా నేను వారిని అంగీకరిస్తాను."* అన్నారు.

మక్కాలోకి ప్రవేశించకుండా కొంత సమయం వేచి ఉండాలని దైవప్రవక్త (సల్లం)కు దైవికంగా సూచనలు అందాయి.

_↑ ఇదే సంఘటన వేరొక సీరతుల్ కితాబ్ ప్రకారం ↓_

దైవప్రవక్త (సల్లం) ఒంటె 'సనియ్యతుల్ మరార్' అనే ప్రదేశంలో కూర్చుండిపోయింది. దాన్ని ఎంత అదిలించినా అది కదలలేదు. ఇది చూసిన ముస్లిములు దైవప్రవక్త (సల్లం)తో, *"ప్రవక్తా! ఇది మొండికేసింది."* అన్నారు.

*"కాదు! ఇది మొండికేయలేదు. దానికి ఆ అలవాటు కూడా లేదు. ఏనుగుల్ని సయితం నిలిపివేసిన ఆ అల్లాహ్ యే దాన్ని ఇక్కడ ఆపేశాడు. ఎవరి గుప్పెట్లోనయితే నా ప్రాణాలున్నాయో ఆ దేవుని సాక్షి! వీరు దైవం నిర్దేశించిన ఏ హద్దుల్ని కూడా గౌరవించరు. కాని నేను మాత్రం వాటిని పూర్తిగా గౌరవిస్తాను."* అని చెప్పి తన ఒంటెను ఒక్కసారే అదిలించగా అది లేచి నిలబడింది.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) తాను వెళుతున్న మార్గాన్ని కొంత మార్చి హుదైబియా ప్రాంతంలో ఉన్న ఓ ఊట బావి వద్దకు వచ్చి ఆగారు. ఆ ఊట బావిలో నీరు అడుగంటి ఉంది. సహచరులు కొద్దికొద్దిగా నీరు తీసుకోవడం మూలంగా బావిలో ఉన్న నీరు కాస్తా అయిపోయాయి. సహాబా (రజి)లు దాహం గురించి దైవప్రవక్త (సల్లం)కు విన్నవించుకోగా, ఆయన (సల్లం) తన తూణీరం నుండి ఓ బాణాన్ని తీసి, దాన్ని ఆ ఊట బావిలో పడవేయమని 'హజ్రత్ బరా బిన్ ఆజిబ్ (రజి)'ని ఆదేశించారు. హజ్రత్ బరా (రజి), ఆ బాణాన్ని ఊట బావిలో పడవేయగానే ఆ అందులోని నీరు పైకి ఉబకనారంభించింది. అందరూ కడుపారా నీరు త్రాగి వెనక్కు వచ్చేశారు.

ఇటు, మక్కాలో ఖురైషీయులు ఖాలిద్ రాక కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు. ఖాలిద్ విజయవంతంగా తిరిగొస్తేనే తమకు అరేబియాలో గౌరవం దక్కుతుందని, లేకపోతే తాము శాశ్వతంగా అవమానభారంతో కృంగిపోక తప్పదని వారు భావించసాగారు.

*ఖురైషీయుల వద్దకు చేరుకున్న ఖాలిద్ : -*

ఖాలిద్ బిన్ వలీద్ రానే వచ్చాడు. అతను ఏం కబురు విన్పిస్తాడోనని ఖురైషీయులు ఊపిరి బిగబట్టి కూర్చున్నారు.

*"మన పథకం తారుమారయింది. ముహమ్మద్ (సల్లం), ఆయన అనుచరులు వేరే దారి గుండా హుదైబియాకు వచ్చి విడిది చేశారు."* అన్నాడు ఖాలిద్ రాగానే.

*"ఏమిటీ! ముహమ్మద్ (సల్లం) హుదైబియాకు వచ్చేశాడా!!"* నాయకులంతా దిగ్భ్రాంతి చెందారు. క్షణం పాటు నిశ్శబ్దం రాజ్యమేలింది.

*"అయితే ఇప్పుడేం చేద్దాం?"* అన్నాడు వారిలో ఒకడు.

*"పదండి, దారున్నద్వాలో సమావేశమయి ఆలోచిద్దాం."* అన్నాడు మరొకడు.

ఖురైష్ నాయకులంతా దారున్నద్వాలో సమావేశమయ్యారు. అందరి ముఖాలు మాడిపోయి ఉన్నాయి. ఏం చెయ్యాలో ఎవరికీ పాలుపోవడం లేదు.

కొంపదీసి ముస్లిములు మక్కా పట్నంలోకి చొచ్చుకొని వస్తే....? అమ్మబాబోయ్! ఇంకేమయినా ఉందా!! ఉన్న పరువు, పలుకుబడులు కాస్తా మంట కలిసిపోవూ? సంఘంలో తలెత్తుకొని తిరగ్గలరా?

*"కాదు, మనం ఏదో ఒకటి చేసి సంఘంలో గౌరవం దక్కించుకోవాలి."* ఖురైషీయుల పౌరుషం పడగలు విప్పింది.

*"మన బొందిలో ప్రాణం ఉన్నంత వరకు ముహమ్మద్ (సల్లం) మక్కాలో అడుగు పెట్టడం అసంభవం."* వారి ఆవేశం బుసలు కొట్టింది.

*"ఇక్కడ మక్కాలో కూడా ముహమ్మద్ (సల్లం) అనుచరులు ఉన్నారు మన పక్కలో బల్లెంలా. ముస్లింలతో పేచీ పెట్టుకుంటే మనకు సర్వనాశనం తప్పదు."* అంటూ వారిలో ఒకడు సందేహం వెలిబుచ్చాడు.

*"ముహమ్మద్ (సల్లం) మనతో యుద్ధం చేయడానికి రాలేదంటున్నారు కదా! అలాంటప్పుడు ఆయన మనకు ఎలాంటి హాని తలపెట్టే అవకాశం లేదు. ఒకవేళ అతను మనసు మార్చుకొని మనతో కయ్యానికి దిగుతాడే అనుకుందాం. అప్పుడు మనం వెన్నుజూపి పారిపోయేటంతటి పిరికిపందలమా? వాళ్ళను చీల్చి చెండాడమూ!!"* అన్నాడు మరొకడు రొమ్ము విరుచుకుంటూ.

*"ఇంతకూ ఏం చేద్దామంటారు? వెంటనే ఏదో ఒక పథకం రూపొందించి పనిచేయక పొతే ప్రమాదం ముంచుకొస్తుంది."* అన్నాడు అగ్ర నాయకుడు అబూ సుఫ్యాన్.

*''బనీ ఖుజాఅ తెగ మనుషులు కొందరిని పంపుదాం. వారెళ్ళి ముహమ్మద్ (సల్లం) కోరుతున్నదేమిటో తెలుసుకొని వస్తారు. దాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవచ్చు."* అన్నారు వారిలో కొందరు.

*"కాని ఖుజాఅ తెగవాళ్ళను పంపితే లాభం లేదు. వాళ్ళు ముహమ్మద్ (సల్లం)కు అనుకూలురు, ముస్లిముల శ్రేయోభిలాషులు. అలాంటి వారి వల్ల మనకు ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువ ఉంటుంది."* అన్నాడు అబూ సుఫ్యాన్.

*"నువ్వేమీ భయపడకు. వాళ్ళ జుట్టు మన చేతిలో ఉంది. మక్కాలోనే వారి పొలాలు, తోటలు ఉన్నాయి. వారి భార్యాపిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. ద్రోహం చేస్తే మన పట్టు నుండి తప్పించుకొని ఎక్కడికీ పారిపోలేరు."* అన్నాడు ఓ తలపండిన నాయకుడు.

ఈ ప్రతిపాదన అందరికీ నచ్చింది. ముస్లింల దగ్గరికి రాయబారం పంపవలసిన ప్రతినిధుల్ని కూడా ఎన్నుకోవడం జరిగింది.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

287

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 287*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 202*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 4*

*బుదైల్ బిన్ వర్కా మధ్య వర్తిత్వం : -*

దైవప్రవక్త (సల్లం)కు, హుదైబియాకు వచ్చిన తరువాత కొంత స్థిమితం ఏర్పడింది. ఈ లోపు 'బుదైల్ బిన్ వర్కా ఖుజాయి' తన 'ఖుజాఅ' తెగకు చెందిన కొందరు పెద్ద మనుషుల్ని వెంట బెట్టుకొని మహాప్రవక్త (సల్లం) గారి సన్నిధిలో హాజరయ్యాడు. ఖుజాఅ తెగ దైవప్రవక్త (సల్లం) శ్రేయాన్ని కోరుతున్న తెగ. బుదైల్, ప్రవక్త (సల్లం) సన్నిధికి రాగానే జనం అతణ్ణి ప్రశ్నించసాగారు. కాని అతను ఎవరికీ జవాబు చెప్పకుండా నేరుగా దైవప్రవక్త (సల్లం) గుడారంలోకి వెళ్ళి, దైవప్రవక్త (సల్లం)తో....; ↓

*"ముహమ్మద్ (సల్లం)! ఖురైషు నాయకులు నిన్న ఒక సమావేశం జరిపారు. అందులో మిమ్మల్ని మక్కాలోకి అడుగుపెట్టనీయరాదని ప్రతినబూనారు. మీకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. తాము పూజించే విగ్రహాల సమక్షంలోనే వారు ఒట్టేసుకున్నారు. కనుక మీతో నా మనవి ఏమంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. వారు మీకు ఏ విధంగానైనా హాని కలిగించటానికి ప్రయత్నించవచ్చు. ఇప్పుడు నేను 'కఅబ్ బిన్ లుబా' దగ్గర నుండే ఇటు వచ్చాను. అతను హుదైబియాకు చెందిన ఒయాసిస్సు దగ్గర విడిది చేసి ఉన్నాడు. అతని వెంట స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. అతను తమతో పోరాడడానికి, కాబా గృహానికి పోకుండా తమను అడ్డుకోవడానికి గట్టి నిర్ణయం తీసుకున్నాడు."* అని అన్నాడు.

దానికి మహాప్రవక్త (సల్లం), *"మేము ఎవరితోనూ పోరాడడానికి రాలేదు. ఖురైషులను యుద్ధాలు సర్వనాశనం చేసివేశాయి. వారే కోరితే ఓ నిర్ణీత కాలం వరకు సంధి చేసుకోదలిచాను. వారు నాకూ, నా సహచరులకు నడుమ అడ్డుగా నిలువకుండా ఉండాలి. ప్రజలు ఇస్లాం ధర్మంలో ఎలా చేరిపోతున్నారో వారు కూడా ఇస్లాం ధర్మంలో చేరితే మంచిదే. కాదంటారా, ఈ ఒప్పందం ద్వారా వారికి శాంతి అయినా లభిస్తుంది. ఒకవేళ వారికి పోరాటం తప్ప మరేది నచ్చనట్లయితే దైవసాక్షిగా చెబుతున్నాను! ఎవరి చేతుల్లోనయితే నా ప్రాణాలున్నాయో, నేను నా ధర్మం విషయంలో నా తల నా మొండెం నుండి వేరైనంత మట్టుకు పోరాడుతూనే ఉంటాను. లేదా అల్లాహ్ తన నిర్ణయాన్ని వారిపై అమలునయినా చేస్తాడు."* అన్నారు.

*"తమరు చెప్పిన విషయం ఉన్నదీ ఉన్నట్లుగా వారికి తెలియజేస్తాను."* అంటూ ఖురైషీయుల వద్దకు వెళ్ళాడు బుదైల్. తరువాత వారిని సంబోధిస్తూ, *"ఖురైషీయులారా! నేను ఆయన (సల్లం)ను కలిసే వస్తున్నాను. నేను ఆయన (సల్లం) చెప్పిన మాటలు బాగా విన్నాను. మీరు వినదలచుకుంటే మీ ముందు ఉంచగలను."* అన్నాడు.

*"లేదు, మేము వినే అవసరమే లేదు. నీవు మా ముందు ఆయన (సల్లం) చెప్పింది ఏమీ చెప్పొద్దు."* అన్నారు వారిలోని కొందరు మూర్ఖులు.

కాని ఎవరికయితే కొంత బుద్ధీవివేచనలున్నాయో వారు మాత్రం, *"చెప్పు, ఆయన (సల్లం) ఏమని చెప్పాడో!"* అని అడిగారు.

దైవప్రవక్త (సల్లం), తనకు ఏం చెప్పారో, ఆ మాటలనే ఖురైషీయులకు వినిపించాడు బుదైల్.

ఇది విన్న ఖురైషీయులు, ముస్లింల గురించి తమ గుండెల్లో రగులుతున్న క్రోధాగ్నిని వెళ్ళగ్రక్కుతూ, *"ఏమిటీ, ముహమ్మద్ (సల్లం) మళ్ళీ మా మీద దాడి చేసి, మమ్మల్ని అవమానపరచటానికి వచ్చాడా? ఉత్బా, షైబా, ఇబ్నె హిషామ్ లాంటి మా నాయకుల్ని చంపింది చాలదంటనా? వారి చావు దృశ్యం ఇంకా మా కళ్ళ ముందు నుంచి తొలగిపోలేదు. వారి భార్యలు ఇంకా వారి కోసం ఏడుస్తూనే ఉన్నారు. ఇంతలోనే మరో యుద్ధానికి తెగబడ్డాడా?"* అని గాండ్రించారు.

బుదైల్ వారి మాటను మధ్యలోనే ఆపి, *"నన్ను నమ్మండి. నేను కళ్ళారా చూసి వచ్చాను. వారంతా ఇహ్రాం దుస్తులు ధరించి ఉన్నారు. సాంప్రదాయిక ఖడ్గాలు తప్ప వారి దగ్గర ఇతర ఆయుధాలు కూడా ఏమీ లేవు. పైగా వారు బలి ఇవ్వటానికి ఎన్నో జంతువులను కూడా తీసుకువచ్చారు. వాళ్ళది ఒకే ఆశ. అది ఉమ్రా చేయటం. ఈ ధర్మకార్యాన్ని నిర్వర్తించుకొని శాంతియుతంగా వెళ్ళిపోయేందుకు ముహమ్మద్ (సల్లం)ను అనుమతించండి."* అని ఖురైషు సర్దారులను కోరాడు.

తాము దూసిన ఖడ్గాలు శాంతించి తిరిగి ఒరల్లోకి వెళ్తాయని ఆశిస్తున్నట్లయితే, వెంటనే తాను ఆ భ్రమ నుంచి తెరుకోవాలని ఖురైషులు బుదైల్ ను హెచ్చరించారు. తమకు సలహాలు ఇవ్వటం మానుకొమ్మంటూ అతనికి చీవాట్లు పెట్టారు. అతని మాటల్ని విషపూరితమైనవిగా పేర్కొన్నారు. అతని తెగవారు ముహమ్మద్ (సల్లం)తో ఒప్పందం కుదుర్చుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ఇక తమను తప్పుదారి పట్టించడం మానుకుంటే మంచిదని వారు అతణ్ణి హెచ్చరించారు.

*ముక్రజ్ బిన్ హఫజ్ మధ్యవర్తిత్వం : -*

ఇక ఆ తరువాత ఖురైషీయులు, ప్రవక్త (సల్లం) వద్దకు 'ముక్రజ్ బిన్ హఫజ్' అనే వ్యక్తిని విషయాలు తెలుసుకురమ్మని పంపించారు. దైవప్రవక్త (సల్లం), అతణ్ణి దూరం నుండే చూస్తూ, *"ఒప్పందాలను త్రెంచే నీచుడు వస్తున్నాడు చూడండి."* అని సహాబా (రజి)కు చెప్పారు. అతను దగ్గరకు వచ్చి దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడాడు. మహాప్రవక్త (సల్లం), ఇది వరకు బుదైల్ కు చెప్పిన విషయమే అతనికి చెప్పారు. ముక్రజ్ వెనుదిరిగి వెళ్ళి ఆ విషయం పూర్తిగా ఖురైషులకు చెప్పాడు.

*'హులైస్ బిన్ అల్కమా' మధ్యవర్తిత్వం : -*

మక్కా ప్రజల నాయకుడైన అబూ సుఫ్యాన్ తన ప్రజలకు సలహా ఇస్తూ, *"బనూ హులైస్ నాయకుడు, 'అల్కమా' కుమారుడైన 'అల్ హులైస్'ను మనం మన రాయబారిగా ముహమ్మద్ (సల్లం) వద్దకు పంపుదాం. అతను మన పొరుగువాడే. అదీగాక అతను మన కూటమి సభ్యుడు. అతను ముహమ్మద్ (సల్లం)ను మదీనాకు త్రిప్పి పంపించగలుగుతాడేమో."* అన్నాడు.

అబూ సుఫ్యాన్ ఇచ్చిన ఈ సలహాను అందరూ అంగీకరించారు.

ఆ తర్వాత, ఖురైషీయుల రాయబారిగా హులైస్, మహాప్రవక్త (సల్లం) వద్దకు బయలుదేరాడు. తమ వద్దకు వస్తున్న హులైస్ రాకను దూరం నుంచే గమనించిన దైవప్రవక్త (సల్లం), సహాబాలతో, *"చూడండి, వచ్చేవాడు హులైస్. ఇతను హదీ పశువులను అధికంగా గౌరవించే జాతికి చెందినవాడు. కాబట్టి మీరు అతనికి ఎదురుగా మీ హదీ పశువులను నిలబెట్టండి. వాటిని చూసి, మనం ఉమ్రా యాత్ర కోసం మాత్రమే వచ్చామని, వినాశనం కోసం రాలేదని తెలుసుకుంటాడు."* అని ఆదేశించారు.

సహాబా (రజి), ఆ ఖుర్బానీ పశువులను అతనికి ఎదురుగా తోలుతూ *"లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్"* అని పఠించనారంభించారు.

ఈ దృశ్యం హులైస్ చూశాడు. సాంప్రదాయకంగా తీర్చిదిద్దిన పశువుల గుంపు చూసి అతని కళ్ళు చెమర్చాయి. ఖురైషీయులు నిజంగానే ముస్లింలపై అన్యాయానికి పాల్పడుతున్నారని గ్రహించాడు. *"సుబ్హానల్లాహ్! వీరిని దైవగృహానికి పోకుండా ఆపడం సరి అయిన విషయం కాదు."* అంటూ, దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడకుండానే వెనక్కు వెళ్ళిపోయాడు.

హులైస్ విజయవంతంగా తిరిగొస్తాడని, తమ గుండెల్లో మండుతున్న ప్రతీకార జ్వాలల్ని చల్లార్చే శుభవార్త మోసుకొస్తాడని ఖురైష్ నాయకులు తెగ సంబరపడిపోతూ అతని రాక కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.

కాస్సేపటికి హులైస్ గంభీరవదనంతో వచ్చాడు. రాగానే ఖురైషీయుల ఆశలను వమ్ముచేస్తూ, *"నేను హదీ పశువుల్ని చూశాను. వాటి మెడలలో పట్టాలున్నాయి. ఒంటెల కోహాన్లు (మూపరాలు) కూడా చీల్చబడి ఉన్నాయి. నేను మాత్రం వారిని దైవగృహం కాబాకు రాకుండా అడ్డుకోవడం సరి అయిన విషయం కాదని తలుస్తున్నాను."* అని అన్నాడు.

_ఖురైషీయులతో హులైస్ అన్న ఈ మాటలు వేరొక ఉల్లేఖనం ప్రకారం....; ↓_

*"ఖురైషీయులారా! పుణ్యక్షేత్ర యాత్ర చేసుకోవడానికి వచ్చినవారిని ఆపటం మహాపాపం"* అని అంటూ, తమ ప్రదేశం కాని వాళ్ళయిన 'యుహ్జర్', 'హిమ్యర్' తెగలవారికి తాము కాబా యాత్ర చేసుకోవటానికి అనుమతించిన సంగతిని గుర్తు చేస్తూ, *"ముహమ్మద్ (సల్లం) తాతగారు గొప్ప నాయకుల్లో ఒకరు. ఆయన మనవణ్ణి మక్కాలో అడుగుపెట్టనీయకుండా నిలువరించడం భావ్యం కాదు. ప్రజలను హజ్, ఉమ్రా యాత్రలు చేయకుండా ఆపటానికి నేను మీతో కూటమిలో చేరలేదు. ఒకవేళ మీరు ఈ విషయంలో మొండిగా ప్రవర్తించి, ముహమ్మద్ (సల్లం)ను మరియు ఆయన అనుచరులను కాబా గృహాన్ని సందర్శించనీయకపోతే, నా ఆధీనంలో ఉన్న తెగలన్నీటిని తీసుకొని మీ నుంచి వేరైపోతాను. మన మధ్య ఉన్న ఒప్పందాన్ని త్రెంచుకోవాల్సి వస్తుంది కూడా. అంతేకాదు, ముహమ్మద్ (సల్లం) పక్షాన నిలబడి మీ అంతు చూస్తాను."* అని హెచ్చరించి అక్కణ్ణుంచి బయలుదేరాడు.

ఖురైషులు అతణ్ణి ఆపుతూ, *"హులైస్! మరీ అంత కోప్పడవద్దు. ఆలోచించుకోవడానికి మాకు కొంత సమయం ఇవ్వు."* అని కోరారు.

ఖురైషులు మీమాంసలో పడిపోయారు. ఒక వైపేమో తాము ముహమ్మద్ (సల్లం)ను అడ్డుకుంటామని తమ పూజ్య దేవతల ముందు ఒట్టేసుకొని ఉన్నారు. మరోవైపు గత యుద్ధాల్లో ముస్లింల శక్తిసామర్థ్యాలనూ వారు చూసి ఉన్నారు. బద్ర్ యుద్ధం రోజున ఒక చిన్న సైనిక పటాలం చేతిలో వారు తిన్న చావుదెబ్బ వారి జీవిత చరిత్రలో ఒక చీకటి పుటగా మిగిలిపోయింది. అలాగే ఉహద్ యుద్ధంలో తాత్కాలికంగా తమది పైచేయి అయినా అందులోనూ వారికి ఒరిగిందేమీ లేదు. ఇటీవల జరిగిన కందక యుద్ధ భయానక పరిణామాలూ ఇంకా వారి స్మృతిపథం నుంచి చెరిగిపోలేదు.

అయితే, ముస్లింలను ఇప్పుడు అడ్డుకోకుండా మక్కాలోకి స్వాగతిస్తే, అది తమ పాలిట ఇంకా అవమానకరంగా పరిణమిస్తుందన్న భయం కూడా మరో వైపు ఖురైషులను వెంటాడుతూ ఉంది.

*ఉర్వా బిన్ మస్ఊద్ మధ్యవర్తిత్వం గురించి In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

288

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 288*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 203*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 5*

ఖురైషులు మీమాంసలో పడిపోయారు. ఒక వైపేమో తాము ముహమ్మద్ (సల్లం)ను అడ్డుకుంటామని తమ పూజ్య దేవతల ముందు ఒట్టేసుకొని ఉన్నారు. మరోవైపు గత యుద్ధాల్లో ముస్లింల శక్తిసామర్థ్యాలనూ వారు చూసి ఉన్నారు. బద్ర్ యుద్ధం రోజున ఒక చిన్న సైనిక పటాలం చేతిలో వారు తిన్న చావుదెబ్బ వారి జీవిత చరిత్రలో ఒక చీకటి పుటగా మిగిలిపోయింది. అలాగే ఉహద్ యుద్ధంలో తాత్కాలికంగా తమది పైచేయి అయినా అందులోనూ వారికి ఒరిగిందేమీ లేదు. ఇటీవల జరిగిన కందక యుద్ధ భయానక పరిణామాలూ ఇంకా వారి స్మృతిపథం నుంచి చెరిగిపోలేదు.

అయితే, ముస్లింలను ఇప్పుడు అడ్డుకోకుండా మక్కాలోకి స్వాగతిస్తే, అది తమ పాలిట ఇంకా అవమానకరంగా పరిణమిస్తుందన్న భయం కూడా మరో వైపు ఖురైషులను వెంటాడుతూ ఉంది.

*ఉర్వా బిన్ మస్ఊద్ మధ్యవర్తిత్వం : -*

ఈ సందర్భంలోనే, తాయిఫ్ నగర నాయకుడు 'ఉర్వా బిన్ మస్ఊద్ సఖఫీ' కల్పించుకుని, *"ఆ వ్యక్తి (ముహమ్మద్ - సల్లం) మీ ముందు ఓ మంచి ప్రతిపాదనను ఉంచాడు. కాబట్టి మీరు దాన్ని స్వీకరించాలి. మకూ మీకూ మధ్య ఒప్పందం ఉంది. నాకు అనుమతి ఇవ్వండి. ఆయన (సల్లం) దగ్గరకు నన్ను పోనివ్వండి. నేను ముహమ్మద్ (సల్లం)తో మాట్లాడివస్తాను."* అని అడిగాడు.

ఇందుకు ఖురైషీయులు వెంటనే అంగీకరించారు.

*దైవప్రవక్త (సల్లం) సన్నిధికి చేరుకున్న ఉర్వా బిన్ మస్ఊద్ : -*

ఉర్వా బిన్ మస్ఊద్, దైవప్రవక్త (సల్లం) సన్నిధికి చేరుకున్నాడు. ఆయన (సల్లం) గాంభీర్యాన్ని, ఆయన (సల్లం) అవగాహనా శక్తిని చూసి ఉర్వా అవాక్కయ్యాడు. అతను, దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వెళ్ళి మాట్లాడనారంభించాగా, ఇది వరకు బుదైల్ కు చెప్పిన విషయమే అతనికి చెప్పారు మహాప్రవక్త (సల్లం).

అది విన్న ఉర్వా, *"ఓ ముహమ్మద్ (సల్లం)! గతంలో తన జాతినే అంతమొందించిన ఏ వ్యక్తి గురించి అయినా విన్నావా? ఇప్పుడు నీవు నీ జాతినే అంతమొందించ బూనావు. ఒకవేళ అలా కాని పక్షంలో, దైవసాక్షిగా చెబుతున్నాను, నీ వెంట ఉన్న వారంతా నిన్ను వదిలేసి పారిపోయే పోకిరి వెధవల్లా అగుపడుతున్నారు నాకు."* అని రెచ్చగొట్టే మాటలు మాట్లాడనారంభించాడు.

ఇది విన్న హజ్రత్ అబూ బక్ర్ (రజి) గారికి కోపం కట్టలు త్రెంచుకుంది. *"ఓరీ నీచుడా, లాత్ దేవుని మర్మంగాన్ని నాకేవాడా! మేమా దైవప్రవక్త (సల్లం)ను వదిలి పారిపోయేవారం!"* అని తిట్టారు.

ఇది విన్న ఉర్వా, అబూ బక్ర్ (రజి) వైపు చూసి, *"ఇతనెవరూ?"* అని అడిగాడు.

ఈయన హజ్రత్ అబూ బక్ర్ (రజి) అని పరిచయం చేశారు అక్కడున్నవారు.

ఉర్వా, అబూ బక్ర్ (రజి)ను సంభోదిస్తూ, *"చూడు! నా ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయో ఆ దైవం సాక్షిగా చెబుతున్నాను. నీవు ఒకప్పుడు నాకు సహాయం చేసి ఉన్నావు. దానికి ప్రతిఫలం ఇంకా నేను నీకు ముట్టజెప్పలేదు. అదే గనక అప్పుడు జరిగి ఉంటే నీవు అన్న మాటలకు సమాధానం ఇచ్చి ఉండేవాణ్ణి."* అన్నాడు.

ఆ తరువాత ఉర్వా, దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడనారంభించాడు. అతను మాటలు సందర్భంలో మాటిమాటికి మహాప్రవక్త (సల్లం) గారి గెడ్డాన్ని పట్టుకుంటున్నాడు. ముగైరా బిన్ షూబా (రజి), దైవప్రవక్త (సల్లం) గారి వెనుకే నిలబడి ఉన్నారు. ఆయన (రజి) చేతిలో కరవాలం ఉంది. తలపై శిరస్త్రాణమూ ఉంది.

ఉర్వా, అలా దైవప్రవక్త (సల్లం) గారి గెడ్డం వైపునకు తన చేతిని చాచుతూ ఉండగా చూసిన ముగైరా, తన కరవాలం పిడితో ఉర్వా చేతి మీద కొడుతూ, *"జాగ్రత్త! నీ చేతిని ప్రవక్త (సల్లం) గారి గెడ్డానికి దూరంగా ఉంచు."* అంటున్నారు.

చివరికి ఉర్వా తన తలను పైకెత్తి ముగైరా (రజి) వైపు చూస్తూ, *"ఇతనెవరూ?"* అని అడిగాడు.

*"ఈయన ముగైరా బిన్ షుబా (రజి)"* అని బదులిచ్చారు అక్కడున్నవారు.

*"ఓహో! ఓ విశ్వాస ఘాతకుడా! నేను నీ విశ్వాస ఘాతుకానికి తగిన శిక్షను వేయడానికి ప్రయత్నం చేయడం లేదనుకున్నావా?"* అని అడిగాడు.

అసలు జరిగిన విషయం ఏమిటంటే, అజ్ఞానకాలంలో (ఇస్లాం స్వీకరించక ముందు కాలం అన్నమాట) హజ్రత్ ముగైరా (రజి) కొందరితో కలసి ఉన్నప్పుడు ఆయన వారిని సంహరించి వారి సంపదనంతా ఎత్తుకొని పారిపోయారు. ఆ తరువాత ఆయన వచ్చి ఇస్లాం స్వీకరించారు. అప్పుడు దైవప్రవక్త (సల్లం) ఆయనతో ఇలా అన్నారు కూడా. *"నేను నీ ఇస్లాం స్వీకారాన్ని ఒప్పుకుంటున్నాను. కాని నీవు కొల్లగొట్టిన ధన సంపదతో నాకెలాంటి సంబంధం లేదు."* (ఈ వ్యవహారంలో ఉర్వా చేసిన ప్రయత్నం ఎలాంటిదంటే ఆయన అతని సోదర కుమారుడై ఉండడమే).

ఆ తరువాత ఉర్వా, దైవప్రవక్త (సల్లం) గారి ఎడల వారి సహచరుల సంబంధాలు ఎలా ఉన్నాయో గమనిస్తూపోయాడు.

ఉర్వా మక్కాకు తిరిగి వెళ్ళి, తాను ముహమ్మద్ (సల్లం)తో జరిపిన చర్చలు విజయవంతం కాలేదని సమాచారం అందించాడు. అసలు అతని ప్రతిస్పందన ఏమిటని ఖురైషులు అతన్ని గుచ్చి గుచ్చి అడిగారు. అందుకు ఉర్వా ఇలా సమాధానం ఇచ్చాడు....; ↓

*"ఓ నా జాతి ప్రజలారా! దైవసాక్షి! నేను కైజరు, కిస్రా మరియు నజాషి లాంటి రారాజుల దర్బారులకు కూడా పోయి వచ్చినవాణ్ణి. దైవాన్ని సాక్షిగా పెట్టి చెబుతున్నాను. నేను వారిలో ఏ రాజును కూడా ముహమ్మద్ (సల్లం) సహచరులు గౌరవించినంతగా గౌరవించడం చూడలేదు. ఆయన (సల్లం) కాండ్రించి ఉమ్మివేస్తే అది ఎవరిపైనైనా పడితే దాన్ని వారు తాము ముఖాలపై, శరీరాలపై పులుముకుంటారు. ఆయన (సల్లం) ఏ ఆదేశం ఇచ్చినా దాన్ని నిర్వర్తించడానికి పరుగిడుతారు. ఆయన (సల్లం) వుజూ చేసుకునేటప్పుడు, వారంతా ఆ నీటి కోసం తగువులాడుతున్నారా అన్నట్లు ఎగబడతారు. ఆయన (సల్లం) ఏదైనా పలుకును తమ నోటి నుండి వెలువరించినా నిశ్శబ్దంగా వింటారు. గౌరవం ఉట్టిపడేటట్లు ఆయన (సల్లం) వైపు సరిగా చూడనైనా చూడరు. ఆయన (సల్లం) ఓ ప్రతిపాదన చేశారు. అది ఎంతో మేలైన ప్రతిపాదన. కాబట్టి మీరు దాన్ని ఒప్పుకోక తప్పదు."*

_ఉర్వా పలికిన ఈ మాటలే మరొక ఉల్లేఖనంలో ఇలా ఉన్నాయి....; ↓_

*"ప్రజలారా! వినండి. నేను ఎన్నో రాజ్యాల రాజులను, చక్రవర్తులను చూశాను. పర్షియా చక్రవర్తిని, అబీసీనియా రాజుని, ఎందరెందర్నో నేను సందర్శించాను. కాని ముహమ్మద్ (సల్లం) సహచరులు ఆయన్ని గౌరవించినంత గొప్పగా, ఇతర ఏ ప్రజలూ తమ రాజుని, చక్రవర్తిని గౌరవించటం నేనెన్నడూ చూడలేదు. వారు ఆయన నాయకత్వాన్ని మనసా, వాచా అంగీకరించి, తమ వ్యవహారాలను నడపటంలో ఆయనకు సంపూర్ణ అధికారాన్ని ఇచ్చారు. ఆయన అభిప్రాయాన్ని వారు మనసారా అంగీకరిస్తారు. కనుక మీకు నా సలహా ఏమంటే, ఈ విషయంలో మీరు ఓ ఒప్పందానికి రండి, ఎందుకంటే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది."* అన్నాడు.

కాని ఇంత చెప్పినా ఖురైష్ నాయకులకు తలకెక్కలేదు. అతని మాటలు విన్న తర్వాత ఖురైషులు తలపొగరుతో, *"ఖురైషులు వారధి లాంటివారు. ఆ వారధిని ఎవరూ దాటలేరు. 'ఖురైషు' అంటే, ఎవరూ అధిరోహించలేని పర్వత శిఖరం. మా జెండాలు ఎన్నటికీ తలదించవు."* అన్నారు.

*ఖురైషీయుల విలుకాండ్రు కుట్ర : -*

ఖురైషుకు చెందిన యుద్ధోన్మాదులైన యువకులు, వారికి సంబంధించిన నాయకులే సంధికి దిగివస్తున్నారన్న విషయాన్ని తెలుసుకొని దాన్ని భంగపరచడానికి గాను ఓ ప్రణాళికను సిద్ధం చేశారు. వారు రాత్రి అంధకారంలో ఎవరికీ తెలియకుండా ముస్లిముల శిబిరంలోకి చొరబడి భీభత్సం సృష్టిద్దామని అనుకున్నారు. దీనివల్ల సంధికి బదులు యుద్ధం అనివార్యమైపోతుంది అని వారి అంచనా.

ఆ తరువాత వారు యాభై మంది ఆరితేరిన విలుకాండ్రను ఎన్నుకున్నారు. రాత్రివేళ పోయి ముహమ్మద్ (సల్లం)పై ఆకస్మిక దాడి చెయ్యమని చెప్పి వారిని పంపించారు.

ఈ యాభై మంది విలుకాండ్రు రాత్రివేళలో హుదైబియా ప్రాంతానికి చేరుకున్నారు. కాని పథకం తల్లక్రిందులయింది. పాపం వారు ముస్లిముల శిబిరాలపై నాలుగైదు బాణాలు వదిలారో లేదో తక్షణమే ముస్లిములు మేల్కొని వారిని బందీలుగా పట్టుకొని దైవప్రవక్త (సల్లం) ముందు ప్రవేశపెట్టారు.

దైవప్రవక్త (సల్లం)పై దాడి చెయ్యడానికి వచ్చిన ఈ గెరిల్లా వీరులు చివరికి గొర్రెల్లా దైవప్రవక్త (సల్లం) సమక్షంలో తలలోంచి నిలబడవలసి వచ్చింది.

ప్రవక్త అనుచరులు వారి వైపు ఉరిమిచూస్తున్నారు. బందీలు ఇక తమకు చావు తప్పదని తలచి వణకిపోతున్నారు.

*"ఇంత ద్రోహానికి పాల్పడిన మీకు నేను ప్రాణభిక్ష ఎలా పెట్టాలి?"* దైవప్రవక్త (సల్లం) వారి కళ్ళలో సూటిగా చూస్తూ అడిగారు.

*"అయ్యా! మా బుద్ధి గడ్డి తిన్నది. మమ్మల్ని కనికరించండి. మీరు ఎంతో దయార్ద్ర హృదయులు. మీ క్షమాగుణంపై మాకు నమ్మకం ఉంది. దయచేసి మమ్మల్ని నిరాశపరచకండి."* అని పరిపరి విధాల వేడుకున్నారు శత్రు సైనికులు.

*"సరే వెళ్ళండి, మిమ్మల్ని క్షమిస్తున్నాను. రక్తపాతం జరుపడానికి ముహమ్మద్ (సల్లం) ఇక్కడకు రాలేదని మీ జాతి వాళ్ళకు గట్టిగా చెప్పండి. ఇప్పుడయినా వారికి స్పృహ వస్తుందేమో."* అన్నారు మహాప్రవక్త ముహమ్మద్ (సల్లం).

శత్రుసైనికులు బ్రతుకు జీవుడా అంటూ ముస్లిముల పట్టు నుండి బయటపడ్డారు. అయితే ఇంతటి ఘోరమైన నేరాన్ని సయితం ముహమ్మద్ (సల్లం) క్షమించినందుకు వారు చాలా ఆశ్చర్యపోయారు. ఏమైనా ఇక తమ జాతికి కీడు తప్పదనుకున్నారు. కాస్త అవమానం జరిగినా కనీసం ప్రాణాలైనా దక్కాయని సంతోషిస్తూ వారు మక్కా దారిపట్టారు.

ఇలా కవ్వించి కయ్యం పెట్టుకోవాలన్న ఖురైషీయుల ఎత్తుగడ నీరుగారిపోయింది.

*ముస్లిముల తరఫున హజ్రత్ ఖరాష్ బిన్ ఉమయ్యా (రజి) రాయబారం : -*

దైవప్రవక్త (సల్లం) ఈసారి ఖురైషీయులకు తాము కాబాదర్శనం నిమిత్తమే వచ్చామని తెలియజేయడానికి 'హజ్రత్ ఖరాష్ బిన్ ఉమయ్యా (రజి)'ని పంపారు.

హజ్రత్ ఖరాష్ (రజి) ఒంటె ఎక్కి మక్కా బయలుదేరారు. ఆయన నేరుగా అబూ సుఫ్యాన్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో అబూ సుఫ్యాన్ ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాడు. ఆయనతో పాటు 'ఇక్రమా బిన్ అబూజహల్', 'ఖాలిద్ బిన్ వలీద్', 'అమ్రూ బిన్ ఆస్' వగైరా ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో ముస్లింల దగ్గరకి రాయబారిగా వెళ్ళివచ్చిన 'హులైన్ బిన్ అల్కమా' కూడా ఉన్నాడు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*