289

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 289*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 204*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 6*

*ముస్లిముల తరఫున హజ్రత్ ఖరాష్ బిన్ ఉమయ్యా (రజి) రాయబారం : -*

దైవప్రవక్త (సల్లం) ఈసారి ఖురైషీయులకు తాము కాబాదర్శనం నిమిత్తమే వచ్చామని తెలియజేయడానికి 'హజ్రత్ ఖరాష్ బిన్ ఉమయ్యా (రజి)'ని పంపారు.

హజ్రత్ ఖరాష్ (రజి) ఒంటె ఎక్కి మక్కా బయలుదేరారు. ఆయన నేరుగా అబూ సుఫ్యాన్ ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో అబూ సుఫ్యాన్ ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాడు. ఆయనతో పాటు 'ఇక్రమా బిన్ అబూజహల్', 'ఖాలిద్ బిన్ వలీద్', 'అమ్రూ బిన్ ఆస్' వగైరా ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో ముస్లింల దగ్గరకి రాయబారిగా వెళ్ళివచ్చిన 'హులైన్ బిన్ అల్కమా' కూడా ఉన్నాడు.

*"ఖురైషీయులారా! నేను దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ప్రత్యేక దూతను. మేము మీతో యుద్ధం చేయడానికి రాలేదని, కాబాదర్శనం కోసం మాత్రమే వచ్చామని తెలియజేయడానికి నేను మీ దగ్గరకి వచ్చాను. కాబట్టి మీరు మమ్మల్ని కాబాదర్శనం చేసుకోనివ్వండి. మమ్మల్ని నిరోధించకండి."* అన్నారు హజ్రత్ ఖరాష్ (రజి).

*"ఒకవేళ మేము మిమ్మల్ని కాబాదర్శనం చేసుకోనివ్వకుండా నిరోధిస్తే....?"* అన్నాడు ఇక్రమా బిన్ అబూజహల్.

*"అప్పుడు మేము యుద్ధం చేస్తాం. మిమ్మల్నందర్నీ హతమార్చి కాబాదర్శనం చేసుకుంటాం."* అన్నారు హజ్రత్ ఖరాష్ (రజి) ఎలాంటి జంకూ గొంకూ లేకుండా.

*"ఓహో! నువ్వు మమ్మల్ని బెదిరించడానికి వచ్చావన్నమాట!! కాని నీ చావుబ్రతుకులు మా చేతిలో ఉన్న సంగతి మరచిపోతున్నావు సుమా!"* అన్నాడు ఇక్రమా.

*"పొరపడుతున్నావు ఇక్రమా! ప్రతి మనిషి చావుబ్రతుకులు సర్వలోక ప్రభువయిన అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన ఆజ్ఞ లేనిదే నువ్వేమీ చెయ్యలేవు."* అన్నారు ఖరాష్ (రజి)

అల్లాహ్ పేరు వినగానే అవిశ్వాసులు మండిపడ్డారు. వెంటనే వారిలో కొందరు లేచి ఖరాష్ (రజి) తీసుకొచ్చిన ఒంటెను చంపి, ఖరాష్ (రజి) మీదికి లంఘించారు.

హజ్రత్ ఖరాష్ (రజి) ఆగ్రహోదగ్రులై చర్రున కత్తి దూసి వారి ముందు నిలబడ్డారు.

*"నీచులారా! మీరు చర్చలకు వచ్చిన రాయబారినే చంపడానికి సిద్ధమయ్యారా! మీలో అసలు ఆత్మాభిమానం మచ్చుకైనా ఉందా? మీరంతగా యుద్ధజ్వాలల కోసం వెంపర్లాడుతుంటే, రండి మాతో పోరాడండి. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. నేను ఏ ప్రజల తరఫున రాయబారిగా పంపబడ్డానో, వారు మీపై విరుచుకుపడి మిమ్మల్ని సమూలంగా మట్టుపెడతారు. నా మరణం మీ అందరి పాలిట మరణమృదంగం అవుతుంది."* అన్నారు ఆయన (రజి).

ఖడ్గం చేతిలో పట్టుకొని కళ్ళలో నిప్పులు కురిపిస్తున్న ఖరాష్ (రజి)ని చూసి సత్యతిరస్కారులు వెనుకంజ వేశారు. హులైస్ కు కూడా ఖురైషీయుల వైఖరి నచ్చలేదు.

*"ఖురైషీయులారా! ఏమిటి ఈ అన్యాయం? ఎంతటి పిరికిపంద జాతి కూడా రాయబారిని వధించదు. మీరు గనక అతడ్ని చంపితే మీ జాతి మీద మాయని మచ్చ ఏర్పడుతుంది. మీకు ధైర్యం ఉంటే బయటికెళ్ళి ముస్లిములతో పోరాడండి."* అన్నాడతను.

*"నిజమే. రాయబారిగా వచ్చిన మనిషిని చంపితే మన జాతికి పెద్ద కళంకం వస్తుంది. ఖరాష్ (రజి)! నీవు వెళ్ళిపోయి, మేము ముస్లింలను ఎట్టిపరిస్థితిలోనూ మక్కాలో ప్రవేశించనీయం అని మీ ప్రవక్తకు చెప్పెయ్యి."* అన్నాడు ఇక్రమా.

ఆ తర్వాత హజ్రత్ ఖరాష్ (రజి) ఖడ్గం వరలో పెట్టేసి వెళ్ళిపోయారు.

చర్చల కోసం వెళ్ళిన ఖరాష్ (రజి), అత్యంత ఆందోళనకర స్థితిలో వెనక్కి వచ్చి, జరిగిన వృత్తాంతాన్ని ప్రవక్త (సల్లం)కు ఇలా వివరించారు....; ↓

*"ఓ ప్రవక్తా! ఖురైషులు క్రోధాగ్నిలో రగిలిపోతున్నారు. వారు నా ఒంటెను చంపేశారు. అహాబిష్ తెగవారు నన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది. లేకపోతే వారు అసలు నన్ను చంపేసేవారే."*

రాయబారికి, రాయబారి సొమ్ముకు కీడు తలపెట్టటమనేది అరబ్బుల్లో ఎన్నడూ లేదు. అసలు అదొక పెద్ద ఘాతుకంగా భావించబడేది. ఖురైషులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ముస్లిముల పట్ల ఖురైషులు ఎంతటి కోపావేశాలతో రగిలిపోతున్నారో ఈ దురాగతం వెల్లడి చేసింది.

దైవప్రవక్త (సల్లం) మాత్రం ఈ సంఘటనపై చాలా సౌమ్యంగా స్పందించారు. ఖురైషులకు వ్యతిరేకంగా ఆయన (సల్లం) ఒక్క మాట కూడా అనలేదు. రాయబారులు అందించిన సమాచారం గురించి అన్ని కోణాల్లో ఆలోచించటం మొదలుపెట్టారు. తర్వాత తన సహచరులను ఉద్దేశించి, *"మనం వారి క్రూరత్వాన్ని సహనంతో ఎదుర్కొందాం. వారి ఈ రోగానికి మన్నింపుల మందుతో చికిత్స చేద్దాం. బహుశా ఖరాష్ (రజి) వారి కంటికి గొప్ప రాయబారిగా కనిపించలేదేమో! ఉమర్ (రజి) అయితే బాగా చర్చలు జరపగలరని నా అభిప్రాయం."* అన్నారు.

ఇప్పుడు దైవప్రవక్త (సల్లం), తమ ప్రస్తుత ప్రయాణాన్ని గురించి విడమర్చి చెప్పడానికి ఖురైషుల ముందుకు మరొక దూతను 'హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రజి)'ను పంపాలని నిశ్చయించుకున్న తర్వాత ఆయన (రజి)ను పిలువనంపారు.

కాని రాయబారిగా వెళ్లేందుకు ఉమర్ (రజి) అనుమానం వెలిబుచ్చుతూ, *"ఓ అల్లాహ్ ప్రవక్తా! ఒకవేళ అక్కడ నన్ను బాధించడం జరిగితే, బనీ కఅబ్ తెగలో ఏ వ్యక్తి కూడా వారి ఆగడాలను సహించక నన్ను ఆదుకునేవాడు కానరావడం లేదు. కాబట్టి తమరు హజ్రత్ ఉస్మాన్ (రజి)ను అక్కడికి పంపించండి. ఆయన వంశం, కుటుంబం అంతా మక్కాలోనే ఉంది. అలా ఆయన తమ సందేశాన్ని వారికి అందజేసినవారవుతారు."* అని విన్నవించుకున్నారు.

_ఉమర్ (రజి), దైవప్రవక్త (సల్లం)తో పలికిన ఈ మాటలు వేరొక ఉల్లేఖనంలో ఇలా ఉన్నాయి....; ↓_

*"దైవప్రవక్తా! ఇంతవరకూ నేనెప్పుడూ మీ మాట కాదనలేదు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను మక్కాకు వెళితే నా ప్రాణానికే ముప్పు. మక్కావారు నన్నూ, నా తెగవారిని విపరీతంగా ద్వేషిస్తున్నారు. మేమంతా ముస్లింలమై మక్కా వదిలిపెట్టి వచ్చాము. అక్కడ నాకు రక్షణ కల్పించేవారెవ్వరూ లేరు. అయితే మక్కాలో మంచి స్థానం, రక్షణ కలిగిన వ్యక్తి మనలో ఒకరు ఉన్నారు. ఆయనే ఉస్మాన్ (రజి). మక్కా నాయకులైన అబాన్, ముఆవియా, అబూ సుఫ్యాన్ వీళ్ళందరూ ఉస్మాన్ (రజి) వంశం వారే. కాబట్టి ఉస్మాన్ (రజి)కు మక్కాలో ఎటువంటి హాని ఉండదు."* అన్నారు.

మహాప్రవక్త (సల్లం), హజ్రత్ ఉస్మాన్ (రజి)ను పిలువనంపి ఆయన్ను ఖురైషుల వద్దకు వెళ్ళమని ఆదేశిస్తూ, *"వారికి ఎరుకపరచకండి! మేము పోరాడటానికి రాలేదు, కేవలం ఉమ్రా చేయడానికి వచ్చాము అని. దానితో పాటు వారిని ఇస్లాం వైపునకు రమ్మని ఆహ్వానించండి. మక్కాలో ఉన్న విశ్వాసుల స్త్రీ పురుషులందరికి త్వరలోనే విజయం చేకూరుతుంది అనే శుభవార్తను కూడా తెలుపండి. అల్లాహ్ తన ధర్మాన్ని మక్కాలో విస్తరింపజేస్తాడనీ, దానికే విజయం చేకూరుతుందనీ, ఇస్లాం విషయంలో మునుముందు ఎవ్వరూ దాక్కునే అవసరం కూడా ఉండబోదనీ శుభవార్తనందించండి."* అని చెప్పి పంపించారు.

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

290

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 290*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 205*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 7*

*హజ్రత్ ఉస్మాన్ (రజి)గారి దౌత్యం : -*

మహాప్రవక్త (సల్లం), హజ్రత్ ఉస్మాన్ (రజి)ను పిలువనంపి ఆయన్ను ఖురైషుల వద్దకు వెళ్ళమని ఆదేశిస్తూ, *"వారికి ఎరుకపరచకండి! మేము పోరాడటానికి రాలేదు, కేవలం ఉమ్రా చేయడానికి వచ్చాము అని. దానితో పాటు వారిని ఇస్లాం వైపునకు రమ్మని ఆహ్వానించండి. మక్కాలో ఉన్న విశ్వాసుల స్త్రీ పురుషులందరికి త్వరలోనే విజయం చేకూరుతుంది అనే శుభవార్తను కూడా తెలుపండి. అల్లాహ్ తన ధర్మాన్ని మక్కాలో విస్తరింపజేస్తాడనీ, దానికే విజయం చేకూరుతుందనీ, ఇస్లాం విషయంలో మునుముందు ఎవ్వరూ దాక్కునే అవసరం కూడా ఉండబోదనీ శుభవార్తనందించండి."* అని చెప్పి పంపించారు.

ఉస్మాన్ (రజి) నగరంలోకి వెళ్ళి 'అబాన్' ఇంటి తలుపు తట్టారు. అబాన్ తలుపు తెరచి చూశాడు. ఉస్మాన్ (రజి)ను చూడగానే, *"స్వాగతం! రా తమ్ముడూ!! ఈ రాత్రిపూట నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ముహమ్మద్ (సల్లం) శిబిరాన్ని వదలిపెట్టి ఇక్కడికెందుకు వచ్చావు?"* అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.

ఉస్మాన్ (రజి) అతనికి బదులిస్తూ, *"నేనిక్కడికి రాయబారిగా వచ్చాను. ఖురైషులు అర్థం చేసుకోలేకపోతున్న ఒక విషయాన్ని వారికి వివరించటానికి నేను ఇక్కడికి వచ్చాను. వారు ఏమైనా హాని తలపెడతారేమోనని భయంగా ఉంది. నాకు నీ రక్షణ కావాలి."* అన్నారు.

అబాన్, ఉస్మాన్ (రజి)ను ఖురైషు నాయకుల వద్దకు తీసుకువెళ్ళి, *"మీకు తెలుసు కదా! ఇతను నా తమ్ముడు ఉస్మాన్. ఇతను ఇప్పుడు నా రక్షణలో ఉన్నాడు. ఇతన్ని ముహమ్మద్ (సల్లం) పంపించారట. ఇతను మీతో ఏదో మాట్లాడాలంటున్నాడు."* అని చెప్పాడు.

అప్పుడు ఉస్మాన్ (రజి), ఖురైషీయులను సంబోధిస్తూ, *"ఖురైషీయులారా! మేము మీ ముందు రెండే రెండు విషయాలు ఉంచుతున్నాం. మమ్మల్ని కాబా ప్రదక్షిణ చేసుకోనివ్వండి. దానికి మీరు ఒప్పుకోకపోతే యుద్ధానికి సిద్ధంగా ఉండండి."* అని అన్నారు.

*"అలా కుదరదు. కావాలంటే నువ్వొక్కడివే కాబా ప్రదక్షిణ చేసుకో. అంతేగాని ఇతరుల ప్రస్తావన ఎత్తకు. వారు అటు నుంచి అటే వెళ్ళిపోవాలి."* అన్నారు ఖురైషీయులు.

ఈ మాటలు వినగానే హజ్రత్ ఉస్మాన్ (రజి)కు ఒళ్ళు మండిపోయింది.

*"ఏమిటీ? ముస్లిములు కాబాదర్శనానికి నోచుకోకుండా వెళ్ళిపోవాలా, నేనొక్కడ్ని మాత్రం కాబా ప్రదక్షిణ చేసుకోవచ్చా? కాదు, ముస్లిములందరికీ కాబా ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఇవ్వాల్సిందే."* అన్నారు హజ్రత్ ఉస్మాన్ (రజి) పట్టుదలతో.

ఖురైషీయులు అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. హజ్రత్ ఉస్మాన్ (రజి) కూడా పట్టు విడవకుండా కాబాదర్శనం చేసుకునే అవకాశాన్ని ముస్లిములందరికీ ఇవ్వాలని అన్నారు. ఇలా చర్చలు ఎటూ తెగకుండా కొన్నాళ్ళు జరిగిపోయాయి.

*ఉస్మాన్ (రజి) నిర్బంధం : -*

మదీనాకు వలస వెళ్ళకుండా మక్కాలోనే బంధింపబడి ఖురైషుల ఆగడాలకు గురవుతూ ఉన్న అణగారిన ముస్లింల ఇళ్ళను ఉస్మాన్ (రజి) సందర్శించారు. *"మీరు నిరాశపడవద్దు, అల్లాహ్ త్వరలోనే మీకు విముక్తి కలిగిస్తాడు."* అని ఆయన వారికి ధైర్యం చెప్పారు.

ఖురైషులకు ఈ విషయం తెలిసింది. మక్కా వారిలో అనైక్యతా బీజాలు నాటుతున్నాడనే నెపంతో వారు ఉస్మాన్ (రజి)ని నిర్భందించారు.

*హజ్రత్ ఉస్మాన్ (రజి) అమరగతినొందారనే పుకారు : - - : బైతె రిజ్వాన్*

ఈ లోపు ముస్లిములు ఉస్మాన్ (రజి) కోసం ఎదురుచూస్తూ ఉండడం వల్ల వారిలో ఓ పుకారు బయలుదేరింది. హజ్రత్ ఉస్మాన్ (రజి)ను ఖురైషులు చంపివేశారనేదే ఆ పుకారు. ఆయన (రజి) తిరిగి రాకపోవడంతో ముస్లిములు ఈ వార్త నిజమేనని భావించారు.

ఇంకేముంది! ముస్లింలలో పెద్ద కలకలం చెలరేగింది. వారు ఆగ్రహోదగ్రులయి పోయారు. అందరిలోనూ పౌరుషం పడగ విప్పి నాట్యమాడసాగింది.

*"ఎంత ద్రోహానికి ఒడిగట్టారు వీరు! పైగా పవిత్ర మాసంలో ఈ ఘాతుక చర్య!! వీరికి పవిత్ర మాసం పట్లగాని, యాత్రికుల పట్లగాని ఏ మాత్రం గౌరవం లేదు."* అన్నారు దైవప్రవక్త (సల్లం) ఈ మాట విని.

అయితే ఇప్పుడు ముస్లింల తక్షణ కర్తవ్యం ఏమిటీ?

రాజనీతి ఉల్లంఘించి ఒక దౌత్యవేత్తను చంపడమంటే స్పష్టంగా యుద్ధ ప్రకటన చేయడమే. అందువల్ల వెంటనే దైవప్రవక్త (సల్లం) ప్రధాన అనుయూయులనందరినీ సమావేశపరిచారు.

*"ఖురైషీయుల నుండి ఉస్మాన్ (రజి) హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం మన విధి. ప్రతీకారం తీర్చుకోకుండా మనం ఇక్కడ్నుంచి ఒక్క అడుగు కూడా వెనక్కి మరలకూడదు."* అన్నారు దైవప్రవక్త (సల్లం) గంభీర వదనంతో.

ఈ మాట చెప్పిన తరువాత ఆయన (సల్లం) కొంచెం దూరాన ఉన్న ఓ తుమ్మచెట్టు నీడకు పోయి కూర్చున్నారు. సహాబా (రజి)లందరినీ ఆ యుద్ధం కోసం ప్రయాణం చేయడానికి పిలుపునిచ్చారు. సహాబా (రజి)లు దైవప్రవక్త (సల్లం) గారి ఆదేశం మేరకు ఆయన (సల్లం) చుట్టూ ప్రోగైపోయారు. ఓ వర్గం, *"మేము యుద్ధరంగాన్ని వదలి పారిపోయేవారం కాదు"* అనగా; మరో వర్గం, *"ప్రాణాలు త్యాగం చెయ్యటానికి మేము సిద్ధం"* అని ప్రమాణం చేసింది.

ఓ మహోన్నత కార్యం కోసం వారు కంకణం కట్టుకున్నారు. దైవప్రీతి కోసం, ధర్మరక్షణ కోసం ఒక మహోద్యమానికి సిద్ధమయ్యారు. దైవప్రవక్త (సల్లం)కు పూర్తిగా విధేయులయిపోయి దైవధర్మం పరిరక్షణ కోసం ముస్లిములంతా తమ సర్వస్వాన్ని త్యాగం చెయ్యడానికి ముందుకు వచ్చారు.

దైవప్రవక్త (సల్లం) చేయి జాపారు. అనుచరులు ఒక్కొక్కరే ముందుకొచ్చి ఆయన (సల్లం) చేతిలో చేయి వేసి శపథం చేశారు. ఘోరమైన శపథం! ఇక విజయమో, వీరమరణమో తేల్చుకోవడమే తరువాయి పని!!

అందరికంటే ముందు 'అబూ సనాన్ అసదీ' ప్రమాణం చేశారు. హజ్రత్ సల్మా బిన్ అకూ (రజి) అయితే మూడుసార్లు, బైత్ ప్రారంభంలో, మధ్యలో, చివరగా ప్రమాణం చేశారు. దైవప్రవక్త (సల్లం) స్వయంగా తన చేయినే పట్టుకొని, *"ఇది ఉస్మాన్ చెయ్యి"* అని అనగా, అందరూ ఆ చేతి మీదుగా బైత్ చేయడం జరిగింది. ఈ బైత్ లో కేవలం ఒకే ఒక వ్యక్తి 'జుద్ బిన్ ఖైస్' అనేవాడు పాల్గొనలేదు. అతను మునాఫిక్.

దైవప్రవక్త (సల్లం) తుమ్మచెట్టు క్రింద కూర్చొని ఈ బైత్ తీసుకున్నారు. హజ్రత్ ఉమర్ (రజి) దైవప్రవక్త (సల్లం) గారి చెయ్యి పట్టుకొని ఉన్నారు. హజ్రత్ మాఖిల్ బిన్ యసార్ (రజి) ఆ చెట్టు కొమ్మలు కొన్నింటిని పట్టుకొని దైవప్రవక్త (సల్లం)పై పడకుండా ఎత్తి పట్టుకున్నారు. ఈ బైత్ (ప్రమాణం) పేరే 'బైతె రిజ్వాన్'.

ఈ బైత్ గురించి అల్లాహ్ దివ్య ఖుర్ఆన్ లో ఈ ఆయత్ ను అవతరింపజేశాడు.

*"(ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. అందువల్ల వారిపై ప్రశాంతస్థితిని (స్థిమితాన్ని) అవతరింపజేశాడు. ఇంకా సమీపంలోనే లభించే విజయాన్ని కూడా అనుగ్రహించాడు." (ఖుర్ఆన్ 48:18)*

*సంధికి సిద్ధమైన ఖురైషీయులు : -*

ముస్లిముల దగ్గర తగినన్ని ఆయుధాలు లేవు. అయినా సరే ఖురైషులు ఉస్మాన్ (ర)ను హత్య చేసిన సంగతి తెలియగానే తప్పకుండా వారితో యుద్ధం చేయాలని ముస్లిములు నిర్ణయించుకున్నారు.

పరిస్థితులు తమకు అనుకూలంగా లేవని గ్రహించిన ఖురైష్ నాయకులు, మరోసారి సమావేశమయి ఓ నిర్ణయానికి వచ్చారు.

*"ఖురైషీయులారా! మనం తాత్కాలికంగా యుద్ధానికి స్వస్తి పలుకుదాం. ముహమ్మద్ (సల్లం) వ్యవహారాన్ని చక్కబెట్టమని, ముస్లింలతో శాంతి ఒప్పందం కుదుర్చుకొని రమ్మని 'సుహైల్ బిన్ అమ్రూ'ని పంపుదాం. అతను ముహమ్మద్ (సల్లం) దగ్గరకు వెళ్ళి, ఈ సంవత్సరం ముహమ్మద్, ఆయన అనుచరులు వెళ్ళిపోయి, వచ్చే సంవత్సరం ఉమ్రా చెయ్యమని ఆయన (సల్లం)కు నచ్చజెబుతాడు."* అన్నారు ఖురైష్ నాయకులు.

ఖురైషీయులు, సుహైల్ బిన్ అమ్రూని దైవప్రవక్త (సల్లం) వద్దకు పంపిస్తూ, ఒప్పందంలో తప్పనిసరిగా, దైవప్రవక్త (సల్లం) ఈ సంవత్సరం వెనక్కు తిరిగి వెళ్ళిపోయే షరతు ఉండాలని మరీ మరీ తాకీదు చేశారు.

అరబ్బులు, మక్కా నగరంలో ప్రవక్త (సల్లం) బలవంతంగా ప్రవేశించారనే భావన కలుగకుండా ఉండాలనేదే వారి అభిమతం.

ఆ తరువాత వారు హజ్రత్ ఉస్మాన్ (రజి)ని పంపివేశారు. ఆయన (రజి) హుదైబియాకు తిరిగి వచ్చారు. ఆయన్ని చూడగానే ముస్లిములంతా తాము విన్న వార్త నిజం కాదని గ్రహించి చల్లగా ఊపిరి పీల్చుకున్నారు.

ఖురైషుల సూచనలతో సుహైల్, మహాప్రవక్త (సల్లం)గారి సన్నిధిలో హాజరయ్యాడు.

దైవప్రవక్త (సల్లం), సుహైల్ రాకను చూసి తన సహచరులతో, *"ఖురైషులు స్వయంగా ఇతన్ని పంపిస్తున్నారంటే వారు మనతో సంధి కుదుర్చుకోడానికి సిద్ధపడ్డారన్నమాట. ఎందుకంటే సుహైల్ చాలా వివేకవంతుడు, మంచి మనిషి. ఇలాంటి మనిషిని ఖురైషులు శాంతి చర్చల కోసమే పంపిస్తారు."* అని చెప్పారు.

కాని ఇక్కడ చూస్తే ముస్లింలు పెద్దఎత్తున యుద్ధసన్నాహాలు చేయడంలో నిమగ్నులై ఉన్నారు. వారి యుద్ధసన్నాహాలు చూసి సుహైల్ భయపడ్డారు. ఎలాగైనా ఈ యుద్ధాన్ని నిలుపుదల చేయించాలని తలచి దైవప్రవక్త (సల్లం) దగ్గరకు వెళ్ళాడు.

*"మహాశయా! నేను మీ దగ్గరకు చర్చలు జరపడానికి వచ్చాను. కాని ఇక్కడ చూస్తే మీ అనుచరులు యుద్ధసన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అక్కడేమో ఖురైషీయులు, ఈ సంవత్సరం మిమ్మల్ని మక్కాలో ప్రవేశించనీయమని తీవ్రంగా ప్రతిన బూనారు. నేను కొన్ని షరతులు తీసుకొచ్చాను. వీటిలో మన ఉభయపక్షాల శ్రేయస్సు ఉంది. వీటిని మీరు ఒప్పుకుంటే ఓ భయంకర యుద్ధాన్ని నివారించినవారవుతారు. అనేకమంది అమాయకుల ప్రాణాలు దక్కుతాయి. అంతటి మహత్కార్యం సాధించిన ఘనత కూడా మీకు లభిస్తుంది."* అన్నాడు సుహైల్.

*"సరే, చెప్పండి. ఏమిటా షరతులు?"* అడిగారు దైవప్రవక్త (సల్లం).

*మిగిలినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

291

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 291*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 206*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 8*

*సంధి కుదుర్చుకునేందుకు ఖురైషీయులు తరఫు నుండి ముస్లిములు వద్దకు రాయబారిగా వచ్చిన సుహైల్ బిన్ అమ్రూ : -*

*హుదైబియా శాంతి ఒప్పందం : -*

*"మహాశయా! నేను మీ దగ్గరకు చర్చలు జరపడానికి వచ్చాను. కాని ఇక్కడ చూస్తే మీ అనుచరులు యుద్ధసన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. అక్కడేమో ఖురైషీయులు, ఈ సంవత్సరం మిమ్మల్ని మక్కాలో ప్రవేశించనీయమని తీవ్రంగా ప్రతిన బూనారు. నేను కొన్ని షరతులు తీసుకొచ్చాను. వీటిలో మన ఉభయపక్షాల శ్రేయస్సు ఉంది. వీటిని మీరు ఒప్పుకుంటే ఓ భయంకర యుద్ధాన్ని నివారించినవారవుతారు. అనేకమంది అమాయకుల ప్రాణాలు దక్కుతాయి. అంతటి మహత్కార్యం సాధించిన ఘనత కూడా మీకు లభిస్తుంది."* అన్నాడు సుహైల్.

*"సరే, చెప్పండి. ఏమిటా షరతులు?"* అడిగారు దైవప్రవక్త (సల్లం).

అప్పుడు సుహైల్ బిన్ అమ్రూ కింది షరతులను వినిపించారు....; ↓

*1 ―» ముస్లింలు ఈ సంవత్సరం మక్కాలో ప్రవేశించకుండానే వెనక్కు మళ్ళిపోతారు. మరుసటి సంవత్సరం ముస్లింలు మక్కాకు వచ్చి ఉమ్రా యాత్ర చేసుకునే అనుమతి ఉంటుంది. అయితే అప్పుడు ముస్లింలు మక్కాలో మూడు రోజులు మాత్రమే ఉంటారు. అప్పుడు ఖురైషులు మక్కా ఖాళీ చేస్తారు. మూడు రోజుల వరకు ముస్లింలు స్వేచ్ఛగా ఉమ్రా చేసుకోవచ్చు. మరుసటి సంవత్సరం ఉమ్రా యాత్రకు వచ్చినప్పుడు ముస్లింలు తమ సాంప్రదాయిక ఖడ్గాలు తప్పితే ఇతర ఆయుధాలేవీ వెంట తీసుకురాకూడదు. ఆ ఖడ్గాలు కూడా ఒరల్లోనే అణిగి ఉండాలి.*

*2 ―» పది సంవత్సరాల వరకు ఉభయ వర్గాలు యుద్ధం జోలికి పోరాదు. ఈ కాలంలో అందరూ ప్రశాంతంగా ఉంటారు. ఏ ఒక్కడూ మరొకనిపై చెయ్యి ఎత్తడానికి వీల్లేదు.*

*3 ―» ఎవరైనా ముహమ్మద్ (సల్లం)తో సంధి చేసుకుంటే చేసుకోవచ్చు. అలాగే మరెవరైనా ఖురైషులతో సంధి చేసుకుంటే చేసుకోవచ్చు. ఏ తెగ అయినా ఓ వర్గంలో చేరిపోతే అది ఆ వర్గానికి చెందినదిగానే భావించబడుతుంది. కాబట్టి అలాంటి ఏ తెగపైనైనా దౌర్జన్యం జరిగితే అది ఆ వర్గంపై దౌర్జన్యం చేసినట్లే అవుతుంది.*

*4 ―» ఖురైషులకు చెందిన ఏ వ్యక్తి అయినా అతని సంరక్షకుని అనుమతి లేకుండా - అంటే పారిపోయి ముహమ్మద్ (సల్లం) వద్దకు వచ్చి చేరితే ముహమ్మద్ (సల్లం), అతనిని ఖురైషులకు అప్పజెప్పవలసి ఉంటుంది. కాని ముహమ్మద్ (సల్లం) అనుచరుల్లో ఎవరైనా - రక్షణ నిమిత్తం పారిపోయి - ఖురైషుల వద్దకు వచ్చి చేరితే ఖురైషులు అతన్ని ముహమ్మద్ (సల్లం)కు అప్పజెప్పరు.*

*"ఇవీ ఖురైషీయుల సంధి షరతులు. ఇక మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. మీ వివేచనా నిర్ణయాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది."* అన్నాడు సుహైల్.

ఈ ఒప్పందంలోని షరతులు ఏకపక్షంగా ఉన్నట్లు ముస్లింలకు అనిపించింది. వారు దీని పట్ల చాలా అసంతృప్తిని వెలిబుచ్చారు. అదీగాక ముస్లింలు ఏ ఉద్దేశంతో మక్కాకు బయలుదేరారో ఆ ఉద్దేశం నెరవేరటం లేదు.

దైవప్రవక్త (సల్లం) ఈ షరతులన్నిటిని అంగీకరించి సంధి పత్రం రాయమని హజ్రత్ అలీ (రజి)ని ఆదేశించారు.

దైవప్రవక్త (స) తమ ఆశలకు భిన్నంగా ఇలాంటి అన్యాయమైన షరతుల్ని ఆమోదిస్తారని ముస్లింలు ఊహించనైనా ఊహించలేకపోయారు. వారు విస్తుపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఆ తర్వాత వారిలో ఆవేశం, ఆత్మాభిమానాలు పెల్లుబికాయి.

*"దైవప్రవక్త (సల్లం) ఇలాంటి దారుణమైన షరతుల్ని ఎందుకు ఒప్పుకున్నట్లు? ఒకవేళ నచ్చజెప్పినా ఖురైషీయులు వినకుండా మొండికేసి మనల్ని కాబాదర్శనం చేసుకోనీయకుండా నిరోధిస్తే, వారి మత్తు మంకుతనాలను వదలగొట్టగల శక్తియుక్తులు మనకు లేవా? వాళ్ళు మనల్ని మక్కాలో ప్రవేశించనీయకుండా ఎన్నటికి అడ్డుకోలేరు."* అని చెప్పుకున్నారు వారు తమలోతాము.

*ముస్లింలకు కలిగిన మనస్తాపం, హజ్రత్ ఉమర్ (రజి)గారి వాగ్వివాదం : -*

హుదైబియా ఒప్పందంలోని షరతుల వాస్తవికతను మనం రాబోయే పుటల్లో తెలుసుకుందాం.

ఈ షరతుల్లో రెండు విషయాలు మాత్రం ముస్లింలను మనస్తాపానికి గురిచేశాయి.

*మొదటిది :→* దైవప్రవక్త (సల్లం) వారితో, *"మనం కాబా గృహానికి వెళ్ళి దాని తవాఫ్ చేస్తాము"* అని చెప్పిన విషయం. అయితే ఆయన (సల్లం) తవాఫ్ చేయకుండానే వెనక్కు మరలుతున్నారు. 

*రెండవది :→* ఆయన (సల్లం) అల్లాహ్ ప్రవక్త. సత్యం ఆయన (సల్లం)కు తోడుగా ఉంది. దానితోపాటు అల్లాహ్ తన ధర్మానికి ప్రాబల్యం కలిగిస్తానని మాట కూడా ఇచ్చి ఉన్నాడు. మరి ఏ కారణం వలన దైవప్రవక్త (సల్లం) ఖురైషుల ఒత్తిడిని స్వీకరించవలసివచ్చింది? వారు ప్రవేశపెట్టిన షరతులపైనే ఎందుకు ఒప్పందం చేసుకోవలసి వచ్చింది?

ఈ రెండు విషయాలు రకరకాల అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటు ముస్లింల భావోద్రేకాలు దెబ్బతినడం వలన వారు సంధి షరతులను లోతుగా తరచి చూడ్డానికి బదులు మనస్తాపం, దుఃఖంతో తల్లడిల్లిపోతున్నారు. బహుశా, అందరికంటే ఈ మనస్తాపానికి గురైన వారు 'హజ్రత్ ఉమర్ (రజి)' గారేనేమో.

ఒప్పందంలోని షరతులను వినగానే ఉమర్ (రజి) ఆగ్రహోదగ్రులయ్యారు. ఆయన (రజి) ఆవేశం అణచుకోలేక వెంటనే దైవప్రవక్త (సల్లం) సన్నిధిలో హాజరయ్యారు.

*"ఓ దైవప్రవక్తా! మనం సత్యంపై లేమా? వారు అసత్యవాదులు కారా? చెప్పండి"* అని అడిగేశారు ఉమర్ (రజి).

దానికి దైవప్రవక్త (సల్లం), *"తప్పకుండా"* అని జవాబు ఇచ్చారు.

ఉమర్ (రజి) తిరిగి, *"మన హతులు స్వర్గస్థులు కాలేదా? వారి హతులు నరకంలో పడలేదా?"* అని అడిగారు.

*"అవును, అది యదార్థం."* అని బదులిచ్చారు మహాప్రవక్త (సల్లం).

దీనికి ఉమర్ (రజి), *"మరి మనం మన ధర్మం విషయంలో ఒత్తిడికి ఎందుకు లోనుకావలసి వచ్చింది? అల్లాహ్ కూడా మా నడుమన ఇంకా ఎలాంటి తీర్పు ఇవ్వనిదే మనం ఎందుకు వెనకకు మరలాలి?"* అని బాధపడుతూ అడిగారు.

*"ఓ ఖత్తాబ్ కుమారుడా? నేను అల్లాహ్ ప్రవక్తను. నేను ఆయనకు ఎన్నడూ అవిధేయతకు చూపను. ఆయన నాకు సహాయాన్ని సమకూరుస్తాడు. నన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు."* అన్నారు మహాప్రవక్త (సల్లం).

*"అయితే, మీరు బైతుల్లాహ్ వద్దకు వెళతానని, దాని తవాఫ్ చేస్తానని మాతో అనలేదా?"* అన్నారు ఉమర్ (రజి).

*"అవును అన్నాను. కాని నేను ఈ సంవత్సరమే అక్కడికి వెళతానని అన్నానా?"* అడిగారు మహాప్రవక్త (సల్లం).

*"లేదు"* అని జవాబిచ్చారు ఉమర్ (రజి).

*"అయితే మొత్తానికి మీరు బైతుల్లాహ్ దగ్గరకు రాగలరూ, దాని తవాఫ్ కూడా చేయగలరు."* అన్నారు మహాప్రవక్త (సల్లం).

అప్పటికీ హజ్రత్ ఉమర్ (రజి) కోపం చల్లారలేదు. ఆయన (రజి) అక్కడ్నుంచి లేచి నేరుగా 'హజ్రత్ అబూ బక్ర్ (రజి)' దగ్గరకు వెళ్ళారు. అబూ బక్ర్ (రజి)తో దైవప్రవక్త (సల్లం)తో వాదించినట్లుగానే వాదించారు ఉమర్ (రజి). హజ్రత్ అబూ బక్ర్ (రజి) కూడా మహాప్రవక్త (సల్లం) గారిచ్చిన సమాధానమే ఇస్తూ దానికి అదనంగా, *"ఓ ఉమర్! ఆందోళన చెందకు. ముహమ్మద్ (సల్లం), అల్లాహ్ సందేశహరుడు. ఆయన (సల్లం) ఏది చేసినా అల్లాహ్ ఆజ్ఞ ప్రకారమే చేస్తారు. కాస్త ఓపిక పట్టు. అల్లాహ్ మనకే విజయం చేకూర్చుతాడని ఆశించు. అల్లాహ్ సాక్షిగా! ఆయన (సల్లం) సత్యంపైన్నే ఉన్నారు గనుక నీ చివరి శ్వాస వరకు ఆయన (సల్లం)నే అనుసరిస్తూ ఉండు."* అని అన్నారు.

హజ్రత్ ఉమర్ (రజి) కకావికలమైన మనసుతో అక్కడ్నుంచి వెళ్ళారు.

ఇక ఆ తర్వాత ఒప్పందాన్ని లిఖించమని మహాప్రవక్త (సల్లం), హజ్రత్ అలీ (రజి)ని పురమాయించారు. దైవప్రవక్త (సల్లం) ఆదేశాన్ని శిరసావహిస్తూ హజ్రత్ అలీ (రజి) సంధి పత్రం రాయడానికి సిద్ధమయ్యారు.

ప్రవక్త (సల్లం), అలీ (రజి)ని ఉద్దేశిస్తూ, *"అలీ! ఆ పత్రం ప్రారంభంలో 'బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ (అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను)' అని వ్రాయి."* అని అన్నారు.

దానికి సుహైల్ అభ్యంతరం చెబుతూ, *"ఆగండి! అలాంటి పదాలు రాయడం మాకు అలవాటు లేదు. ఈ 'రహ్మాన్' ఎవరో, 'రహీమ్' ఎవరో మాకు తెలీదు. మా దగ్గర ఆనవాయితీగా వస్తున్న 'బిస్మికల్లాహుమ్మా (ఓ అల్లాహ్! నీ పేరుతో)' అని మాత్రమే వ్రాయండి."* అన్నాడు.

దైవప్రవక్త (సల్లం), సుహైల్ అభ్యంతరాన్ని అంగీకరించారు. అతను అన్న ప్రకారమే అలీ (రజి) చేత ప్రారంభ వచనం రాయించారు.

అది రాసిన తరువాత తిరిగి దైవప్రవక్త (సల్లం), అలీ (రజి)కి తాకీదు చేస్తూ, ఇలా రాయమని చెప్పనారంభించారు.

*"దైవప్రవక్త అగు ముహమ్మద్ (సల్లం) మక్కా వాసులతో చేసుకున్న ఈ ఒప్పందం ప్రకారం...."*

దానిపై సుహైల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తపరుస్తూ, *"మీకూ - మాకూ మధ్య ఉన్న తగువుకు మూలం అసలు దైవప్రవక్త పదవే కదా! మిమ్మల్ని దైవప్రవక్తగా మేము అంగీకరించినట్లయితే ఈ గోడవంతా ఎందుకు? మీతో యుద్ధాలేందుకు? ఉమ్రా యాత్ర చేసుకునేందుకు మక్కాలోకి రానీయకుండా మిమ్మల్ని ఆపడమెందుకు? 'దైవప్రవక్త అగు ముహమ్మద్' బదులు 'ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ (అబ్దుల్లాహ్ కుమారుడగు ముహమ్మద్)' అని మాత్రమే రాయించండి."* అని అన్నాడు.

దీనికి దైవప్రవక్త (సల్లం), *"మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను అల్లాహ్ ప్రవక్తనే."* అంటూ, హజ్రత్ అలీ (రజి)కు 'ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్'యే రాయమని, అల్లాహ్ ప్రవక్త అనే పదాన్ని తొలగించమని ఆదేశించారు.

'దైవప్రవక్త ముహమ్మద్' అనే పదాలను తన స్వహస్తాలతో కొట్టివేయడానికి అలీ (రజి) నిరాకరించారు.

అపుడు ప్రవక్త (సల్లం), అలీ (రజి)తో, *"సరే, ఆ పదాలు ఎక్కడ ఉన్నాయో చూపించు."* అని అడిగారు.

అలీ (రజి) ఆ పదాలను చూపించగా, మహాప్రవక్త (సల్లం) తన స్వహస్తంతో వాటిని కొట్టివేసి, వాటికి బదులు 'అబ్దుల్లాహ్ కుమారుడగు ముహమ్మద్' అని వ్రాయించారు. ఆ తరువాత ఆ ఒడంబడికలోని షరతులు లిఖించబడ్డాయి.

*'అబూ జందల్'ను అప్పగించడం : -*

ఒప్పంద పత్రం రాయడం ఇంకా పూర్తి కానేలేదు. అంతలో ఒక యువకుడు మక్కా నుంచి పారిపోయి రొప్పుతూ ముస్లింల దగ్గరకి వచ్చాడు. కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు ఉన్నాయి. వాడిపోయిన అతని ముఖంలో దైన్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది.

ఈ పీడితుడు ఎవరో కాదు, ఖురైషుల తరఫున సంధి కోసం రాయబారిగా వచ్చిన సుహైల్ బిన్ అమ్రూ కుమారుడే. ఇతని పేరు 'అబూ జందల్'. ఇస్లాం స్వీకరించిన నేరానికి అతని జీవితం మక్కాలో దుర్భరమైపోయింది. ఖురైషీయుల చేతుల్లో ఎన్ని బాధలు పడ్డాడో ఈ అభాగ్య జీవి! వారి నుండి తప్పించుకోవడానికి మరెన్ని తిప్పలు పడవలసి వచ్చిందో!!

*తరువాత జరిగినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

292

🕌🕋🕌🕋 *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్* 🕋🕌🕋🕌

🇸🇦🤚🏻✋🏻🇸🇦 *అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను* 🇸🇦🤚🏻✋🏻🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

☪🕋🛐🕌      *ఇస్లాం చరిత్ర - 292*       🕌🛐🕋☪

🇸🇦🇸🇦      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 207*      🇸🇦🇸🇦

❂✸••••✸•••✸•••✸•••✸☆✸•••✸•••✸•••✸••••✸❂

      *హుదైబియా ఒప్పందం : - 9*

*'అబూ జందల్'ను అప్పగించడం : -*

ఒప్పంద పత్రం రాయడం ఇంకా పూర్తి కానేలేదు. అంతలో ఒక యువకుడు మక్కా నుంచి పారిపోయి రొప్పుతూ ముస్లింల దగ్గరకి వచ్చాడు. కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు ఉన్నాయి. వాడిపోయిన అతని ముఖంలో దైన్యం కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది.

ఈ పీడితుడు ఎవరో కాదు, ఖురైషుల తరఫున సంధి కోసం రాయబారిగా వచ్చిన సుహైల్ బిన్ అమ్రూ కుమారుడే. ఇతని పేరు 'అబూ జందల్'. ఇస్లాం స్వీకరించిన నేరానికి అతని జీవితం మక్కాలో దుర్భరమైపోయింది. ఖురైషీయుల చేతుల్లో ఎన్ని బాధలు పడ్డాడో ఈ అభాగ్య జీవి! వారి నుండి తప్పించుకోవడానికి మరెన్ని తిప్పలు పడవలసి వచ్చిందో!!

*"ముస్లింలారా! నేను ఇస్లాం స్వీకరించాను. మదీనాకు వలసపోతుంటే ఖురైషులు నన్ను బంధించి ఉంచారు. ఎలాగో వారి నుంచి తప్పించుకొని వచ్చాను. ఇకపై నేను ముస్లింలతో కలసి ఉండాలని కోరుకుంటున్నాను. నన్ను కూడా మీతో పాటు మదీనా తీసుకువెళ్ళండి."* అని దైవప్రవక్త (సల్లం)ను, ముస్లింలను ఉద్దేశించి ప్రాధేయపడసాగాడు అబూ జందల్.

ఆ దృశ్యం చూసి తండ్రి హృదయం ఎంతగానో బాధపడింది. అయినా గుండె రాయి చేసుకొని కుమారుని వంక గుర్రుగా చూశాడు సుహైల్. తర్వాత దైవప్రవక్త (సల్లం)ను ఉద్దేశించి, *"ముహమ్మద్ (సల్లం)! వీడు నా కొడుకు. నేను వీడి సంరక్షకుడ్ని. మన మధ్య ఇప్పుడే ఒక ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం నేను నా కుమారుణ్ణి నా వెంట మక్కాకు తీసుకువెళ్తాను. వీడిని మీరు నాకు అప్పగించాలి."* అన్నాడు.

*"ఇంకా మేము ఈ సంధిపత్రాన్ని రాయటమే పూర్తి చేయలేదు కదా!"* అన్నారు దైవప్రవక్త (సల్లం).

*"సంధిపత్రం రాయడం పూర్తికాకపోయినా సంధిషరతులు మన మధ్య ముందే నిర్ణయమైపోయాయి."* అన్నాడు సుహైల్.

*"సరే, నీవు ఇతన్ని నా కోసమైనా వదిలిపెట్టు."* అని కోరారు మహాప్రవక్త (సల్లం).

*"లేదు. నేను వీడిని మీ కోసమైనా వదిలేది లేదు."* అన్నాడు సుహైల్.

*"లేదు. అలా అనకు. అతణ్ణి వదిలేయి, నా మాట విను."* అన్నారు తిరిగి మహాప్రవక్త (సల్లం).

*"అయితే నేను మీతో ఎలాంటి ఒప్పందం చేసేదే లేదు."* అన్నాడు సుహైల్ కటువుగా.

మహాప్రవక్త (సల్లం) ఎంతో అనునయంగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కాని సుహైల్ మొండికేశాడు. దైవప్రవక్త (సల్లం) హృదయం బాధగా మూలిగింది. కాసేపు తల వంచుకొని మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత ఆయన (సల్లం), అబూ జందల్ వైపు చూస్తూ, *"అబూ జందల్! సహనం వహించు. దీన్ని పుణ్యకార్యంగా భావించు. అల్లాహ్ నీకోసం, నీ వెంట ఉన్నటువంటి బలహీన ముస్లింల కోసం ఏదైనా మార్గం చూపకపోడు. మీ కష్టాలను తీర్చకమానడు. మేము ఖురైషులతో ఒప్పందం కుదుర్చుకున్నాం. మేము వారికి, వారు మాకు దైవాన్ని సాక్షిగా చేసి ప్రమాణం చేసుకున్నాము. అందుకని మేము ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఉల్లఘించలేము."* అని అన్నారు బాధగా.

ఆ తర్వాత ఒప్పంద నియమాల నమోదు కార్యక్రమం ముగిసింది. ఈ సమయంలో సుహైల్ ఎలాంటి అభ్యంతరాన్నీ వ్యక్తం చేయలేదు. అక్కడున్న వారందరికీ ఒప్పంద పత్రం చదివి వినిపించబడింది. ఇరుపక్షాలవారు ఆ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. దానికి సాక్షుల్ని కూడా నియమించడం జరిగింది. ఒప్పంద షరతులు ముస్లింలను కించపరిచినట్లుగా ఉన్నప్పటికీ ముస్లింలు ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. తమ అసంతృప్తిని లోలోపలే దిగమింగారు.

ఇక ఆ తర్వాత సుహైల్, తన కుమారుడ్ని గట్టిగా పట్టుకొని సంకెళ్ళతో ఈడ్చుకుంటూ తీసుకెళ్ళసాగాడు.

ఆ సమయంలో అబూ జందల్, *"ముస్లిములారా! నేను తిరిగి ముష్రిక్కుల వద్దకు వెళ్ళాలా? వీరు నా ధర్మం గురించి నన్ను బాధలకు గురి చేస్తారు."* అని పెద్దగా అరవనారంభించాడు.

ఇది చూసిన హజ్రత్ ఉమర్ (రజి) ఒక్క దూకులో అబూ జందల్ దగ్గరకు వచ్చి చేరారు. అబూ జందల్ నడుస్తూ ఉండగా ఆయన (రజి) అతని వెంటే నడుస్తూ, *"అబూ జందల్! సహనం వహించు. వీరు ముష్రిక్కులు. వీరి రక్తం, కుక్క రక్తం"* అంటూ తన కరవాలం పిడిని అబూ జందల్ చేతికి దగ్గరగా చేస్తూ పోతున్నారు. బహుశా అబూ జందల్ ఈ కరవాలం తీసుకొని తన తండ్రిని నరికేస్తారేమో అని ఉద్దేశ్యంతో. కాని ఆయన తన తండ్రిని చంపే ధైర్యం చేయలేదు. అలా ఆ ఒప్పందం అమలులోకి వచ్చేసింది.

ఒప్పంద పత్రం పూర్తి అయిన తరువాత ఆ ఒప్పందం ప్రకారం 'బనూ ఖుజాఅ' తెగ దైవప్రవక్త (సల్లం)గారి పక్షాన చేరినట్లయింది. వీరు వాస్తవంగా అబ్దుల్ ముత్తలిబ్ కాలం నుండే 'బనూ హాషిమ్'కు మిత్రపక్షంగా ఉంటూ ఉండేవారు. మరోవంక 'బనూ బక్ర్' తెగవారు ఖురైషుల పక్షాన చేరిపోయారు.

*ఉమ్రా సంకల్పం నుండి బయటపడడానికి చేసిన ఖుర్బానీ మరియు శిరోముండనం : -*

దైవప్రవక్త (సల్లం), హుదైబియా ఒప్పంద పత్రాన్ని పూర్తి చేసి సహాబా (రజి)తో, *"ముస్లిములరా! ఖురైషులతో మనకు ఒప్పందం కుదిరింది. కనుక ఇక మీ జంతువులను ఖుర్బానీ చేసేయండి. శిరోముండనం చేయించుకోండి లేదా వెంట్రుకలు కత్తిరించుకోండి. ఇహ్రామ్ దీక్షను విరమించండి. ఇక మనం మన ఇళ్ళకు వెళ్ళిపోదాం."* అని ప్రకటించారు.

కాని ఏ ఒక్కడూ తన స్థానం నుంచి లేవలేదు. ఆయన (సల్లం) ఈ విషయాన్ని మూడు సార్లు అన్నారు. అయినా ఎవ్వరూ లేచి నిలబడలేదు. అప్పుడు మహాప్రవక్త (సల్లం) కాస్త అసహనంతో గుడారంలోకి వెళ్ళిపోయారు. ముఖకవళికల్ని బట్టి ఆయన (సల్లం) ఆందోళనలో ఉన్నారని పసిగట్టిన ఆయన భార్య హజ్రత్ ఉమ్మె సల్మా (రజి), *"ఏమయింది దైవప్రవక్తా! ఎందుకలా ఉన్నారు?"* అని అడిగారు.

*"ఈరోజు ప్రజలకు ఏమయిందో, నా ఆదేశాన్ని పాటించడానికి సిద్ధంగా లేరు. నా ప్రజలు నా మాటను తిరస్కరించారు."* అని దైవప్రవక్త (సల్లం) బదులిచ్చారు.

అప్పుడు ఉమ్మె సల్మా (రజి), ఆయన (సల్లం)కు ధైర్యం చెబుతూ, *"దైవప్రవక్తా! మీ ఆచరణలోనే వారికి గొప్ప ఆదర్శం ఉంది. వారికి అందరికంటే గొప్ప ఆదర్శమూర్తి మీరు. ముందు మీరు బయటికి వెళ్ళి మీ జంతువులను ఖుర్బానీ ఇవ్వండి. మీ తలవెంట్రుకలు గొరిగించుకోండి. మీ ఆదర్శాన్ని వారు తప్పకుండా అనుసరిస్తారని నాకు నమ్మకం ఉంది."* అని సలహా ఇచ్చారు.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం) బయటకు వచ్చి ఎవరితోనూ ఏమీ చెప్పకుండా అలానే చేశారు. అంటే హదీ జంతువును జిబహ్ చేశారు. మంగలిని పిలిపించి తల గొరిగించుకున్నారు.

దైవప్రవక్త (సల్లం) ఇలా చేస్తుండగా చూసి సహచరులు కూడా లేచి తమ తమ హదీ జంతువుల్ని జిబహ్ చేశారు. పరస్పరం ఒకరి తలను మరొకరు గొరుగుకున్నారు. ఆ పరిస్థితి, వారికి కలిగిన మనస్తాపం వల్ల ఒకరిని ఒకరు పొడుచుకుంటారేమో అనేలా ఉంది. ఆ సందర్భంలో ఆవును, ఒంటెను ఏడుగురి తరఫున జిబహ్ చేయడం జరిగింది.

దైవప్రవక్త (సల్లం), అబూ జహల్ ఒంటెను జిబహ్ చేశారు. దాని ముక్కున ఓ వెండి ముక్కెర ఉంది. దాన్ని ఇలా జిబహ్ చేయడానికి కారణం, ముష్రిక్కులు కోపంతో తల్లడిల్లిపోవాలన్నదే.

ఆ తరువాత మహనీయ ముహమ్మద్ (సల్లం), తల గొరిగించుకున్న వారి మన్నింపు కోసం మూడు సార్లు దుఆ చేశారు. కత్తెరతో వెంట్రుకలు కత్తిరించుకున్న వారి కోసం ఒక్కమారే దుఆ చేశారు.

*మదీనాకు తిరుగు ప్రయాణం : -*

ఆ తరువాత అందరూ హదీ పశువుల్ని జిబహ్‌ చేసి మదీనాకు తిరుగు ప్రయాణమయ్యారు.

ఖురైషీయులు విధించిన దారుణ షరతులు దైవప్రవక్త (సల్లం) ఎందుకు ఆమోదించారో ఎంత ఆలోచించినా సహాబా (రజి)లతో పాటు ఉమర్ (రజి)కి అర్థం కాలేదు. ఈ విషయాన్ని గురించి ఉమర్ (రజి) తిరుగు ప్రయాణంలో కూడా దైవప్రవక్త (సల్లం)ను అనేకసార్లు అడిగారు. కాని దైవప్రవక్త (సల్లం) ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారు. దాంతో ఉమర్ (రజి)కు దుఃఖం పొరలివచ్చింది. దైవప్రవక్త (సల్లం)ను విసిగించానే అని ఆయన (రజి) లోలోన బాధపడసాగారు. కాస్సేపటికి హఠాత్తుగా వెనుక నుండి *"ఉమర్! దైవప్రవక్త (సల్లం) నిన్ను పిలుస్తున్నారు."* అనే పిలుపు వినవచ్చింది.

దైవప్రవక్త (సల్లం) పిలుస్తున్నారనగానే ఉమర్ (రజి) గుండెలు దడదడలాడాయి. కొంపదీసి తాను చేసిన తప్పుకు దివ్యావిష్కృతి ద్వారా దైవాగ్రహం విరుచుకుపడలేదు కదా అన్న అనుమానం వచ్చి ఆయన (రజి) ఓ క్షణం పాటు నిలువునా కంపించిపోయారు. అలా భయపడుతూనే ఆయన (రజి), దైవప్రవక్త (సల్లం) సన్నిధికి వెళ్ళారు. కాని అక్కడ చూస్తే దైవప్రవక్త (సల్లం) దివ్యమోము పూర్ణచంద్రుడిలా వెలిగిపోతోంది. పెదవులపై దరహాసం తొణికిసలాడుతోంది.

*"ఉమర్! ఇప్పుడిప్పుడే నాపై ఖుర్ఆన్ అధ్యాయం ఒకటి అవతరించింది. సుమధుర వాణి! హృదయాన్ని ఆనందసాగరంలో ఓలలాడించే దివ్య సందేశం! దాని ముందు ఎంత పెద్ద ప్రాపంచిక సంతోషమైనా బలాదూరే. ఇదిగో విను"* అంటూ దివ్య ఖుర్ఆన్‌ లోని 48:1-6 వరకు గల సూక్తులు వినిపించారు.

_(మరింత వివరణ కోసం చదవండి దివ్య ఖుర్ఆన్‌ 48:1-6 మరియు 48:18-27.)_

ఈ సూక్తులు విని ముస్లింలు పరమ సంతోషంతో పొంగిపోయారు. ఇక ఉమర్ (రజి)గారి ఆనందం అవధులు దాటింది. వెంటనే ఆయన (రజి), దైవప్రవక్త (సల్లం)ను ఉద్దేశించి, *"దైవప్రవక్తా! ఇది విజయమా?"* అని అడగగా; ఆయన (సల్లం), *"అవును"* అని బదులిచ్చారు.

అప్పుడుగాని హజ్రత్ ఉమర్ (రజి) మనస్సు శాంతించలేదు. ఆయన వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అప్పటికిగాని ఉమర్ (రజి)గారికి తన తప్పిదమేమిటో తెలియలేదు. ఆయనకు ఎంతో సిగ్గేసింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, *"నేను ఆ రోజు చేసిన పొరపాటుకు దైవప్రవక్త (సల్లం)తో సంవాదానికి దిగిన తీరుకు భయపడి అప్పటి నుండి నేనెన్నో పుణ్యకార్యాలు చేసుకుంటూ పోతున్నాను. దానధర్మాలు చేస్తూపోయాను. నమాజులు చేస్తూపోయాను. బానిసలను స్వతంత్రులుగా చేశాను. ఇప్పుడు నాకు మేలు జరుగుతుందనే నమ్మకం ఉంది."*

*మిగిలినది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*