293

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋       *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*        🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪             *ఇస్లాం చరిత్ర* *- 293*             ☪🕌🛐

🇸🇦🕋      *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 208*      🕋🇸🇦

 *❂―――•――•――•―●―•――•――•―――❂*

*హిజ్రత్ చేసివచ్చిన మహిళల అప్పగింతను నిరాకరించడం : -*

ఆ తరువాత కొందరు మహిళా విశ్వాసులు దైవప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి చేరడం జరిగింది. మొట్టమొదట 'హజ్రత్ ఉమ్మెకుల్సూమ్ బిన్తె ఉఖ్బా (రజి)' మక్కా నుండి పారిపోయి మదీనా వచ్చారు. వెంటనే ఆమె సోదరుడు వచ్చి, హుదైబియాలో జరిగిన ఒప్పందం ప్రకారం ఆమెను తనకు అప్పగించమని డిమాండు చేశాడు. కాని ఒప్పందంలోని ఈ షరతును అనుసరించి అతని డిమాండును తిరస్కరించడం జరిగింది. ఆ షరతులో ఇలా ఉంది. ↓

*"(ఈ ఒప్పందం ఈ షరతులకు లోబడి చేయబడినదేమిటంటే) మా పురుషుడు ఎవరైనా మీ వద్దకు వస్తే మీరు వారిని తప్పకుండా మాకు అప్పజెప్పవలసి ఉంటుంది. వారు మీ ధర్మాన్ని అవలంబించినవారు అయినా సరే."*

కాబట్టి మహిళల ప్రస్తావన ఈ ఒప్పందంలో లేనేలేదు. అంటే, ఆ షరతుల్లో స్త్రీల సంగతి స్పష్టంగా లేదు. అప్పుడు మక్కా బహుదైవారాధకులు సంధి షరతుల్లోని పదజాలం గమనించి జరిగిన పొరపాటుకు తలలు బాదుకున్నారు.

ఆ తరువాత అల్లాహ్ ఈ విషయమై తన గ్రంథంలో ఈ ఆయత్ ను అవతరింపజేశాడు.

*"ఓ విశ్వాసులరా! విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు మీరు వారిని పరీక్షించండి. (ఆ విషయానికి వస్తే) వారి విశ్వాసం గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వారు గనక విశ్వాసపాత్రులని మీకు అనిపిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. ఈ స్త్రీలు వారికి ధర్మసమ్మతం కారు. వారు ఈ స్త్రీలకు కూడా ధర్మసమ్మతం కాజాలరు. అవిశ్వాసులు ఖర్చు చేసినది వారికి చెల్లించండి. తర్వాత మీరు ఈ స్త్రీలకు మహర్ సొమ్మును చెల్లించి వారిని వివాహమాడటం ఏ మాత్రం దోషం కాదు. విశ్వసించని స్త్రీల మానాన్ని మీ వివాహ బంధంలో ఉంచకండి. మీరు ఖర్చుపెట్టినది అడిగి తీసేసుకోండి. అటు అవిశ్వాసులు కూడా వారు ఖర్చు చేసినది అడిగి తీసేసుకోవాలి. ఇది అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు). దీన్ని ఆయన మీ మధ్య విధించాడు. అల్లాహ్ మహాజ్ఞాని, మహావివేకి." (ఖుర్ఆన్ 60:10).*

ఈ ఆదేశం ప్రకారం ముస్లింలు తమ అవిశ్వాస భార్యలకు తలాక్ ఇచ్చేశారు. అప్పుడు హజ్రత్ ఉమర్ (రజి) వివాహబంధంలో బహుదైవారాధకులుగా ఉన్న ఇద్దరు భార్యలు ఉండేవారు. ఆయన ఆ ఇద్దరికీ తలాక్ ఇచ్చేశారు. ఆ తర్వాత వారిలో ఒకామెను 'ముఆవియా', మరొకామెను 'సుఫ్వాన్ బిన్ ఉమయ్యా' వివాహమాడారు. హజ్రత్ తల్హా (రజి) కూడా ముష్రిక్కు అయిన తన భార్యకు విడాకులిచ్చేశారు.

*హుదైబియా ఒప్పందపు షరతుల వల్ల ఒనగూడిన ప్రయోజనాలు : -*

పైన పేర్కొన్న హుదైబియా ఒప్పందపు షరతుల్ని గనక ఎవరైనా, వాటి నేపథ్యంతో సహా అధ్యయనం చేస్తే, వారు ఇది ముస్లిములకు లభించిన ఘనవిజయంగా తలచడంలో ఏ మాత్రం సందేహానికి గురికారు. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఖురైషులు అప్పటివరకు ముస్లిముల ఉనికినే గుర్తించేవారు కాదు. వారిని సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారు. ఏదో ఓ రోజున ముస్లిముల ఈ శక్తి క్షీణించి అంతమైపోతుందని తలచేవారు.

అదేకాదు, అరేబియా ద్వీపకల్పంలో ఈ ఖురైషులు ధార్మిక పురోహితులుగా, అరబ్బులకు నాయకులుగా కూడా చెలామణి అవుతున్నారు. ఈ రూపంగానైనా వారు ఇస్లామీయ సందేశ ప్రచారానికి, సాధారణ ప్రజలకు నడుమ తమ శక్తియుక్తులన్నిటినీ ధారపోసి అడ్డుతగలాలి. ఈ నేపథ్యంలో గనక దీన్ని గమనించినట్లయితే, ముస్లిముల వైపునకు కేవలం సంధి కోసం ఒగ్గిపోవడం ముస్లిముల శక్తిసామర్థ్యాలను గుర్తించినట్లే లెక్క. ఇంకా వారు ముస్లిముల శక్తిని అణచలేము అని చాటిచెప్పడం అవుతుంది.

*ఒప్పందంలోని మూడవ షరతు గురించి వివరణ : -*

ఇక ఈ ఒప్పందంలోని మూడవ షరతు వెనుక వారి స్వార్థం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఖురైషులకు ఇదివరకు ఏ నాయకత్వపు లక్షణాలు, ఏ ధార్మిక పెత్తనం అయితే లభించాయో వాటిని వారు పూర్తిగా విస్మరించి కేవలం తమ సొంత ప్రయోజనాల్నే లెక్కలోనికి తీసుకున్నారు. ఇతరులు ఏమైపోయినా వారికి పట్టేటట్లు లేదు. అంటే పూర్తి అరేబియా ద్వీపకల్పమే ఇస్లాం ధర్మం స్వీకరించినా ఖురైషులకు దాని చింత లేదు. ఆ విషయంలో వారు ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఉంటామని చెప్పడం అన్నమాట. మరి ఇది ఖురైషుల ధ్యేయం ప్రకారం, వారి ఘోర పరాజయం కాకపోతే మరేమిటి? ముస్లిముల లక్ష్యం ప్రకారం, ఇది వారి ఘనవిజయం కాకపోతే మరింకేమిటి?

       ముస్లిములకు, ముస్లిం విరోధులకు నడుమ ఏ రక్తపాత యుద్ధాలైతే జరిగాయో వాటి ధ్యేయం కూడా అదే. విశ్వాసం మరియు ధర్మం విషయంలో ప్రజలకు పూర్తి స్వాతంత్ర్యం ఉండాలన్నదే కదా! అంటే తమ ఇష్ట ప్రకారం ఏ వ్యక్తి అయినా ఇస్లాం ధర్మాన్ని స్వీకరించవచ్చు. మరెవరైనా దైవతిరస్కార వైఖరిని అవలంబించినా అవలంబించవచ్చు. ఏ శక్తి కూడా వారి ఇష్టానికి అడ్డుగా నిలబడడానికి వీలులేదు అన్నదే. ముస్లిముల ధ్యేయం, వారి ధన సంపదను కొల్లగొట్టడంగానీ, వారిని సంహరించడంగానీ, వారిని బలవంతంగా ముస్లిములుగా మార్చడంగానీ కాదు.

       ఈ ఒప్పందం ద్వారా ముస్లిములకు పైన చెప్పిన లక్ష్యం దాని అన్ని హంగులతో సహా ప్రాప్తమైపోయింది. ఇది ఒక్కొక్కప్పుడు యుద్ధం చేసి ఘనవిజయం సాధించినా లభించని లక్ష్యం అది అన్నది మీరు గ్రహించగలరు. హుదైబియా ఒప్పందం వల్ల ఒనగూడిన స్వాతంత్ర్యం కారణంగా, ముస్లిములు ధర్మప్రచార రంగాల్లో ఎనలేని గొప్ప విజయాన్నీ పొందగలిగారు. ముస్లిముల సైన్యం సంఖ్య ఈ ఒప్పందానికి పూర్వం మూడు వేల కంటే మించి ఉండలేదు. అది కేవలం రెండు సంవత్సరాల్లోనే మక్కా విజయం నాటికి పది వేలకు చేరిపోయింది.

*ఒప్పందంలోని రెండవ షరతు గురించి వివరణ : -*

ఒప్పందంలోని రెండవ షరతు కూడా ఈ ఘనవిజయానికి సంబంధించిన ఓ భాగమే. ఎందుకంటే యుద్ధానికి కాలుదువ్వింది ముస్లిములు కాదు, ముష్రిక్కులే. దివ్య ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు.

*"మొదటిసారిగా వారే మీతో యుద్ధానికి తలపడ్డారు."*

       ముస్లిముల సైనిక కవాతులు, సైనిక చర్యల విషయానికి వస్తే, ఖురైషులు తమ మొండి ధైర్యం, గర్వాలతో ప్రజలను అడ్డుకోకుండా ఉండాలని, సమానత్వం ప్రాతిపదికపై వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని చెప్పడం. అంటే, ప్రతి వర్గం తన తన మార్గాన్ని అనుసరించడానికి స్వాతంత్ర్యం పొంది ఉందన్న మాటే.

       ఇప్పుడు ఆలోచించండి! పది సంవత్సరాల వరకు యుద్ధం జరగకుండా చూడడం అనే ఒప్పందం, వారు తమ గర్వాన్ని వదిలి అల్లాహ్ మార్గంలో అడ్డు నిలువకుండా ఉంటామని చేసిన ఒప్పందమే కదా! యుద్ధాన్ని ప్రారంభించిన వర్గం బలహీనపడిపోయి తన ధ్యేయంలో అపజయం పొందిందనడానికి ఇది ఓ నిదర్శనం కాదా?

*ఒప్పందంలోని మొదటి షరతు గురించి వివరణ : -*

ఇక మొదటి షరతు గురించి ఆలోచిస్తే, ఆ షరతులో ముస్లిములకు అపజయం కంటే వారి విజయమే కానవస్తోంది. అది ఎలాగంటారా? ఈ షరతు వాస్తవంగా ఖురైషులు కాబా గృహంలో ముస్లిములు ప్రవేశించకుండా విధించిన నిషేధాన్ని అంతం చేస్తున్నాము అని చెప్పి చేయించిన ప్రకటనే. అయితే ఆ షరతులో ఖురైషీయులకు సంతృప్తి కలిగించిన విషయం, ఈ సంవత్సరం వారు ముస్లిములను కాబా గృహంలోనికి అడుగు పెట్టకుండా ఉండడంలో కృతకృత్యులవడం. కాని ఇది ఓ తాత్కాలికమైన మరియు విలువలేని ప్రయోజనం మాత్రమే.

ఆ తరువాత దానికి తోడు ఈ ఒప్పందంలో ఖురైషులు, ముస్లిములకు మూడు రాయితీలనిచ్చి కేవలం ఒక రాయితీ మాత్రమే పొందగలిగారు. అది ఆ ఒప్పందం నాలుగవ షరతులో ఉన్న రాయితీ. కాని ఆ రాయితీ కూడా అంత విలువలేని మామూలు రకం రాయితీ మాత్రమే. దీనివల్ల ముస్లిములకు ఎలాంటి నష్టం వాటిల్లబోదు. ఎందుకంటే ఓ ముస్లిం ముస్లింగా ఉన్నంత మట్టుకు, మదీనా నుండి దైవప్రవక్త (సల్లం)ను వదిలి పారిపోయి మక్కాకు వచ్చే ప్రసక్తే లేదు, అతను ధర్మభ్రష్టుడు అయితే తప్ప. ఒకవేళ అతను ధర్మబ్రష్టుడు అయిపోతే, ముస్లిములకు అతని అవసరమే ఉండదు. అతడు తప్పకుండా వారిని వదిలి వెళ్ళవలసిందే.

*"ఎవరైతే మమ్మల్ని వదలి ముష్రిక్కుల వైపునకు పారిపోతాడో అతణ్ణి అల్లాహ్ సర్వనాశనం చేసినట్లే"* అని దైవప్రవక్త (సల్లం) ఈ సందర్భంలోనే చెప్పి ఉండడం గమనార్హం.

ఇక మిగిలిపోయింది, ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి మక్కాలో ఉంటున్నవారు, ఇంకా కొంతమంది ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారి కోసం మదీనా నగరమే కాకుండా అరేబియాలోని ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇదివరకు మదీనా ప్రజలు ఇస్లాం గురించి ఇంకా విని ఉండని కాలంలో సైతం, మక్కావాసుల ఆగడాలను భరించలేక అబీసీనియా ప్రాంతానికి వెళ్ళిపోలేదా? అలాగే ఈ ముస్లిముల కోసం అరేబియాలో ఏ ప్రాంతం అయినా చోటు కల్పించక మానదు. ఈ విషయమే దైవప్రవక్త (సల్లం) గారి ఈ ప్రవచనంలో చెప్పబడింది. ↓

*"వారికి చెందిన ఏ వ్యక్తి అయినా మన దగ్గరకు వస్తే, అతని కోసం అల్లాహ్ మార్గాన్ని చూపకపోడు."*

ఇలాంటి షరతులు పెట్టి ఖురైషులు ఏదో గౌరవాన్ని పొందారని అగుపడుతున్నప్పటికీ, వారు పొందిన రాయితీలన్నీ వారి మానసిక ఆందోళన, భయం, ఒత్తిడి, అపజయాలకే నిదర్శనాలు.

విగ్రహారాధక సమాజం గురించి భయం ఆవరించిందని, వారు కట్టుకున్న గుజ్జనగూడు కాస్తా కూలిపోతోందని భావించడమే. మరోవంక మహాప్రవక్త (సల్లం) ఏ విశాల హృదయంతో ఈ ఒప్పందం షరతుల్లోని నాలుగవ షరతు ఒప్పుకోవడానికి కారణం, తన సమాజం స్థయిర్యంపై, దృఢత్వంపై ఉన్న పూర్తి విశ్వాసమే. ఈ షరతును ఆయన (సల్లం) ఏ భయం వల్లనో ఒప్పుకున్నది కాదు.

*ముస్లింలకు కలిగిన మనస్తాపం, హజ్రత్ ఉమర్ (రజి)గారి వాగ్వివాదం : -*

హుదైబియా ఒప్పందంలోని షరతుల వాస్తవికత ఇది. ఈ షరతుల్లో రెండు విషయాలు మాత్రం ముస్లింలను మనస్తాపానికి గురిచేశాయి.

*మొదటిది :→* దైవప్రవక్త (సల్లం) వారితో, *"మనం కాబా గృహానికి వెళ్ళి దాని తవాఫ్ చేస్తాము"* అని చెప్పిన విషయం. అయితే ఆయన (సల్లం) తవాఫ్ చేయకుండానే వెనక్కు మరలుతున్నారు. 

*రెండవది :→* ఆయన (సల్లం) అల్లాహ్ ప్రవక్త. సత్యం ఆయన (సల్లం)కు తోడుగా ఉంది. దానితోపాటు అల్లాహ్ తన ధర్మానికి ప్రాబల్యం కలిగిస్తానని మాట కూడా ఇచ్చి ఉన్నాడు. మరి ఏ కారణం వలన దైవప్రవక్త (సల్లం) ఖురైషుల ఒత్తిడిని స్వీకరించవలసివచ్చింది? వారు ప్రవేశపెట్టిన షరతులపైనే ఎందుకు ఒప్పందం చేసుకోవలసి వచ్చింది?

ఈ రెండు విషయాలు రకరకాల అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఇటు ముస్లింల భావోద్రేకాలు దెబ్బతినడం వలన వారు సంధి షరతులను లోతుగా తరచి చూడ్డానికి బదులు మనస్తాపం, దుఃఖంతో తల్లడిల్లిపోతున్నారు. బహుశా, అందరికంటే ఈ మనస్తాపానికి గురైన వారు 'హజ్రత్ ఉమర్ (రజి)' గారేనేమో.

_(↑ ఈ వృత్తాంతాన్ని, ఇస్లాం చరిత్ర - 291వ భాగంలో మనం చదువుకున్నాం.)_

*'అబూ బసీర్' దైన్యస్థితి : -*

హుదైబియా ఒప్పందంలోని షరతులు ముస్లిములకు మింగుడు పడటం లేదు. ఈ సంవత్సరం ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్ళటం వారి హృదయాల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది. అబూ జందల్ దైన్యస్థితిని చూసి కూడా, తాము ఆయనకు సహాయపడలేక పోవటంతో వారి అహం దెబ్బతింది. ఈ సంఘటనలన్నీ వారి మనసుల్లో మెదలుతుండగానే మరో సంఘటన జరిగింది. వారి గాయాలపై మళ్ళీ కారం చల్లినట్లయింది.

*ఇందులోని వివరణను In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏    *®@£€€q      +97433572282*     ✏✏      
                *(rafeeq)*

✏✏      *Salman       +919700067779*   ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

294

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 294*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 209*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

*'అబూ బసీర్ (రజి)' దైన్యస్థితి : -*

హుదైబియా ఒప్పందంలోని షరతులు ముస్లిములకు మింగుడు పడటం లేదు. ఈ సంవత్సరం ఉమ్రా చేయకుండా తిరిగి వెళ్ళటం వారి హృదయాల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది. అబూ జందల్ దైన్యస్థితిని చూసి కూడా, తాము ఆయనకు సహాయపడలేక పోవటంతో వారి అహం దెబ్బతింది. ఈ సంఘటనలన్నీ వారి మనసుల్లో మెదలుతుండగానే మరో సంఘటన జరిగింది. వారి గాయాలపై మళ్ళీ కారం చల్లినట్లయింది.

మహాప్రవక్త (సల్లం) మదీనాకు తిరిగివచ్చి నిశ్చింతగా ఉన్నప్పుడు, మక్కా నుంచి ఓ ముస్లిం పారిపోయి మదీనాకు వచ్చాడు. ఆయన పేరు అబూ బసీర్ (రజి). ఈయన 'సఖీఫ్' తెగకు చెందినవారు. సఖీఫ్ తెగ ఖురైష్ మిత్రపక్షం.

అబూ బసీర్ (రజి)ను మక్కాలో ఖురైషులు విపరీతంగా బాధించారు. ఈ సంగతి ఆయన్ను చూస్తేనే తెలిసిపోతుంది. ముస్లింలు, తనకు కుశల ప్రశ్నలు వేసినప్పుడు ఆయన (రజి) తన దురవస్థ గురించి ఇలా చెప్పుకొచ్చారు. ↓

*"ముస్లిములారా! ఒకప్పుడు ముహమ్మద్ (సల్లం) సందేశం మీద నాకు విపరీతమైన కోపం ఉండేది. ఆయన (సల్లం) మక్కా వదలిపెట్టి మదీనాకు వలస వచ్చినప్పుడు ఆయన్నొక తిరుగుబాటుదారునిగా, తన వంశానికి చెడ్డ పేరు తీసుకువచ్చిన వానిగా నేను భావించాను. ఒక రోజు ఎవరో ఖుర్ఆన్ పారాయణం చేస్తుంటే విన్నాను. ఆ శబ్దం వినకూడదని నేను చాలా ప్రయత్నించాను. కాని ఏదో తెలియని శక్తి నన్ను అక్కణ్నుంచి కదలకుండా ఆపింది. నేను బలవంతాన అక్కడి నుంచి వెళ్ళిపోదామని నిశ్చయించాను. కాని ఆ కొద్ది సమయంలోనే నేను ఖుర్ఆన్ పారాయణంలోని అందానికి, దాని శైలికి ముగ్ధుణ్ణయ్యాను. ఆ విధంగా నేను ఇస్లాంకు దగ్గరవుతూ కొద్ది రోజులకే ముస్లింనైపోయాను. ఇటీవల నేను మదీనాకు వచ్చి ముస్లింలతో కలసి జీవించాలనుకున్నాను. నా ఉద్దేశ్యం ఖురైషులకు తెలియజేస్తే, వారు నన్ను బంధించి నిర్దాక్షిణ్యంగా వేధించారు. ఆఖరికి అల్లాహ్ దయతో కాపలాదారుల కండ్లు గప్పి నేను పారిపోయి వచ్చాను. మీతో కలసి జీవించాలనీ, మీతో కలసి అల్లాహ్ మార్గంలో కృషి చేయాలని నా చిరకాల వాంఛ."*

అబూ బసీర్, ఈ మాటలు చెబుతుండగానే ఖురైషుకు చెందిన ఇద్ధరు వ్యక్తులు ఆయన్ని వెతుక్కుంటూ అక్కడకి వచ్చారు. వచ్చీ రాగానే ఆ వ్యక్తులు, దైవప్రవక్త (సల్లం)తో, *"ఓ ముహమ్మద్ (సల్లం)! మాకు తెలిసినంత మటుకు నీవు నీ చిన్నతనంలో కూడా ఆడినమాట తప్పేవాడవు కాదు. అబూ బసీర్ మా మతాన్ని వదలిపెట్టాడు. మా ఆచారాలను కాలరాశాడు. అతనో తిరుగుబాటుదారు. మనం చేసుకున్న ఒప్పందం ప్రకారం అతన్ని బంధించి తీసుకువెళ్లే హక్కు మాకుంది."* అన్నారు.

ఒక వైపు అసహాయ స్థితిలో ఉన్న అబూ బసీర్ (రజి) దీన వదనం! మరో వైపు ఖురైషీయులతో చేసుకున్న శాంతి ఒప్పందం!! దైవప్రవక్త (సల్లం) క్షణం పాటు ఆలోచనలో పడ్డారు. తరువాత ఓ నిర్ణయానికి వచ్చారు.

ఆయన (సల్లం), అబూ బసీర్ (రజి)ని ఉద్దేశిస్తూ, *"అబూ బసీర్ (రజి)! ఖురైషీయులతో మనం ఒప్పందం చేసుకొని ఉన్నాం. మనం ఒప్పందాన్ని ఉల్లఘించలేము కదా! ఒప్పందాన్ని ఉల్లంఘించడం అధర్మం. అందువల్ల నీవు నీ తెగవాళ్ళ దగ్గరకి తిరిగి వెళ్ళిపో."* అన్నారు బాధగా.

ఆ తరువాత దైవప్రవక్త (సల్లం), ఖురైషులను సంబోధిస్తూ, *"నేను ఒప్పందాన్ని ఉల్లంఘించలేదు. అబూ బసీర్ (రజి)ని తీసుకెళ్ళండి. అల్లాహ్ త్వరలోనే అతన్ని, ఇతర ముస్లింలను రక్షించే మార్గం తీసుకువస్తాడు."* అని చెప్పారు.

అప్పుడు అబూ బసీర్ (రజి), ప్రవక్త (సల్లం)తో ఇలా అన్నారు ↓

*"దైవప్రవక్తా! మీరు నన్ను మళ్ళీ అవిశ్వాసుల దగ్గరకి పంపి వారి దౌర్జన్యకాండకు బలికమ్మంటున్నారా? అల్లాహ్ నన్ను వారి కబంధహస్తాల నుండి కాపాడాడు. కాని మళ్ళీ నన్ను వారి దగ్గరకు...."*

*"భయపడకు నాయనా! సహనం వహించు. అల్లాహ్ ఏదోమార్గం చూపించకపోడు. వారి హింసాకాండకు గురవుతున్నవారు ఇంకా కొందరన్నారు. అల్లాహ్ వారిని అలాగే వదలిపెట్టడు. వెళ్ళు బాబు! వెళ్ళు."* అని బదులిచ్చారు ప్రవక్త (సల్లం).

దైవప్రవక్త (సల్లం) గుండెను రాయిచేసుకొని ఆ అభాగ్యజీవిని ఖురైషులకు అప్పగించారు. ఖురైష్ మనుషులు హజ్రత్ అబూ బసీర్ (రజి)ని బంధించి తమతో పాటు తీసుకువెళ్ళారు. ముస్లింలు ఏమీ చేయలేక ఆ దీనుడి వైపు అసహాయంగా చూస్తూ కంటతడి పెట్టుకున్నారు.

*ఖురైష్ వ్యక్తిని హతమార్చిన అబూ బసీర్ (రజి) : -*

ఖురైష్ మనుషులిద్దరు అబూ బసీర్ (రజి)ని తీసుకొని 'జుల్ హలీఫా' అనే ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ కాస్తంత విశ్రాంతి తీసుకుందామని ఆగిపోయారు.

వారందరూ అక్కడ కూర్చుని ఖర్జూరాలు తింటున్నప్పుడు, అబూ బసీర్ (రజి), ఆ ఇద్దరు ఖురైషులలో ఒకర్ని ఉద్దేశించి, *"ఓ ఫలానా వ్యక్తీ! దైవసాక్షి! నీ కరవాలం ఎంతో మేలైనదిగా తోస్తుందే."* అని పొగిడారు.

అతను ఆ పొగడ్తకు తన కరవాలాన్ని ఒరలో నుండి బయటకు తీసి, *"అవును, ఏమనుకున్నావు? ఇది ఎంత మేలైన కరవాలమో! నేను దీన్ని ఎన్నోమార్లు ఉపయోగించాను తెలుసా?"* అని తన ప్రతాపాన్ని చాటుకున్నాడు.

*"ఏదీ, నన్ను కూడా చూడనీ, అది ఎలాంటిదో చూస్తాను."* అని అన్నారు అబూ బసీర్ (రజి).

అతను, ఆయన చేతికి ఆ కరవాలాన్ని అందించగానే, ఒకే వ్రేటుతో అతని తలను నరికేశారు అబూ బసీర్ (రజి).

ఈ హఠాత్పరిణామం చూసి రెండవ వ్యక్తి పలాయనం చిత్తగించాడు. అతను నేరుగా మదీనాకు వెళ్ళి మస్జిదె నబవీలో చొరబడ్డాడు. అతణ్ణి చూడగానే దైవప్రవక్త (సల్లం), *"ఇతను ఏదో ప్రమాదంలో పడినట్లున్నాడే?"* అని అంటూ, ఆ వ్యక్తిని ఉద్దేశిస్తూ, *"ఏమిటి ఇలా వచ్చావు? క్షేమమే కదూ!?"* అని అడిగారు.

దానికి ఆ ఖురైషు వ్యక్తి, *"ఏం చెప్పను మహాశయా! అబూ బసీర్ (రజి), నాతో పాటు వచ్చిన వ్యక్తిని చంపేశాడు. నేనెలాగో తప్పించుకొని వచ్చాను. లేకుంటే నాకూ అదేగతి పట్టేది."* అన్నాడు.

అంతలోనే అబూ బసీర్ (రజి) కూడా అక్కడకి వచ్చి, *"దైవప్రవక్తా! మీరు నన్ను ఖురైషీయులకు అప్పగించి మీ కర్తవ్యం నెరవేర్చుకున్నారు. ఇక మీపై ఎలాంటి బాధ్యతలేదు. కాని నేను నా ఆత్మరక్షణ కోసం ఈ పని చేశాను. ఇప్పుడు నేను ముస్లింలతో కలిసి ఉండటానికి వచ్చాను."* అని అన్నారు.

కాని, దైవప్రవక్త (సల్లం) తన సహచరులతో, *"ఇప్పుడు నేను ఒప్పందంలో ఉన్నాను. ఆ ఒప్పందాన్ని గౌరవించడం విధి. అబూ బసీర్ (రజి) ధైర్యాన్ని నేను మెచ్చుకుంటాను. కాని మదీనాలో ఉండటానికి నేను ఆయన్ని అనుమతించలేను. ఆయన్ని మరెక్కడికైనా వెళ్ళమనండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా నా ప్రాంతం ఆయనకు ఆశ్రయం అవుతుందని, అల్లాహ్ ఆయన ప్రార్థనల్ని, ఆరాధనల్ని స్వీకరిస్తాడని నేను ఆశిస్తున్నాను."* అన్నారు.

మరో దారి లేక అబూ బసీర్ (రజి) మదీనా విడచి వెళ్ళవలసి వచ్చింది. ఆయన (రజి) మనసు ఎంతో బాధపడింది. ఎక్కడికి వెళ్ళాలో పాలుపోని పరిస్థితి! అత్యంత దైన్యస్థితిలో అబూ బసీర్ (రజి) తిరిగి వెళ్ళిపోవడం ముస్లింలను మరోమారు కంట తడిపెట్టించింది. ముస్లింలు మరింత భావోద్వేగానికి లోనయ్యారు.

*మక్కా నుంచి పారిపోయి వస్తున్న ముస్లింలను తిరిగి వెనక్కి పంపడం : -*

హుదైబియా ఒప్పందంలో ఒక షరతు ఈ విధంగా ఉంది.... ; ↓

*"మక్కా నుండి ఎవరైనా పారిపోయి మదీనా వెళ్ళిపోతే అతడ్ని మక్కాకు తిరిగి పంపివేయాలి. కాని మదీనా నుండి ఎవరైనా మక్కాకు వస్తే అతడ్ని మదీనాకు తిరిగి పంపడం జరగదు."*

ఈ షరతు ప్రకారం దైవప్రవక్త (సల్లం) మక్కా నుండి పారిపోయి వచ్చిన ముస్లింలను తిరిగి మక్కాకు తిప్పి పంపుతూ ఉండేవారు. ఇలా కొంతమంది ముస్లింలను తిప్పిపంపారు.

*వాణిజ్య బృందాలపై దాడులు : -*

హజ్రత్ అబూ బసీర్ (రజి) మదీనా నుంచి నేరుగా సముద్ర తీరానికి పోయి 'అమీస్' అనే చోట ఆగిపోయారు. వెంట తెచ్చుకున్న ఖర్జూర పండ్లతో, సముద్రపు చేపలతో క్షుద్భాధ తీర్చుకుంటూ అక్కడే కాలం గడపసాగారు.

మక్కాలో ఖురైషీయుల హింసా దౌర్జన్యాలకు గురై అష్టకష్టాలు అనుభవిస్తున్న ఇతర ముస్లింలు ఈ విషయం తెలుసుకొని ఒక్కొక్కరే రహస్యంగా అబూ బసీర్ (రజి) దగ్గరకి చేరుకోవడం ప్రారంభించారు. 'సుహైల్' కొడుకు 'హజ్రత్ అబూ జందల్ (రజి)' కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ విధంగా కొంతకాలానికే మక్కా నుండి డెబ్భై మందికి పైగా ముస్లింలు పారిపోయి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. వారిది ఓ బృందమే తయారైపోయింది.

మక్కా నుంచి సిరియాకు పోయే, సిరియా నుండి తిరిగొచ్చే వర్తక బిడారాలన్నీ ఈ ప్రాంతం గుండానే వచ్చి పోవలసి ఉంటుంది. హుదైబియా ఒప్పందం ప్రకారం మక్కా నుండి పారిపోయే ముస్లింలు మదీనా వెళ్ళడానికి వీలులేనందున వారంతా ఈ ప్రాంతానికే వచ్చి చేరుకొని, ఇక్కడకు వచ్చే వాణిజ్య బృందాలపై గెరిల్లాదాడులు చేస్తూ వాటిని దోచుకోవడం ప్రారంభించారు.

ఇలా ఈ పీడిత ముస్లింలే మక్కా ఖురైషీయులకు పెద్ద బెడదగా తయారయ్యారు. ఏ సంధి షరతుల వల్ల తమ ప్రతిష్ఠ పెరుగుతుందని భావించారో ఆ సంధి షరతులే ఇప్పుడు వారి బ్రతుకు తెరువుకు అవరోధాలుగా మారి ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ పోరు పడలేక ఖురైషీయులు మదీనా వెళ్ళి దైవప్రవక్త (సల్లం)కు మొర పెట్టుకున్నారు. మదీనాకు వచ్చే ముస్లింలను మక్కాకు తిరిగి పంపించాలనే ఒప్పంద నియమాన్ని మార్చుకోవాలని, సముద్రతీరాన ఉన్న శరణార్థుల్ని మదీనా పిలిపించుకొని తమను ఇక్కట్ల నుంచి గట్టెక్కించమని వేడుకున్నారు ఖురైష్ నాయకులు.

ఖురైషీయులు, తమలో ఒక రాయబారిని దైవప్రవక్త (సల్లం) వద్దకు పంపి, అబూ బసీర్ (రజి) సమస్యను పరిష్కరించుకున్న విధానం మరింత వివరంగా....; ↓

*In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏ *®@£€€q  +97433572282* ✏✏ 
             *(rafeeq)*

✏✏  *Salman    +919700067779* ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

295

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 295*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 210*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

మక్కా నుంచి సిరియాకు పోయే, సిరియా నుండి తిరిగొచ్చే వర్తక బిడారాలన్నీ ఈ ప్రాంతం గుండానే వచ్చి పోవలసి ఉంటుంది. హుదైబియా ఒప్పందం ప్రకారం మక్కా నుండి పారిపోయే ముస్లింలు మదీనా వెళ్ళడానికి వీలులేనందున వారంతా ఈ ప్రాంతానికే వచ్చి చేరుకొని, ఇక్కడకు వచ్చే వాణిజ్య బృందాలపై గెరిల్లాదాడులు చేస్తూ వాటిని దోచుకోవడం ప్రారంభించారు.

ఇలా ఈ పీడిత ముస్లింలే మక్కా ఖురైషీయులకు పెద్ద బెడదగా తయారయ్యారు. ఏ సంధి షరతుల వల్ల తమ ప్రతిష్ఠ పెరుగుతుందని భావించారో ఆ సంధి షరతులే ఇప్పుడు వారి బ్రతుకు తెరువుకు అవరోధాలుగా మారి ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ పోరు పడలేక ఖురైషీయులు మదీనా వెళ్ళి దైవప్రవక్త (సల్లం)కు మొర పెట్టుకున్నారు. మదీనాకు వచ్చే ముస్లింలను మక్కాకు తిరిగి పంపించాలనే ఒప్పంద నియమాన్ని మార్చుకోవాలని, సముద్రతీరాన ఉన్న శరణార్థుల్ని మదీనా పిలిపించుకొని తమను ఇక్కట్ల నుంచి గట్టెక్కించమని వేడుకున్నారు ఖురైష్ నాయకులు.

*ఖురైషీయులు, తమలో ఒక రాయబారిని దైవప్రవక్త (సల్లం) వద్దకు పంపి, అబూ బసీర్ (రజి) సమస్యను పరిష్కరించుకున్న విధానం మరింత వివరంగా....; ↓*

*దైవప్రవక్త (సల్లం) వద్దకు ఖురైష్ రాయబారి : -*

ఒకరోజు ఎవరో రౌతు మదీనా వైపు రావటం ముస్లింలకు కనిపించింది. అతను కూడా కొత్తగా ఇస్లాం స్వీకరించి మక్కా నుంచి పారిపోయి వస్తున్నాడని ముస్లింలు అనుకున్నారు. వారు, అతనికి ఎదురుగా వెళ్ళి, *"ముస్లింగా మారి ఇక్కడికి వచ్చావా బాబు! అయితే వెంటనే ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. ఈ నగరం నీకు అనువైన స్థలం కాదు. ఎందుకంటే ఖురైషులతో మాకు ఒప్పందం ఉంది. ఖురైషుల నుంచి మేము నిన్ను విడిపించలేము."* అంటూ, అతని ముందు తమ అశక్తతను వెల్లడిస్తూ మాట్లాడారు. తాము ముస్లింలమైనందున ఒప్పందాన్ని ఎన్నటికీ ఉల్లంఘించలేమని ఖరాకండీగా చెప్పేశారు. మదీనా కాకుండా మరెక్కడికైనా వెళ్ళమనీ, అల్లాహ్ సహాయంపై నమ్మకం ఉంచమని వారు అతనికి సలహానివ్వసాగారు.

వారి మాటలు విన్న ఆ మనిషి బిగ్గరగా నవ్వేశాడు. *"మీరు పొరబడుతున్నారు. నేను ముస్లింను కాను. నేను మా ప్రజల మతాన్ని ఎన్నటికీ వదలిపెట్టను. నేను ఖురైషుల తరఫున రాయబారిగా వచ్చాను. ఎంతో ముఖ్యమైన విషయమై ముహమ్మద్ (సల్లం)తో మాట్లాడటానికి నేనిక్కడికి వచ్చాను."* అని చెప్పాడు.

*"ఖురైషులు ఈ సమయంలో రాయబారం ఎందుకు పంపి ఉంటారు?"* అని ముస్లింలు పునరాలోచనలో పడిపోయారు. వారు ఆ వచ్చిన వ్యక్తిని ముహమ్మద్ (సల్లం) దగ్గరకి తీసుకువెళ్ళారు.

ఆ వ్యక్తి, దైవప్రవక్త (సల్లం)తో మాట్లాడుతూ, *"ముహమ్మద్ (సల్లం)! ఇంతకు ముందు మా దగ్గరి నుంచి పారిపోయిన అబూ బసీర్ (రజి) విషయం గురించి మీతో మాట్లాడటానికి ఖురైషులు నన్ను పంపారు. అతను ఒక ఎడారిలో దాక్కున్నాడు. మక్కా నుంచి పారిపోతున్న ముస్లింలు అబూ బసీర్ (రజి) దగ్గర ఆశ్రయం పొందుతున్నారు. అబూ బసీర్ (రజి), అతని అనుచరులు మా మీద యుద్ధం ప్రకటించారు. వారు మా వ్యాపార బృందాలను అడ్డుకొని మా సరుకును దోచుకుంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారం అడగటానికి నేను మీ దగ్గరికి వచ్చాను. మదీనాకు వచ్చే ముస్లింలను మక్కాకు తిరిగి పంపించాలనే ఒప్పంద నియమాన్ని మనం ఉభయులం కలసి మార్చుకుంటే, ఇకముందు ఆ సమస్య ఉండదని మా అభిప్రాయం. వారు మీ వెంట ఉండటమే మాకు శ్రేయస్కరం. తద్వారా కొత్తగా ఇస్లాం స్వీకరించేవారు అబూ బసీర్ (రజి) వర్గంలో చేరకుండా ఉంటారు. లేకపోతే అబూ బసీర్ (రజి) అనుచరుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే వారి చేతుల్లో మేము ముప్పతిప్పలు పడతాము."* అన్నాడు.

ఒప్పందంలోని ఆ నియమాన్ని మార్చడానికి దైవప్రవక్త (సల్లం) సంతోషంగా అంగీకరించారు. పరిస్థితుల్లో వచ్చిన ఈ మార్పుకు ముస్లింలు చాలా సంతోషించారు. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ సోదరులు ఇప్పుడు తమతోనే ఉంటారు. తమతోనే కలసి, శాంతీసుహృధ్బావ వాతావరణంలో అల్లాహ్ ను ఆరాధిస్తారు. ఈ పరిణామం ముస్లింలకు అమితమైన ఆనందాన్ని ఇచ్చింది.

ఆ తరువాత మహాప్రవక్త,(సల్లం), హజ్రత్ అబూ బసీర్ (రజి) దగ్గరకి ఓ లేఖ పంపి, అమీస్ లో నిరాశ్రయజీవితం గడుపుతున్న శరణార్థుల్ని తీసుకొని మదీనా వచ్చేయమని ఆజ్ఞాపించారు.

ఈ లేఖ అబూ బసీర్ (రజి) దగ్గరకు చేరుకునే సమయంలో అబూ బసీర్ (రజి) వ్యాధిగ్రస్తులయి ఉన్నారు. అంచేత ఆయన (రజి) అబూ జందల్ (రజి)ని పిలిచి దైవప్రవక్త (సల్లం) ఆజ్ఞ వినిపిస్తూ, *"నీవు వెంటనే మనవాళ్ళను తీసుకొని మదీనా వెళ్ళిపో"* అని చెప్పారు.

హజ్రత్ అబూ జందల్ (రజి) అనుచరుల్ని తీసుకొని హిజ్రీ శకం - 7వ సంవత్సరం మదీనా చేరుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్ళకే హజ్రత్ అబూ బసీర్ (రజి) చనిపోయారు.

ఇప్పుడు యావత్తు ముస్లింలు సంతోషంతో గడపసాగారు. మక్కా, మదీనాల మధ్య సురక్షితమైన రాకపోకలు ప్రారంభమయ్యాయి. దాంతో మక్కా ప్రజలు మదీనా వచ్చి తమ బంధుమిత్రుల్ని కలుసుకొని, వారితో లావాదేవీలు జరుపుకునే అవకాశం లభించింది. వారిలో అనేకమంది బహుదైవారాధకులు ముస్లింల జీవనసరళిని సమీపం నుంచి చూసి ప్రభావితులై ఇస్లాం స్వీకరించడం మొదలెట్టారు.

ముస్లింలు, మొదట్లో ఏ ఒప్పందాన్ని తమకు అవమానకరమైనదిగా, ఘోరపరాజయంగా తలచారో, అదే ఇప్పుడు వారి ప్రతిష్ఠను ఈ విధంగా పెంచి అధ్బుత విజయంగా పరిణమించింది.

*ఖురైష్ సోదరుల ఇస్లాం స్వీకారం : -*

ఈ సంధి జరిగిన తరువాత హిజ్రీ శకం - 7, ప్రారంభకాలంలో 'హజ్రత్ అమ్రూ బిన్ ఆస్ (రజి)', 'హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి)', 'హజ్రత్ ఉస్మాన్ బిన్ తల్హా (రజి)'లు ఇస్లాం ధర్మాన్ని స్వీకరించి ముస్లిములైపోయారు★. వీరు దైవప్రవక్త (సల్లం)గారి సన్నిధిలో హాజరవగా, వారిని చూసి ఆయన (సల్లం), *"మక్కా తన కాలేయ శకలాలను మాకు అప్పగించింది."* అని పలికారు.

_(★→ ఈ సహాబాలు హిజ్రీ శకం ఏ సంవత్సరంలో ఇస్లాం స్వీకరించారు అన్న విషయంలో అభిప్రాయభేదాలు ఉన్నాయి. 'అస్మా ఉర్రిజాల్' గ్రంథాల్లో ఈ సంఘటన హిజ్రీ శకం - 7వ సంవత్సరంలో జరిగినట్లుంది. హజ్రత్ అమ్రూ బిన్ ఆస్ (రజి) అబీసీనియా నుండి తిరిగివచ్చిన తరువాత హజ్రత్ ఖాలిద్ బిన్ వలీద్ (రజి) మరియు హజ్రత్ ఉస్మాన్ బిన్ తల్హా (రజి)లు ఇస్లాం స్వీకరించారన్నది తెలిసిన విషయమే. కారణం ఏమిటంటే, ఆయన అబీసీనియా నుండి తిరిగివచ్చి మదీనాకు బయలుదేరేటప్పుడు వీరిద్దరూ ఆయన్ను కలిశారు. ఈ ముగ్గురు కలిసి దైవప్రవక్త (సల్లం)గారి సన్నిధికి చేరి ఇస్లాం స్వీకరించారు. అంటే వీరంతా హిజ్రీ శకం - 7వ సంవత్సర ప్రారంభకాలంలోనే ముస్లిములయ్యారు. (వల్లాహు ఆలమ్))_

*తరువాతది In Sha Allah రేపటి భాగంలో....;*

✏✏ *®@£€€q  +97433572282* ✏✏ 
             *(rafeeq)*

✏✏  *Salman    +919700067779* ✏✏

*Note : - ఈ msg లను ముందుకు పంపిస్తూ, మన ఇస్లాం చరిత్ర గురించి మన ముస్లిం సోదరులకు, సోదరీమణులకు తెలియజేస్తారని ఆశిస్తున్నాము.*

296

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 296*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 211*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

           *రెండవ దశ : - - : క్రొత్త మార్పు*

హుదైబియా ఒప్పందం, యధార్థంగా ముస్లిముల జీవితంలో వచ్చిన ఓ క్రొత్త మార్పే అనాలి. ఖురైష్ జాతి, ఇస్లాం పట్ల వైరంలోను, శత్రుత్వంలోనూ తీవ్రమైన మొండి వైఖరిగల జగడాల మారి జాతి. అందుకని వారు యుద్ధంలో అపజయంపాలై శాంతి వైపునకు మొగ్గుజూపినప్పుడు, అహ్జాబ్ యుద్ధంలో కలసి పోరాడిన మూడు పక్షాల్లో - ఖురైష్, గత్ఫాన్ మరియు యూదులు - పటిష్టమైన ఒక పక్షం చిన్నాభిన్నమైపోయింది. ఖురైషులే పూర్తి అరేబియా ద్వీపకల్పంలో విగ్రహారాధనకు ప్రాతినిధ్యం వహించేవారుగా, దానికి నాయకులుగా ఉన్నందువలన, వారు యుద్ధమైదానం నుండి వైదొలగిపోగానే విగ్రహారాధకుల భావోద్రేకాలు కాస్తా చల్లబడిపోయాయి. వారి శత్రుత్వ వైఖరిలో చాలా మటుకు మార్పు వచ్చేసింది. అందుకని ఈ ఒప్పందం జరిగిన తరువాత గత్ఫాన్ వారి వైపు నుండి ఎలాంటి గొడవలు జరిగినట్లు మనకు అగుపడదు. వారేదైనా చేయగలిగారంటే అది కూడా యూదులు రెచ్చగొట్టడం మూలంగానే.

ఇక యూదుల విషయానికి సంబంధించినంత మటుకు, వారు యస్రిబ్ (మదీనా) నుండి బహిష్కరింపబడిన తరువాత 'ఖైబర్' చేరి దాన్ని తమ కుట్రలకు, కుతంత్రాలకు కేంద్రంగా మలుచుకున్నారు. అక్కడ యూదులకు చెందిన కుట్రదారులు తమ ప్రయత్నాలలో నిమగ్నమైపోయి సంక్షోభాన్ని రేకెత్తించే ప్రయత్నంలో మునిగిపోయారు. తమ చుట్టుపట్ల నివసిస్తున్న బద్దూలను ఉసిగొలుపుతూ దైవప్రవక్త (సల్లం) మరియు ముస్లిములను హతమార్చేందుకు లేదా కనీసం వారికి భారీ నష్టాన్నయినా కలిగించే ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కాబట్టి హుదైబియా ఒప్పందం తరువాత దైవప్రవక్త (సల్లం) మొట్టమొదటిగా యూదుల ఆటపట్టువైన 'ఖైబర్'ను జయించి వారి ఆగడాలను మట్టుబెట్టేందుకు నిర్ణయాత్మక సైనిక చర్య చేపట్టారు.

ఎలాగైతేనేమి, హుదైబియా ఒప్పందం తరువాత ప్రారంభమైన శాంతి ఘట్టం ద్వారా ముస్లిములకు ఇస్లామీయ సందేశ ప్రచారాన్ని వ్యాపింపజేసే ముఖ్యమైన అవకాశం లభించినట్లయింది. ఇస్లామీయ ప్రచార కార్యక్రమాల కోసం, ఈ రంగంలో వారి కృషి, సైనిక చర్యలంటే ముఖ్యమైపోయింది. కాబట్టి ఆ కాలంలో జరిగిన కార్యక్రమాలను రెండు విధాలుగా విభజించి చూడడం సబబుగా తోస్తుంది.

*1. సందేశ ప్రచారం మరియు రాజులకు, సర్దారులకు లేఖలు పంపించడం.*

*2. యుద్ధ కదలికలు.*

ఈ దశలో, యుద్ధ కదలికలను గురించి చెప్పే బదులు, రాజులు ,సర్దారుల పేర పంపబడిన లేఖల గురించిన వివరాలు చెప్పడం ముఖ్యమని భావిస్తున్నాము. ఎందుకంటే, సహజంగా ఇస్లామీయ సందేశ ప్రచార ధ్యేయమే అసలు ఇస్లాం యొక్క ధ్యేయం. ఈ లక్ష్యాన్ని సాధించడానికే ముస్లిములు రకరకాల కష్టాలను, యుద్ధాలను, సంక్షోభాలను భరిస్తూ వస్తున్నారు.

*రాజులకు, సర్దారులకు పంపించిన లేఖలు : - 1*

హిజ్రీ శకం - 6 చివరన దైవప్రవక్త (సల్లం) హుదైబియా నుండి మదీనాకు తిరిగివచ్చాక, వివిధ రాజుల పేరున లేఖలు రాసి వారిని ఇస్లాం సందేశం వైపునకు ఆహ్వానించారు.

మహాప్రవక్త (సల్లం) వారికి ఆ లేఖలను రాయడానికి ఉపక్రమించినప్పుడు, ఏ రాజైనా, ఏ చక్రవర్తి అయినా ఆ లేఖను స్వీకరించాలంటే దానిపై ముద్ర తప్పక ఉండాలి అనే సలహా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆయన (సల్లం) ఓ వెండి ముద్రను తయారు చేయించారు. ఆ ముద్రపై *'ముహమ్మదుర్రసూలుల్లాహ్'* అనే అక్షరాలు చెక్కబడి ఉన్నాయి.

అలా లేఖలు రాయించి అనుభవజ్ఞులైన సహాబాలకిచ్చి దూతలుగా వారి వద్దకు పంపారు. ఈ దూతల్ని, ఖైబర్ యుద్ధానికి బయలుదేరడానికి కొన్ని రోజుల ముందు, ఒకటవ ముహర్రం హిజ్రీ శకం - 7న పంపారని 'అల్లామా మన్సూర్ పూరి' పూర్తి ఆధారాలతో చెబుతారు. వచ్చే పంక్తుల్లో ఆ లేఖలు ఆ లేఖల వలన కలిగిన ప్రతి స్పందనలను గురించి తెలుసుకుందాం.

*1. అబీసీనియా చక్రవర్తి 'నజాషీ' పేరున పంపిన లేఖ : -*

ఈ నజాషీ పేరు ''అస్'హమా బిన్ అబ్'హర్". దైవప్రవక్త (సల్లం) అతని పేర రాసిన లేఖను, 'అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి)' చేతికిచ్చి హిజ్రీ శకం - 6 చివరన లేదా హిజ్రీ శకం - 7 ప్రారంభంలో పంపించారు. 'తిబ్రీ' ఈ లేఖలోని పూర్తి పాఠాన్ని కూడా ఉటంకించాడు. అయితే ఈ లేఖలో రాయబడిన విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తే, దీన్ని దైవప్రవక్త (సల్లం) హుదైబియా ఒప్పందం తరువాత రాసిన లేఖలా అగుపించదు. బహుశా ఈ లేఖలో రాసిన విషయాలు దైవప్రవక్త (సల్లం) మక్కాలో ఉన్నప్పుడే, హజ్రత్ జాఫర్ (రజి) అబీసీనియాకు హిజ్రత్ చేసి వెళ్ళేటప్పుడు రాసి ఇచ్చిన లేఖ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ లేఖ చివరన ముహాజిర్ల ప్రస్తావన ఈ క్రింది మాటల్లో ఉంది.

*"నేను మీ వద్దకు నా పినతండ్రి కుమారుడైన జాఫర్ వెంట ఓ బృందాన్ని పంపించాను. వీరు మీ వద్దకు వచ్చినప్పుడు వీరికి మీ దేశంలో శరణు ఇవ్వండి. వారిపై ఎలాంటి ఒత్తిడి చేయకండి."*

బైహఖీ, హజ్రత్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించిన ఉల్లేఖనం ద్వారా మరో ఉత్తరం పూర్తి పాఠం ఇలా ఉందని రాస్తున్నారు. దాని అనువాదం ఇలా ఉంది....; ↓

*"ఈ లేఖ ముహమ్మద్ దైవప్రవక్త (సల్లం) తరఫున నజాషీ అస్'హమ్, అబీసీనియా చక్రవర్తికి రాయబడుతూ ఉంది.*

  *సన్మార్గాన్ని అనుసరిస్తూ, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించిన వారికి సలాం (శుభాలు). ఏ ఒక్కడూ సాటిగా రాని ఆ అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆయనకు భార్య గాని, కుమారుడుగాని లేరు. అలాగే ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త అని కూడా నేను సాక్ష్యం ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ఇస్లాం వైపునకు ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే నేను అల్లాహ్ ప్రవక్తను గనుక. కాబట్టి మీరు ఇస్లాం స్వీకరిస్తే శాంతిని పొందగలరు. 'ఓ గ్రంథవహులారా! మాకూ, మీకూ నడుమ సమానంగా ఉన్న ఆ విషయం వైపునకు రండి. అదేమిటంటే, అల్లాహ్ తప్ప మరెవ్వరినీ ఆరాధించము అని, ఆయనకు ఇంకెవ్వరినీ సాటి కల్పించము అని మరియు మనలో ఏ ఒక్కరూ మరి ఒకరిని అల్లాహ్ తప్ప ప్రభువుగా చేసుకోము అనేది. ఒకవేళ వారు దాన్ని తిరస్కరిస్తే చెప్పేయండి, మేము ముస్లిములము, మీరే దానికి సాక్షి అని'. మీరు ఈ సందేశాన్ని స్వీకరించకపోతే మీ జాతి నసారా (క్రైస్తవుల) పాపం అంతా మీదే అవుతుంది."*

డాక్టరు హమీదుల్లాహ్ (ప్యారిస్), ఇంకో లేఖలో ఉన్న వస్తువును తన గ్రంథంలో ఉటంకించారు. ఇది ఇటీవలే లభ్యమైన లేఖ. ఒకే ఒక పదం తేడాతో ఆ లేఖే, అల్లామా ఇబ్నె ఖైమ్ గ్రంథం జాదుల్ ముఆద్ లోనూ నిక్షిప్తమై ఉంది. డాక్టరు హమీదుల్లాహ్, ఈ లేఖలో రాసివున్న వస్తువు గురించి పరిశోధించడంలో ఆధునిక విధానాలను అనుసరించారు. ఈ లేఖ ఫోటోను తన గ్రంథంలో అచ్చువేయించారు కూడా. ఆ లేఖ అనువాదం ఇది. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్, అబీసీనియా చక్రవర్తి నజాషీకి వ్రాయునది.*

  *సన్మార్గాన్ని అనుసరించే వ్యక్తికి సలాం (శాంతి కలుగుగాక). అల్లాహ్ తప్ప మరే పూజ్యుడు లేడనీ, ఆయన ఖుద్దూస్ (పవిత్రుడు) మరియు సలాం (దైవ సుగుణాల్లో ఓ సుగుణం, శాంతి) అనీ, శాంతి ప్రదాత, సంరక్షకుడు అనీ మీకు నేను తెలియపరుస్తున్నాను. 'ఈసా ఇబ్నె మర్యం (మరియం కుమారుడు ఈసా)', అల్లాహ్ తన ఆత్మను మర్యంలోకి ఊదడం వల్ల ఆమె గర్భవతి అయిందని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇది అల్లాహ్ ఆదం (అలైహి)ను సృష్టించిన తీరు అలాంటిదే. నేను, ఆయనకు ఎవరూ సాటిలేరని ఆ అల్లాహ్ వైపునకు, ఆయన విధేయతకు పరస్పరం సహకారాన్ని అందించే వైపునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దీనికితోడు, మీరు నన్ను అనుసరించాలని, నా వైపునకు ఏదైతే వచ్చిందో దాన్ని విశ్వసించమని పిలుపునిస్తున్నాను. ఎందుకంటే, నేను అల్లాహ్ ప్రవక్తను. నేను మిమ్మల్ని మీ సైన్యాన్ని అల్లాహ్ వైపునకు పిలుస్తున్నాను. నేను నా సందేశాన్ని మీకు వినిపించేశాను. కాబట్టి నా హితబోధను స్వీకరించండి. ధర్మమార్గాన్ని అనుసరించే వారికి శాంతి కలుగుగాక.★*

_(★→ జాదుల్ ముఆద్ లో చివరి పదం *'వస్సలాము అలా మనిత్తబ ఉల్ హుదా (ధర్మమార్గాన్ని అనుసరించే వారికి శాంతి కలుగుగాక)'* కు బదులు *'అస్లిమ్ అన్త (నీవు ముస్లిం అయిపో)'* అని ఉంది. చూడండి, జాదుల్ ముఆద్ - 3/60)_

ఏదైతేనేమి, అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి), దైవప్రవక్త (సల్లం) పంపించిన ఈ లేఖను నజాషీకి అందించగా అతను దాన్ని తీసుకొని కళ్ళకు అద్దుకున్నాడు. అదే పరిస్థితిలో సింహాసనం నుండి క్రిందికి దిగి వచ్చి హజ్రత్ జాఫర్ బిన్ అబీ తాలిబ్ చేతుల మీదుగా ఇస్లాం స్వీకరించాడు. చక్రవర్తి నజాషీ, దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికి ఈ విషయం గురించి ఏ జవాబు అయితే రాసి పంపాడో దాని అనువాదాన్ని ఇక్కడ రాయడం జరిగింది. ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

*దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) గారి సన్నిధికి అస్'హమా వ్రాయునది.*

  *ఓ దైవప్రవక్తా! ఆరాధనకు అర్హుడైన ఆ అల్లాహ్ తరఫున తమకు సలాములు, కారుణ్యం మరియు శుభాలు కలుగుగాక. ఆ తరువాత.*

  *ఓ అల్లాహ్ ప్రవక్తా! నాకు మీరు పంపిన లేఖ అందింది. ఈ లేఖలో హజ్రత్ ఈసా (అలైహి)గారి ప్రస్తావన ఉంది. భూమ్యాకాశాల ప్రభువు సాక్ష్యంగా, తమరు (తమ లేఖలో) ప్రస్తావించినట్లుగానే హజ్రత్ ఈసా (అలైహి) ఓ గడ్డిపోచకంటే ఎక్కువ ఏమీ కాదు. తమరు వర్ణించిన మనిషే ఆయన.*

  *తమరు మా వద్దకు పంపించిన సందేశాన్ని తెలుసుకున్నాము. మీ పినతండ్రి కుమారునికి మరియు మీ అనుచరులకు ఆతిథ్యం ఇచ్చాము. తమరు అల్లాహ్ యొక్క నిజమైన ప్రవక్త అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. నేను మీతో బైత్ చేశాను. మీ పినతండ్రి కుమారుని చేతి మీదుగానూ బైత్ చేశాను. ఆయన చేతి మీదుగానే అల్లాహ్ రబ్బుల్ ఆలమీన్ కోసం ఇస్లాం స్వీకరించాను.*

ప్రవక్త మహనీయులు (సల్లం), హజ్రత్ జాఫర్ (రజి) మరియు అబీసీనియాకు వెళ్ళిన ఇతర ముహాజిర్లను వెనక్కు పంపించమని కూడా కోరి ఉన్నారు నజాషీని. అందుకని అతను, హజ్రత్ జాఫర్ (రజి), హజ్రత్ అబూ మూసా అష్అరీ (రజి)లను ఇంకా ఇతర సహాబా (రజి)లను, హజ్రత్ అమ్రూ బిన్ ఉమయ్యా జమ్రీ (రజి) వెంట వెళ్ళడానికి రెండు పడవలను కూడా సమకూర్చాడు. వీరు నేరుగా ఖైబర్ కు చేరి దైవప్రవక్త (సల్లం)ను దర్శించుకున్నారు. మరో పడవలో వీరి కుటుంబసభ్యులు నేరుగా మదీనాకు చేరుకున్నారు.

_(దైవప్రవక్త (సల్లం), అబీసీనియా రాజు నజాషీ వద్దకు పంపిన ఈ లేఖలో, ఉమ్మె హాబీబా (రజి)తో తమ నికాహ్ చేయమని కూడా రాశారు. నజాషీ, ఉమ్మె హాబీబా (రజి) స్వీకారంతో ఆమె నికాహ్ దైవప్రవక్త (సల్లం)తో చేసివేశాడు. ← ఈ వృత్తాంతంలోని వివరణను, 'రాజులకు మరియు సర్దారులకు పంపించిన లేఖలు' అనే వృత్తాంతాల తర్వాత తెలుసుకుందాం.)_

పైన పేర్కొన్న నజాషీ, తబూక్ యుద్ధానంతరం రజబ్ నెల హిజ్రీ శకం - 9లో మరణించగా, దైవప్రవక్త (సల్లం) అతని మరణం రోజున్నే సహాబా (రజి)కు అతని మరణ వార్తను తెలియజేశారు. ఆ తరువాత అతని 'గాయిబానా నమాజె జనాజా' చేశారు. అంటే అతని మృతదేహం ఎదురుగా లేకుండానే జనాజా నమాజు చేశారన్నమాట. అతని మరణాంతరం మరో రాజు సింహాసనాన్ని అధిష్టించగా దైవప్రవక్త (సల్లం) అతనికి కూడా ఓ లేఖ రాసి పంపించారు. అయితే అతను ఇస్లాం స్వీకరించింది లేనిది తెలిపే ఆధారాలు లభించలేదు.

*In Sha Allah రేపటి భాగంలో....; ↓*

*2. ఈజిప్టు చక్రవర్తి ముఖౌఖిస్ కు పంపిన లేఖ : -*