1. నువ్వు చనిపోయేలోగా ........................

నువ్వు చనిపోయేలోగా చదివి అర్థం చేసుకోవలసిన పుస్తకము
బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపారా కృపాశీలుడు అయిన *అల్లాహ్*  పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

---------------------------------------------------

                             *ఇస్లాం చరిత్ర*

                              భాగము - 1                 

                                     

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

 సృష్టి ప్రారంభం నుంచి *ఇస్లాం* ప్రారంభమైంది . యావత్తు విశ్వం సమస్త సృష్టి రాశులు సృష్టికర్త , సర్వశక్తిమంతుడు అయినా *అల్లాహ్* కు బద్ధులయి తమ తమ విధులు నిర్వర్తిస్తున్నాయి.

 అంటే భూమి , ఆకాశాలు , సూర్య చంద్రులు , గ్రహాలు , నక్షత్రాలు అని ఇస్లాం పరిధిలో ఉండి *అల్లాహ్* కు విధేయత చూపుతున్నాయన్న మాట. *ఇస్లాం* అంటే శాంతి , సమర్పణ, విధేయత, ఆజ్ఞాపాలన అని అర్థాలున్నాయి.

 *అల్లాహ్* ఆకాశం వైపు దృష్టి సారించారు. అప్పుడు ఆకాశం పూర్తిగా పొగ రూపంలో ఉంది ( ఆ పొగను కూడా *అల్లాహ్* నే సృష్టించారు). అప్పుడు *అల్లాహ్* భూమి , ఆకాశాలను లను ఉద్దేశించి ఇలా అన్నారు " మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ ఉనికిలోకి రండి " అని దానికి అవి ఇలా సమాధానమిచ్చాయి " మేము వినమ్రులై వచ్చేశామని ". ( *ఖురాన్* 41 : 11).

 అప్పుడు *అల్లాహ్* రెండు రోజుల్లో ఏడు ఆకాశాలను నిర్మించాడు. ప్రతీ ఆకాశానికి తత్సంబంధిత నియమావళిని నిర్దేశించాడు . *అల్లాహ్* భూలోకాన సమీపాన ఉన్న ఆకాశాన్ని దీపాలతో ( నక్షత్రాలు ) అలంకరించాడు. దాన్ని అన్ని విధాలా సురక్షితంగా ఉంచాడు. ఇదంతా మహా శక్తిమంతుడు, అపార వివేకవంతుడైన *అల్లాహ్* రూపొందించిన పథకం. ( *ఖురాన్* 41:12 ).


 ఈ విధంగా *అల్లాహ్* భూమి,  ఆకాశాలను 6 రోజుల్లో సృష్టించాడని *ఖురాన్* చెబుతోంది. ఈ దినాలు మనం ప్రమానంగా తీసుకునే దినాలు కానవసరం లేదు. ఎందుకంటే మీరు లెక్కించే ఒకరోజు *ఖురాన్లో* వెయ్యేళ్లకు సమానమని మరొకచోట ఒకరోజు 50 వేల ఏళ్లకు సమానమని ఉంది . *ఖురాన్* సైన్స్ గురించి చెప్పే గ్రంథం కాదు.  తన అవతరణ కాలంనాటి మానవులకు అర్థమయ్యేలా సంక్షిప్తంగా *అల్లాహ్* అసాధారణ శక్తి సామర్థ్యాల ప్రస్తావనల ద్వారా ఆయన ఏకత్వాన్ని చాటిచెప్పే దైవగ్రంథం . ఆ దృష్టి తోనే *ఖురాన్* ను అధ్యాయనం చేస్తే విషయం అర్ధం అవుతుంది.

 ఆయనే భూమి, ఆకాశాలను ఆరు రోజుల్లో సృష్టించాడు. తద్వారా ఆయన అధికార సింహాసనమును అధిష్టించి యావత్తు విశ్వ వ్యవస్థను నిర్వహిస్తున్నాడు . ( *ఖురాన్* 10:3 ).

 *అల్లాహ్* ఆరు రోజుల్లో భూమి , ఆకాశాలను సృష్టించాడని తద్వారా ఆయన అధికార సింహాసనం అధిష్టించాడు అంటే , నిర్వహణ కార్యక్రమాలను వదిలి విశ్రాంతి తీసుకుంటున్నాడని అర్థం కాదు , సృష్టి నిర్మాణం తర్వాత ఆయన విశ్వంలోని యావత్తు చరచరాలను , సృష్టి రాశులను పర్యవేక్షిస్తున్నారని , పాలిస్తున్నారని , పోషిస్తున్నాడని అర్థం.

                          _*మానవ సృష్టి*_ 

          నీ ప్రభువు దైవ దూతలతో " భూలోకంలో నేను ఖలీఫా ( దైవ ప్రతినిధి )" ను నియమించ బోతున్నాను అని చెప్పినప్పుడు దైవదూతలు ఏమన్నారో తెలుసా ? " ఏమిటి మీరు ప్రపంచ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి, రక్తం వడగట్టే వాడిని భూలోకంలో నియమించబోతున్నారా ?  మేము మిమ్మల్ని అనుక్షణం స్తుతిస్తూ మీ పవిత్రతను స్తుతిస్తూనే ఉన్నాం కదా " అని దైవదూతలు అన్నారు. దానికి *అల్లాహ్* " మీకు తెలియని విషయాలెన్నో నాకు తెలుసు " అని అన్నారు. ( *ఖురాన్* 2:30)          


      


 ఆ తర్వాత ఆయన ( *అల్లాహ్* ) ఆదం అలైహిస్సలాం కు సమస్త వస్తువుల పేర్లు తెలియచేశాడు. ఆపై ఆ వస్తువులను దైవదూతల ముందు ప్రవేశ పెట్టి *అల్లాహ్* దైవదూతలతో ఇలా అన్నాడు " మీ అభిప్రాయం సరి అయినది అయితే కాస్త ఈ వస్తువుల పేర్లు ఏమిటో తెలియజేయండి " అని *అల్లాహ్* దైవదూతల తో అన్నాడు. దానికి వారు " మీరు పరిశుద్ధులు, మీరు మాకు తెలియ చేసినంత మేరకే మాకు తెలుసు అంతకు మించి ఒక్క విషయం కూడా మాకు తెలియదు. వాస్తవానికి మీరే అన్నీ తెలిసినవారు, వివేకవంతులు " అని అన్నారు దైవదూతలు. ( *ఖురాన్* 2:31,32)

 ఆ తర్వాత *అల్లాహ్* ఆదం అలైహిస్సలాం తో " ఈ వస్తువుల పేర్లు ఏమిటో చెప్పు " అని అన్నారు, ఆదం అలైహిస్సలాం వాటి పేర్లన్నీ చెప్పారు , అప్పుడు *అల్లాహ్* దైవదూతల తో ఇలా అన్నారు " భూమి, ఆకాశాలతో గుప్తంగా ఉన్న విషయాలు నాకు తెలుసు అని నేను అన్నాను కదా ! మీరు పైకి వెలిబుచ్చే విషయాలు , లోపల దాచుకునే విషయాలు కూడా మాకు తెలుసు ". ఆ తర్వాత *అల్లాహ్* ఆదం అలైహిస్సలాం కు గౌరవ సూచకంగా అభివాదం (సజ్దా ) చెయ్యండని ఆదేశించారు. అప్పుడు *ఇబ్లీసు* తప్ప అందరూ అభివాదం చేశారు . *ఇబ్లీసు* తనేదో గొప్ప వాడినన్న అహంకారంతో విర్రవీగుతూ, తిరస్కరించి అవిధేయుడై అయిపోయాడు . ( *ఖురాన్* 2:33,34) .

 అప్పుడు *అల్లాహ్* ఇబ్లీసు తో ఇలా అన్నారు " ఇబ్లీస్ ! ఏమైంది నీకు ? నేను స్వహస్తాలతో సృజించిన మానవునికి అభివాదం ( సజ్ దా ) చేయకుండా నిన్ను ఏ విషయం నిరోధించింది ? నువ్వు గొప్పవాడివి అయిపోయావా ? లేక నువ్వు ఏదైనా అగ్రస్థాయి ప్రముఖుల కోవకు చెందిన వాడివి అనుకుంటున్నావా ? " అని అడిగారు . దానికి ఇబ్లీసు  *అల్లాహ్* తో ఇలా అన్నారు " నేను అతని కన్నా ( ఆదం కన్నా ) , శ్రేష్ఠుడ్ని , మీరు నన్ను అగ్నితో సృజించారు , ఆదం అలైహిస్సలాం ను మట్టితో సృజించారు " అని *అల్లాహ్* తో అన్నారు . ( *ఖురాన్* 38:75,76 ) .

 *అల్లాహ్* :-  అలాగనా ! అయితే నువ్వు ఇక్కడినుంచి దిగిపో. ఇక్కడ గర్వంతో విర్రవీగడానికి నీకు ఎలాంటి హక్కు లేదు , వెళ్ళిపో ఇక్కడినుంచి , నీవు   ( మా ఆదేశాన్ని దిక్కరించి ) పరమ నీచుడిని అయిపోయావు.

ఇబ్లీసు :-  అయితే అల్లాహ్ మానవులు మళ్లీ బ్రతికించబడేంత వరకు ( ప్రళయదినం వరకు ) నాకు గడువు ఇవ్వు . 

 *అల్లాహ్* :-  అలాగే ఇస్తున్నాం వెళ్ళు. ( *ఖురాన్* 7:13-15 ).


ఇబ్లీసు :-  *అల్లాహ్* నీవు నన్ను ఏ విధంగా దారి తప్పించావో ,  అదేవిధంగా నేను కూడా భూలోకంలో ఉన్న మానవుల్ని ఎన్నో మనోహరమైన వస్తువులను చూపించి వారిని దారితప్పిస్తాను. ( *ఖురాన్* 15-39 ).

 *అల్లాహ్* :-   ఓరీ నీచుడా ! శాపగ్రస్తుడై ఇక్కడి నుంచి వెళ్ళిపో , నీతో సహా నిన్ను అనుసరించే వారందరిని నరకంలో విసిరేస్తాను. ( *ఖురాన్* 7:18 ).


 నా దగ్గరకు చేరుకోవడానికి ఇదే రుజుమార్గం ( *నమాజు చదవడం , దీన్ లో నడవడం )* . ఈ మార్గంలో నడిచే నా ప్రియ దాసులపై ని అధికారం చెల్లదు. నీ అధికారం నిన్ను అనుసరించే భ్రష్టుల పైనే చెల్లుతుంది . వారందరికీ నరకమే గతి ఇది మా వాగ్దానం . ( *ఖురాన్* 15:41-43 ).

                     *దివి నుంచి భువి పైకి* 

 ఆ తర్వాత మేము ( *అల్లాహ్* ) ఆదం అలైహిస్సలాం తో ఇలా అన్నాము  " నీవు , నీ భార్య ( హవ్వా అలైహిస్సలామ్ ) స్వర్గంలో నివసించండి ,  ఇక్కడ మీరు కోరుకుందల్లా తింటూ హాయిగా ఉండండి . అయితే ! అదిగో ఆ చెట్టు దరిదాపులకు మాత్రం వెళ్లకండి . వెళితే మీరు కూడా దుర్మార్గులు అయిపోతారు . ( *ఖురాన్* 2:35 ).

 ఆదం ఇతను ( ఇబ్లీసు ) నీకు , నీ భార్యకు బద్ధ విరోధి , ఇతను ( ఇబ్లీసు ) మీ ఇద్దరిని స్వర్గం నుంచి బయటకు తీయడం , దాని వల్ల మీరు కష్టాల్లో పడడం జరగకూడదు ! ఇక్కడ మీకు కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి , ఇక్కడ ఆకలి గానీ , కట్టుబట్టలు కొరతగానీ ఉండదు , అలాగే ఇక్కడ దప్పిక గాని ,  ఎలాంటి ఎండ బాధ కూడా ఉండదు . ( *ఖురాన్* 20:117-119 ).

 కానీ షైతాన్ అతన్ని మభ్యపెట్టాడు , షైతాన్ అతని దగ్గరకు వెళ్లి " ఆదం నేను నీకు శాశ్వత జీవితాన్ని , ఎన్నడూ పతనం కానీ రాజ్యాధికారాన్ని అందించే కల్పవృక్షాన్ని చూపనా అన్నాడు , చివరకు వారిద్దరూ ( ఆదం మరియు హవ్వా ) షైతాన్ యొక్క టక్కరి మాటలకు మోసపోయి ఆ చెట్టు యొక్క పండ్లు తిన్నారు , దాంతో వారి మర్మావయవాలు ఒకరి ముందు ఒకరివి బహిర్గతమైపోయాయి , అప్పుడు వారిద్దరూ స్వర్గవృక్షాల ఆకులతో తమ శరీరాలను కప్పుకోసాగారు , ఆదం ఇలా తన ప్రభువు ( *అల్లాహ్* ) మాట జవదాటి సన్మార్గం తప్పిపోయారు . ( *ఖురాన్* 20:120-121 ) .

షైతాన్ ( వారుభయుల్ని నిషేధిత వృక్షం గురించి లేని పోనీ ఆశలు కల్పించి) వారిని పూర్వస్థితి నుంచి దిగజార్చి స్వర్గ సౌఖ్యాలకు దూరం చేశాడు , అపుడు *అల్లాహ్* వారితో " మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి , మీరు ఒకరికొకరు శత్రువులు , ఒక నిర్ణీత కాలం వరకు భూలోకంలో జీవితం గడపవలసి వస్తుంది " అని అన్నారు . ( *ఖురాన్* 2:36 ) .

తద్వారా ఆదం తన ప్రభువు ద్వారా కొన్ని మాటలు గ్రహించి , పశ్చాత్తాపం తో *అల్లాహ్* ని వేడుకున్నాడు , దాన్ని *అల్లాహ్* స్వీకరించాడు . *అల్లాహ్* గొప్ప క్షమాశీలి , అమిత దయామయుడు .

 *అల్లాహ్* వారితో ఇలా అన్నారు " మీరంతా ఇక్కడి నుంచి దిగిపోండి , నా దగ్గర నుంచి మీ దగ్గరకు ఏదైనా మార్గదర్శకత్వం ( *నమాజు చదవడం , దీన్ లో నడవడం* ) వస్తే దాన్ని అనుసరించాలి . దాన్ని ( *నమాజు చదవడం , దీన్ లో నడవడం* ) అనుసరించేవారికి ఎలాంటి భయం కానీ , దుఃఖము కానీ ఉండదు . నా మార్గదర్శకత్వాన్ని నిరాకరించి , నా సూక్తుల్ని ధిక్కరించేవారు నరకానికి పోతారు . అక్కడే వారు నానా యాతలు అనుభవిస్తూ ఎల్లకాలం పడిఉంటారు . " ( *ఖురాన్* 2:37-39 ) .

అలా శాపగ్రస్తులైన ఆదం , హవ్వా లను *అల్లాహ్* భూమి పైకి పంపించాడు. ఆదమ్, *అల్లాహ్* యొక్క ప్రథమ మానవ సృష్టి. ప్రథమ ప్రవక్త కూడానూ. ఇతడి ధర్మపత్ని హవ్వా. వీరిరువురూ ధరణి పై తొలి మానవులు మరియు ఆది దంపతులు. వీరి సంతతి అభివృధ్ధిచెందుతూ నేటికి 235 దేశాలలో 710 కోట్లకు చేరింది.


వీరి ప్రథమ మరియు ద్వితీయ కుమారులు ప్రపంచంలో మొదటి అన్నదమ్ములు ఖాబీల్(బైబిల్ లో పేరు - కయీను) మరియు హాబీల్ (బైబిల్ లో పేరు - హేబేలు), హాబీల్ ఖాబీల్ను చంపేస్తాడు. అంటే ఇది మొదటి హత్య. దీనితో ఆదమ్, హవ్వలు తమ సొంత కొడుకే ఇంకో కొడుకును హత్య చేస్తే పుత్రశోకాన్ని అనుభవిస్తారు. షైతాన్ చేసిన మోసం వల్ల ఆది దంపతులైన ఆదం , హవ్వా దివి నుండి భువి కి దిగవలసి వచ్చింది , ఆనాటి నుంచి నేటి వరకు పుట్టిన మానవులంతా వారి సంతతే.

In Sha Allah మిగతాది రేపటి భాగము -  2 లో.

2

                    బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్  


🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపారా కృపాశీలుడు అయిన *అల్లాహ్*  పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐


---------------------------------------------------


                              *ఇస్లాం చరిత్ర*  


                                భాగము - 2                  


                                     


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


 *షైతాన్ చేసిన మోసం వల్ల ఆది దంపతులైన ఆదం అలైహస్సలాం మరియు హవ్వా అలైహిస్సలామ్ లు దివి నుండి భువి పైకి వచ్చిన తర్వాత ;* 


 *ఆదం పిల్లల వివాహాలు* 


ఆదం అలైహిస్సలామ్ , హవ్వా అలైహిస్సలామ్ కు పిల్లలు పుట్టిన తర్వాత, వారి పిల్లలు తమలో తామే వివాహం చేసుకొని ఉంటారు. మరి ఖురాన్ లో సోదర సోదరీమణులు వివాహం నిషేధించబడినది (హారామ్ చేయబడినది).


భూమి పై ఎలాగైనా మానవ జాతి ని విస్తరించాలన్న ఉద్యేశ్యం తో ఉన్న ఆదం (అలైహి), *అల్లాహ్* అజ్ఞతొనే తన కుమార్తెల పెళ్ళిళ్ళను తన కుమారులతో జరిపించెను. ఆదం మరియు హవ్వా కు ప్రతి కాన్పులో కవలలు పుట్టేవారు. ఆ కవల పిల్లల్లో తప్పని సరిగా ఒక ఆడపిల్ల మరియు ఒక మగ పిల్లవాడు పుట్టేవారు. కాబట్టి ఒక కవలల జంటలో పుట్టిన ఆడపిల్లను వేరొక కవలల జంటలో పుట్టిన మగపిల్లవాడితో ఆయన పెళ్ళి జరిపించేవారు.


దీని గురించి ఇబ్నె మస్ఊద్, ఇతర సహాబాల (రదియల్లాహు అన్హుమ్) నుండి ముర్రాహ్ మరియు ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమ్ ను౦డి అబు సాలెహ్‌ మరియు అబు మాలిక్ ల ద్వారా " సుద్ది " అనే పండితుడు ఇలా తెలిపారు. ఆదం అలైహిస్సలామ్ కు ఒక ఆడపిల్ల మరియు ఒక మగపిల్లవాడి తొ కూడిన కవలల జంటలుగా మాత్రమే పిల్లలు పుట్టేవారు. అంటే ప్రతి కాన్పులో కవలలే పుట్టెవారు. ఆ కవలలొ ఒక ఆడపిల్ల మరియు ఒక మగపిల్లవాడు తప్పకుండా పుట్టేవారు. కాబట్టి ఆదం, ఒక కవలల జంటలోని అమ్మాయి ని మరొక కవలల జంట లోని అబ్బాయి తో, మరియు అదే కవల జంట లోని అబ్బాయి తో మరొక కవలల జంట లోని  అమ్మాయితో వివాహం జరిపించారు. అంటే మొదటి కవల జంటలోని అమ్మాయి కి అబ్బాయి కి, వేరొక కవల జంట లోని అబ్బాయి కి అమ్మాయి కి పెళ్ళి జరిపించేవారు.


సోదర సోదరీమణుల మధ్య వివాహం జరుపుకోవడం అనేది ఆదం అలైహిస్సలామ్ షరీఅహ్ ( జీవిన విధానంలో ) లో తప్పనిసరి పరిస్థితులలో అనుమతింపబడగా , తర్వాతి తరాలకు సోదర సోదరీమణుల మధ్య వివాహం అనేది నిషేదించబడినది.ప్రఖ్యాత ఖురాన్ వ్యాఖ్యానకర్త హఫీద్ ఇబ్నె కథీర్ దీనిని ఇలా స్పష్టపరిచారు.


*ఆదం సంతానంలో ఆంతఃకలహం : మహమ్మద్ ! వీరికి ఆదం కొడుకులిద్దరి గాధ విన్పించు .* 



ఖాబీల్ మరియు హాబీల్ ( ఆదం అలైహిస్సలామ్ కుమారులు ) ఒక పశువుని బలిచ్చారు . వారిలో ఖాబీల్ బలి మాత్రమే స్వీకరించబడింది , హాబీల్ బలి స్వీకరించబడలేదు . దాంతో హాబీల్ నేను నిన్ను చంపేస్తాను అన్నాడు . దానికి ఖాబీల్ ఇలా అన్నాడు “ అల్లాహ్ భయభక్తులు కలవారి మొక్కుబడినే స్వీకరిస్తాడు . నీవు నన్ను చంపడానికి చెయ్యి ఎత్తితే నేను మాత్రం నిన్ను చంపడానికి చెయ్యి ఎత్తను , నేను స్వర్గ లోక ప్రభువైన అల్లాహ్ కు భయపడుతున్నాను , నా పాపం , నీ పాపం అంతా నువ్వే మూటకట్టుకొని నరకంలోకి పోయి పడు ,  అదే దుర్మార్గులు తగిన ప్రతిఫలం , నేను కోరేది కూడా అదే ( ఖురాన్ 5:27-29 ).


 చివివరికి హాబీల్ ,  అతని దుష్ట మనసు అతని సోదరుడ్ని వధించడానికి ప్రేరేపించింది . ఈవిధంగా అతను నష్టపోయిన వారిలో చేరిపోయాడు. ఆ తర్వాత అల్లాహ్  ఓ కాకిని పంపారు , కాకి అతనికి అతని సోదరుడి శవాన్నిఎలా పూడ్చిపెట్టాలో చూపడానికి నేలను త్రవ్వడం ప్రారంభించింది. ఇది చూసి అతను " అయ్యయ్యో నా సోదరుడి శవాన్నిఎలా పూడ్చిపెట్టాలో  తెలియదే , ఆ కాకి కి ఉన్నంత జ్ఞానం కూడా నాకు లేకపోయిందే " అని బాధ పడ్డాడు. ఆ తరువాత అతను తాను చేసిన పనికి ఎంతో పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు . ( ఖురాన్ 5:30-31 ) .


షైతాన్ చేసిన మోసం వల్ల ఆదిదంపతులైన ఆదం అలైహిస్సలామ్ , హవ్వా అలాహిస్సలాం దివి నుండి భువికి దిగవలసి వచ్చింది . ఆనాటి నుంచి నేటి వరకూ పుట్టిన మానవులంతా వారిద్దరి సంతతే . మానవులు పుట్టక ముందే వారి యొక్క ఆత్మల చేత దేవుడిలా ప్రమాణం చేయించాడు . నీ ప్రభువు ఆదం సంతతిల వీపు నుండి వారి భావితరాల్ని తీసి ప్రమాణం చేయించిన సందర్భం . అపుడు మేము ( అల్లాహ్ ) వారిని ( మానవులను ) సాక్షులుగా పెడుతూ " నేను మీ ప్రభువు ని కానా " అని అన్నాము . దానికి వారు ( మానవులు ) " మీరే మా వ్రభువు . అందుకు మేమే సాక్షులం " అన్నారు .

అపుడు అల్లాహ్ " మేమిలా చేయడానికి కారణం , ప్రళయదినాన మీరు మాకీ విషయం ( అల్లాహ్ మీ ప్రభువు అన్న విషయం ) తెలియదని  చెప్పవచ్చు " అని అన్నారు , లేదా బహు దైవారాధన మాకు పూర్వం మా తాత ముత్తాతలు ప్రారంభించారు , మేము ఆ తర్వాత వారి సంతతి నుండీ పుట్టాము , అలాంటపుడు దుర్జనులు చేసిన ఈ తప్పుకు మమ్మల్ని పట్టుకుంటారా ? " అని చెప్పవచ్చు . వారు సన్మార్గం వైపు మరలుతారన్న ఉద్దేశ్యంతో మేమిలా మా సూక్తులు విడమరచి తెలుపుతున్నాం . ( ఖుర్‌ఆన్ 7:172-174 ) .


 ఈ సత్యాన్ని మానవులకు గుర్తుచేసి వారిని పరిష్కరించడానికి ఆది మానవుడు ఆదం ( అలైహిస్సలామ్ ) నుండి ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం ) వరకు 1,24,000 మంది దైవప్రవక్తలు వచ్చి పోయారు . అయినా మానవుల్లో అత్యధికమంది సృష్టికర్త నిర్దేశించిన రుజుమార్గం , సనాతన ధర్మం అయిన ఇస్లాం పరిధిలోకి రాలేకపాతున్నారు . ఆదిమానవుడు  ప్రస్తుత మానవ రూపంలో ఉన్నా ప్రారంభంలో చాలా పొడగరి అని తెలుస్తోంది . " ఆదం సృష్టించినపుడు ఆయన అరవై బారలు (180 అడుగులు) ఎత్తు ఉండేవారు . తరువాత క్రమంగా తగ్గిపోతూ ఇప్పటి (ఆరడుగల) ఎత్తుకు వచ్చారు " అని దైవస్రవక్త (స) తెలిపారు (బుఖారి).


 ప్రారంభంలో మానవుని వయసు కూడా వేల సంవత్సరాలలో ఉండేదని కొన్ని ఆధారాల ద్వారా తెలుస్తోంది . నూహ్ ప్రవక్త (అలైహి) గురించి “ అతను వారి మధ్య యాభై తక్కువ  వేయి సరివత్సరాలు (950) గడిపాడు ” అని ఖుర్ఆన్ (29:14) లో ఉంది . నూహ్ (అలైహి) దైవప్రవక్త అయిన నాటి నుండి తుఫాన్ సంఘటన సంభవించే వరకు తన జాతి ప్రజల మధ్య 950 సంవత్సరాలు గడిపారని , దీన్నిబట్టి నూహ్ (ఆలైహి) వయసు వేయి సంవత్సరాలకు పైనే ఉండవచ్చని ధర్మ వేత్తలు వ్యాఖ్యానించారు .


ఇబ్నెజౌజీ (రహ్మ లై) ఉల్లేఖనం ప్రకారం ఈసాప్రవక్త అలైహిస్సలాం ( ఈయననే క్రిస్టియన్ లు యేసు ప్రభువు అంటారు ) తన అనుచరుల కోరికపై అల్లాహ్ ని ప్రార్థించగా ఒక అస్థిపంజరం మట్టి లో నుంచి పైకి లేచి ఇలా అంటుంది  “ఒకప్పుడు నేనీ ప్రాంత చక్రవర్తిని . వెయ్యి సంవత్సరాలు జీవించాను , వేయి మంది సంతానం ను కన్నాను , వేయి పట్టణాలు జయించాను , వేయి సైన్యాలను ఓడించాను , వేయి మంది రాజుల్ని చంపాను . చివరికి ఈ విజేత మృత్యు కుహరంలోకి వెళ్ళాడు....” అని చెప్పింది .


వహబ్ బిన్ మునబ్బా (రహ్మలై) ఉల్దేఖనం ప్రకారం ఈసా ప్రవక్త (అలైహి) తన అనుచరుల కోరికపై నూహ్‌ప్రవక్త (అలైహి) కుమారుడు సామ్ సమాధి దగ్గర నిలబడి “ అల్లాహ్ ఆజ్ఞతో సజీవి అయి లే " అన్నారు . సామ్ లేచి ఈసా (అలైహి) ప్రశ్నకు సమాధానమిస్తూ “ నేను నాలుగు వేల సంవత్సరాలు జీవించాను ....” అన్నాడు . ఇలా అతి ప్రాచీన యుగంలో మానవులు వేలాది సంవత్సరాలు జీవించినట్లు తెలుస్తోంది .


పై  హదీసులన్నిటిని బట్టి సృష్టి ప్రారంభంలో ఉన్న మానవులు అత్యధిక , దీర్ఘఆయుష్కులని , దీర్ఘకాయులని స్పష్టంగా తెలుస్తోంది . అదే విధ౦గా ఇతర జీవరాసులు, వృక్షజాతులు వగైరా కూడా ఉందవచ్ఛునేమో! వాస్తవం అల్లాహ్ కే తెలియాలి . ఆనాటి నుంచి మానవుని ఎత్తు , వయసు క్రమంగా తగ్గిపోతూ నేడు సగటున ఆరడుగులకు , 90 మరియు 100 సంవత్సరాలకు దిగిపోయాయి .

 ఖుర్ఆన్ కథనం ప్రకారం  ప్రతి యుగంలో , ప్రతి జాతిలో దైవ ప్రవక్తలు ప్రభవించారు . అత్యధికంగా దైవ ప్రవక్తలు భౌగోళికంగా ప్రపంచానికి కేంద్రస్థాయి ప్రాంతాలైన  ఈజిప్టు

ఇరాక్ , పాలస్తీనా, అరేబియా దేశాలలో ప్రభవించారు . దైవ ప్రవక్తల లో కొందరి పై దివి నుండి దైవ గ్రంధాలు అవతరించాయి. దావూద్ అలాహిస్సలాం కాలంలో జుబూర్ , మూస అలైహిస్సలామ్ కాలంలో తౌరాత్ , ఈసా అలైహిస్సలామ్ ( యేసు ) కాలంలో ఇంజీల్ ( బైబిల్ ) అవతరించాయి.


ఖురాన్ లో ప్రస్తావించబడని మత గ్రంథాలు కూడా ప్రారంభ కాలంలో దైవప్రోక్తగ్రంథాలే అయిఉండవచ్చు ,  కాదని ఖండిచడానికి ఆస్కారమేదీ కనిపించదు .

యావన్మంది దైవప్రవక్తలు ప్రజలకు బోధించిన సారాంశం ఒక్కటే. సృష్టి కర్త , స్వామి , సర్వేశ్వరుడు , ప్రభువు , పోషకుడు , పర్యవేక్షకుడు , ఆపద్బాంధవుడు , ఆది మధ్యాంత రహితుడైన అల్లాహ్ మాత్రమే ఆరాధనకు ( ఇబాదత్ ) అర్హుడు . ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు , సమస్త జీవనరంగాల్లో ఆయన ఆజ్జల్నే శిరసావహించాలి , ఆయన దైవత్వంలో , గుణగణాల్లో , శక్తి సామర్త్యాల్లో ఇతరుల్ని భాగ స్వామ్యులుగా చేయకూడదు . ఈ ప్రపంచం ఓ ప్రయాణామజిలి , పరీక్తా వేదిక , తాత్కలికా ఆశ్రమం . మరణానంతరం ప్రతి మనిషీ తన కర్మలకు దైవ న్యాయ స్థానంలో లెక్క చెప్పవలసి ఉంటుంది . కర్మ విచారణ తర్వాత స్వర్గం లేదా నరకం రూపంలో అతనికి శాశ్వత ప్రతిఫలం లభిస్తుంది .

మానవులకు రుజుమార్గం తెలియజేయడానికి వచ్చిన 1,24,000 మంది దైవ ప్రవక్త లలొ 25 మంది ప్రవక్తలను గురిరిచి మాత్రమే ఖురాన్‌ లో ప్రస్తావించడం జరిగింది . ఆ 25 మంది లో కూడా కొందరు ప్రవక్తలను గురించి చాలా సంక్షిప్తంగా , మరికొందరు ప్రవక్తలను గురించి కాస్త వివరంగా తెలియజేయడం జరిగింది . ఆది మానవుడు ఆదం (అలైహి)ను తొట్టతొలి దైవ ప్రవక్తగా  పేర్కొనడం జరిగింది . ఆ తర్వాత నూహ్ , ఇబ్రహీం , లూత్ , యూసుఫ్ , హూద్ , షుఐబ్‌ , సాలిహ్‌ , మూసా , దావూద్ , సులైమాన్ , యహ్యా , ఈసా (ఆలై) ప్రవక్తలను గురించి కొంచెం వివరంగా ప్రస్తావించవించడం జరిగింది.


In Sha Allah రేపటి నుండి మనం ఈ ప్రవక్త ల గురించి , వారి దైవసందేశాలను గురించి తెలుసుకుందాం.


నూహ్ అలాహిస్సలాం గురించి రేపటి భాగము - 3 లో .


 *ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-* 


ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి.Keep Sharing.

3

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐 

------------------------------------------------

☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

భాగము - 3                 Date : 13/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

*నూహ్ అలైహిస్సలామ్* 

*మేము ( అల్లాహ్ ) నూహ్ అలైహిస్సలామ్ ను అతని జాతి ప్రజల వద్దకు పంపి , వారిపై వ్యధాభరిత శిక్ష వచ్చివడక ముందే వారిని హెచ్చరించాలని ఆదేశించాము.* 

అతను( నూహ్ ) తన జాతి ప్రజల వద్ద కు వెళ్లి ఇలా అన్నాడు "ఓ నా జాతి ప్రజలారా ! నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాను. మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయనకు మాత్రమే భయపడండి. నా మాట వినండి, నన్ను అనుసరించండి. అప్పుడు అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. ఒక నిర్ణీత గడువు వరకు మీకు అవకాశం ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ నిర్ణయించిన గడువు వచ్చేసిందంటే ఇక అది వాయిదా పడటమంటూ ఉండదు. ఈ సంగతిని మీరు తెలుసుకోగలిగితే చాలా బావుంటుంది.” (ఖురాన్71:2-4).

"వినండి ! నేను మీ వైపుకు పంపబడిన నమ్మకస్తుణ్ణి అయిన దైవప్రవక్తను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి, నేను చెప్పినట్లు వినండి. దీనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుది. కాబట్టి మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి." (ఖురాన్ 26:107-110).

దానికి అతని జాతి పెద్దలు, ''నువ్వు స్పష్టమైన అపమార్గానికి గురైనట్లు మాకు కనిపిస్తోంది''అన్నారు. ''ఓ నా జాతి ప్రజలారా ! నేనేమాత్రం దారి తప్పలేదు. నిజానికి నేను సర్వలోక ప్రభువు తరఫున పంపబడిన ప్రవక్తను. నా ప్రభువు సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. నేను మీ మేలుకోరేవాడిని. మీకు తెలియని విషయాలు అల్లాహ్‌ తరఫు నుంచి నాకు తెలుసు. ఏమిటీ ? మిమ్మల్ని హెచ్చరించటానికి, మీరు భయభక్తుల వైఖరిని అవలంబించి తద్వారా మీరు కరుణించబడేటందుకు మీ వద్దకు స్వయంగా మీ నుంచే ఒక వ్యక్తి ద్వారా మీ ప్రభువు తరఫు నుండి 'ఉపదేశం' అందటం మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తిందా?'' అని నూహ్‌ (అలైహి) అన్నాడు. (ఖురాన్7:60-63).

దానికి అవిశ్వాసులైన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు "ఇతను కూడా మీలాంటి ఒక మానవమాత్రుడే. అయితే ఇతను మీ పై పెద్దరికాన్నికోరుకుంటున్నాడు. అల్లాహ్ గనక తలిస్తే తన ప్రవక్తగా ఏ దైవదూతనో పంపి ఉండేవాడు. ఇతను చెప్పే దానిని మేము ఇదివరకెన్నడూ,మా తాత ముత్తాతల కాలంలో వినలేదు. నిజంగానే ఇతనికి పిచ్చిపట్టినట్లుంది. కాబట్టి ఇతని విషయంలో మరి కొంత కాలం వేచి ఉండండి." (ఖురాన్23:24-25).

దానికి అతని జాతివారు, "ఏమిటీ ? మేము నిన్ను విశ్వసించాలా ? చూడబోతే అధములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు" అని సమాధానమిచ్చారు. దానికి నూహ్‌ ఇలా అన్నాడు "లోగడ వారేం చేసేవారో నాకేం తెలుసు ? మీరు గనక అర్థం చేసుకోగలిగితే, వారి లెక్క తీసుకునే బాధ్యత నా ప్రభువుది. నేను మాత్రం విశ్వాసులను గెంటివేసే వాణ్ణికాను. నేను ప్రజలను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే." దానికి నూహ్ జాతి వారు ఇలా పలికారు "ఓ నూహ్ ! నువ్వు గనక ఈ పనిని మానుకోకపోతే, నిన్ను రాళ్లతో కొట్టడం చంపటం ఖాయం." (ఖురాన్ 26:111 -116).

ఈ విధంగా నూహ్ ప్రవక్త (అలైహి) వందలాది సంవత్సరాలు ప్రజలకు హితబోధ చేసినా కొందరు తప్ప ఎవరూ దైవ ధర్మాన్ని విశ్వసించలేదు . ఆయన కుమారుల్లో కూడా ఒకతను విశ్వసించలేదు . చివరికి నూహ్ ఇలా ప్రార్థించాడు " ప్రభు ! ఈ తిరస్కారులలో ఏ ఒక్కర్నీ ఈ భూ మండలం పైన సజీవంగా వదలిపెట్టకు , నీవు గనక వీరిని వదిలేస్తే వీరు నీ దాసుల్ని దారి తప్పిస్తారు . వీరి సంతతి నుండి పుట్టే ప్రతి వ్యక్తి దుర్మార్గుడిగా , కరుడుగట్టిన తిరస్కారిగా మారుతాడు . ప్రభూ ! నన్నూ నా తల్లిదండ్రుల్ని , నా ఇంట్లో విశ్వాసిగా ప్రవేశించిన ప్రతి మనిషి ని , విశ్వశించిన యావత్తు స్త్రీ పురుషుల్ని క్షమించు , దుర్మార్గులకు మాత్రం వినాశంలో తప్ప మరెందులోనూ వృధ్ధి కలిగించకు . (ఖురాన్ 71:26-28) .

నూహ్‌కు దివ్యావిష్కృతి ద్వారా ఇలా సూచించబడింది " నీ జాతిలో విశ్వసించవలసిన వారంతా విశ్వసించారు . ఇక కొత్తగా విశ్వాషించేవారెవరూ లేరు . కనుక వారి అకృత్యాలను గురించి నీవు బాధ పడకు , ఇపుడు మా పర్యవేక్షణలో మా సహకారంతో ఒక ఓడ తయారుచేసుకో , అయితే దుర్మార్గులు గురించి నా దగ్గర సిఫారసు చేయకూడదు . వారంతా ఇప్పుడు మునిగిపోనున్నారు. " ( ఖురాన్ 11:36,37).

అప్పుడు మేమిలా సూచించాము " మా పర్యవేక్షణలో మా సూచన ప్రకారం ఒక ఓడ నిర్మించుకో . మా ఆజ్ఞ తో మహా ఉపద్రవం పొంగిపొర్లగానే ప్రాణులలో ప్రతి జాతిలో ఒక్కొక్క జంట ను తీసుకొని ఓడ ఎక్కు , నీ భార్య పిల్లల్ని కూడా వెంటపెట్టుకో , అయితే శిక్షకు గురైపోతారని ము౦దే మేము నిర్ణయించిన వారిని ఓడలో ఎక్కించుకో వద్దు . దుర్మార్గులు గురించి నాదగ్గర ఏమీ మాట్లాడకూడదు , వారిప్పుడు మునిగి పోనున్నారు . నీవు నీ సహచరులతో పాటు ఓడలోకి ఎక్కిన తర్వాత " మమ్మల్ని దుర్శార్గుల బారినుండి కాపాడిన అల్లాహ్ కి కృతజ్ఞతలు " అని చెప్పు . ప్రభూ! నన్ను శుభప్రదేశంలో దించు . " నీవెంతో మంచి చోటు ప్రసాదించేవాడవు " అనికూడా వేడుకో ( ఖురాన్ 23:27-29) .

చివరికి మా ఆజ్ఞ రానే వచ్చింది , మహా ఉపద్రవం కుంపటి పొంగి పొర్లింది. అపుడు మేమిలా ఆదేశించాము " ప్రతి జాతికి చెందిన ఒక్కొక్క జతను నీ నౌక లోకి తీసుకో " , అలాగే  " ఎవరెవరి గురించి నీకు ముందే తెలియజేశామో వారిని వదలి మిగిలిన వారిని , నీ కుటుంబసభ్యుల్ని , ఇతర విశ్వాసుల్ని కూడా నౌక లోకి ఎక్కించుకో . " 

నూహ్ తో విశ్వాసులు కొద్ది మందే ఉన్నారు ,  నూహ్‌ తన అనుచరులతో " అల్లాహ్ పేరు స్మరించి ఓడ లోకి ఎక్కండి " అని అన్నారు  . అది నడవడం , ఆగిపోవడం అన్నీ అల్లాహ్ చేతిలో ఉన్నాయి , నా ప్రభువు గొప్ప క్షమాశీలి , అమిత దయామయుడు అని అన్నాడు . ఓడ వారిని తీసుకొని ముందుకు సాగింది . కొండల్లాంటి సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి . నూహ్ అలైహిస్సలామ్ దూరానవున్న తన కుమారున్ని పిలిచి " బాబు ! ఇటు వచ్చేయ్ మాతోపాటు ఓడ లోకి ఎక్కు , అవిశ్వాసులతో కలిసి ఉండకు " అని అన్నారు . ( ఖురాన్ 11:40-42 ) .

దానికి నూహ్ అలైహిస్సలామ్ కుమారుడు " ఇదిగో చూడు , ఇపుడు నేను ఒక కొండ పైకి ఎక్కుతాను , అది నన్ను ఈ నీటి నుండి కాపాడుతుంది " అన్నాడు . దానికి నూహ్ అలైహిస్సలామ్ " అల్లాహ్ కరుణిస్తే తప్ప ఈ రోజు ఆయన ఆజ్ఞ నుండి ఏ శక్తి కాపాడలేదు " అన్నాడు. అంతలో వారిద్దరి మధ్య ఒక పెద్ద కెరటం వచ్చింది , దాంతో నూహ్ కుమారుడు కూడా మునిగిపోయే వారి జాబితాలో చేరిపోయాడు . ( ఖురాన్ 11:43 ) .

అపుడు అల్లాహ్ నుండి " భూ మండలమా ! నీ నీటినంతటిని మింగేయ్ , ఆకాశమా ! ఆగిపో " అని ఆజ్ఞ అయింది . అపుడు నీరంతా నేలలోకి ఇంకిపోయింది , జరగవల్సింది జరిగిపోయింది . ఓడ జూది పర్వతం మీద నిలిచిపోయింది . దాంతో దుర్మార్గులు పీడ విరగడైపోయిందని ప్రకటన వెలువడింది . ( ఖురాన్ 11:45 ) .

ఆర్మేనియా నుండి కుర్దిస్తాన్ వరకు వ్యాపించి ఉన్న అరారాత్ అనే  పర్వతశ్రేణుల్లో “ జూది ” అనే పేరుతో నేటికి ఒక పర్వతం ఉంది . ఆరిస్టాటిల్ అనుచరుడు ఎబడినస్ కూడా దీనిపై నూహ్ అలైహిస్సలామ్ ఓడ దిగిన విషయాన్ని ధృవీకరించారు . ఇరాక్ లో అనేకమంది ప్రజలు దీవి శిథిలాలకు చెందిన ముక్కలు భద్రపరచుకొని వారిని అరగదీసి రోగులకు మందుగా వాడుతున్నారని అతను ( అరిస్టాటిల్ అనుచరుడు ) తన చరిత్ర గ్రంథంలో రాసినట్లు తెలుస్తోంది .
నూహ్ అలైహిస్సలామ్ వారి మధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు గడిపాడు . చివరికి వారు దుర్మార్గంలో పడి ఉన్న స్థితిలో వారి పైకి ఒక భయంకరమైన తుఫాన్ వచ్చిపడింది . ఆ తర్వాత మేము నూహ్ ని , అతనితో పాటు ఓడ లో ఎక్కిన వారిని రక్షించాము . దీనిని ప్రపంచ మానవులకు ఒక సూచకంగా , ఒక గుణపాఠం గా చేసి ఉంచాము . ( ఖురాన్ 29:14,15 ) . 

యావత్ సమాజానికే గొప్ప నాయకుడైన ఇబ్రహీం అలైహిస్సలామ్ గురించి మరియు అతని కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలామ్ గురించి Insha Allah రేపటి భాగము - 4 లో తెలుసుకుందాము .

ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

4

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 4          Date : 14/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

         *ఇబ్రాహీం అలైహిస్సలామ్* 

ఇబ్రహీం అలైహిస్సలామ్ యావత్ సమాజానికి గొప్ప నాయకుడు . అల్లాహ్ పట్ల పూర్తి విధేయతతో కూడిన అంకిత భావం గల భక్తుడు . అతను ఏనాడూ దైవేతరశక్తుల్ని ఆరాధించినవాడు కాదు . అల్లాహ్ చేసిన మహొపకారాల పట్ల ఆయనకు సదా కృతజ్ఞుడై ఉండేవాడు . అల్లాహ్ అతడ్ని ఎన్నుకొని రుజుమార్గం చూపాడు . ప్రపంచంలో అతనికి మంచిని ప్రసాదించాడు . పరలోకం లో అతను తప్పక సజ్జనులలో పరిగణించబడతారు . (ఖుర్‌ఆన్‌ 16:120-122) .

*సత్యసందర్శనం, ధర్మ ప్రచారం* 

ఒకరోజు అతనిపై చీకటి కమ్ముకోగానే అతనొక సక్షత్రం చూసి " ఇతను నా ప్రభుపు " అన్నాడు . కాని ఆ నక్షత్రం అస్తమించగానే  " ఇలాంటి అస్తమించేవాటిని నేను ప్రేమించను " అన్నాడు . తర్వాత చంద్రుడు ప్రకాశిస్తూ కన్పించగానే " ఇతనే నాప్రభువు " అన్నాడు . చంద్రుడు కూడా అస్తమించడంతో  " ఇతనూ నాప్రభుపు కాదు " . నా ప్రభుపు నాకు మార్గం చూపకపోతే నేను మార్గ భ్రష్టుణ్ణయిపోతాను అన్నాడు . (ఖుర్‌ఆన్‌-6:74-77) .

 ఆ తర్వాత మరునాడు ఉదయం సూర్యుడు దేదీప్యమానంగా వెలిగిపోతూ కనిపించాడు , అప్పుడు ఇబ్రాహీం  " ఇతనే నాప్రభువు , అందరికంటే గొప్ప ప్రభుపు " అన్నాడు . అయితే సూర్యుడు కూడా అస్తమించడం తో అతనికి జ్ఞానోదయం అయింది .

అతను తన జాతితో  " నాజాతి ప్రజలారా ! మీరు అల్లాహ్ కి సాటికల్పిస్తున్న మిథ్యా దైవాలతో నేను విసిగిపోయాను . నేనిప్పుడు పూర్తి ఏకాగ్రతతో భూమి , ఆకాశాల్ని సృష్టించినవాని వైపుకు మరలాను . నేను ఏ మాత్రం బహుదైవారాధకుడ్ని కాను " అని అన్నాడు . ( ఖురాన్ 6:78,79 )  

ఇబ్రహీం ఇలా అన్నాడు " మీరు అల్లాహ్ ని మాత్రమే ఆరాధించండి . ఆయనకే భయపడండి . ఈ విషయం తెలుసుకుంటే ఇందులోనే మీ శ్రేయస్సు ఉంది . మీరు అల్లాహ్ ని వదలి పూజిస్తున్న వస్తువులు విగ్రహాలు మాత్రమే , మీరు ఒక అసత్యాన్ని కల్పించుకున్నారు . అల్లాహ్ ని వదలి మీరు పూజిసున్న ఈ విగ్రహాలు మీకు ఎలాంటి ఉపాధి ఇవ్వలేవు . కనుక మీరు అల్లాహ్ సన్నిధిలో ఉపాధి గురించి అర్థించండి . అల్లాహ్ నే ఆరాధించండి , అల్లాహ్ కే కృతజ్ఞతలు తెలుపుకోండి . చివరికి మీరు అల్లాహ్ సన్నిధికే మరలిపోవలసి ఉంది . మీరు నా మాటలు తిరస్కరిస్తే మీకు పూర్వం కూడా అనేక జాతులు తిరస్కరించాయి . దైవ సందేశాన్ని స్పష్టంగా అందజేయడం తప్ప దైవప్రవక్త పై మరెలాంటి బాధ్యత లేదు .  (ఖురాన్ 29:16-18 ) .

ఇలా సాగింది ఇబ్రాహీం ప్రవక్త (అలైహి) ధర్మ ప్రచారం .

*తండ్రి తో వాగ్వాదం : -* 

ఇబ్రహీం అలైహిస్సలామ్ తండ్రి కూడా విగ్రహారాధకుడే. అతను ఒక మంచి శిల్పి. దేవతా విగ్రహాలు చెక్కి బజారులో అమ్మేవాడు. తన తండ్రి అవిశ్వాసం ఇబ్రహీం (అలైహి) ను ఇబ్బంది పెట్టేది. తన తండ్రి ఒంటరిగా ఉన్న సమయం చూసుకొని అతనికి ఇలా హితోపదేశం చేశాడు.

ఇబ్రహీం : - ఓ నాన్నా ! వినలేని, చూడలేని, మీకు ఏమాత్రం ఉపయోగపడలేని వాటిని ఎందుకు పూజిస్తారు ? ఓ పితామహా ! చూడండి మీ వద్దకు రాని జ్ఞానం నా వద్దకు వచ్చింది.కనుక మీరు నన్ను అనుసరించండి. నేను మీకు సరైన మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను. ఓ తండ్రీ ! మీరు షైతాను దాస్యాన్ని విడనాడండి. నిశ్చయంగా షైతాన్‌ కరుణామయుడైన అల్లాహ్‌కు అవిధేయుడు. తమరు ఎక్కడ కరుణామయుని ఆగ్రహానికి గురవుతారోనని, షైతాను సహవాసి అయిపోతారోనని నాకు భయంగా ఉంది. (ఖురాన్ 19:42-45).

ఇబ్రహీం తండ్రి : - ఓ ఇబ్రాహీం ! నువ్వు నా దైవాలకే విముఖత చూపుతున్నావా ? విను ! నువ్వు నీ వైఖరిని మానుకోకపోతే నేను నిన్ను రాళ్లతో కొడతాను. మర్యాదగా నన్ను నా మానాన వదలిపెట్టు. (ఖురాన్ 19:46).

ఇబ్రహీం : - సరే నాన్నా మీకు సలాం ! నేను మాత్రం మీ మన్నింపు కోసం నా ప్రభువును వేడుకుంటూనే ఉంటాను. నిశ్చయంగా ఆయన నాపై ఎంతో జాలి కలవాడు. నేను మిమ్మల్నీ, అల్లాహ్‌ను విడిచి మీరు మొరపెట్టుకునే వారందరినీ వదలి పోతున్నాను. కేవలం నా ప్రభువును మాత్రమే వేడుకుంటాను. నా ప్రభువుని వేడుకుని విఫలుణ్ణి కానన్న నమ్మకం నాకుంది." (ఖురాన్ 19:47-48).

ఇబ్రహీం (అలైహి) హేతుబద్ధంగా ఎన్నో విషయాలు విశదీకరించారు , కాని ఆయన జాతి ప్రజలకు సత్యం చెవులకెక్క లేదు . 

*అగ్నిపరీక్ష* 

అంతకు పూర్వం మేము ( అల్లాహ్ ) ఇబ్రాహీం కు విచక్షణాజ్ఞానం ప్రసాదించాము . అతడి గురించి మాకు బాగా తెలుసు . అతను తన తండ్రిని , తన జాతి ప్రజల్ని ఉపదేశిస్తూ " మీరంతగా అభిమానిన్తున్న ఈ విగ్రహాల సంగతేమిటీ ? " అనడిగాడు . ( ఖురాన్ 21:51,52 ) .

“మా తాతముత్తాతలు వీటిని పూజిస్తుండేవారు . అందుచేత మేమూ వీటిని పూజిస్తున్నాం " అన్నారు వారు . ( ఖురాన్ 21:53) .

“అయితే మీరు దారి తప్పారు , మీ తాతముత్తాతలు అంతకన్నా ఘోరంగా దారితప్పారు " అన్నాడు ఇబ్రహీం . ( ఖుర్‌ఆన్ 21:54 ).

“నువ్వు మా ముందు నీ అసలు భావాలు వ్యక్తపరున్తున్నావా లేక పరిహాసమాడుతున్నావా ? " అడిగారు వారు . ( ఖురాన్ 21:55 ).

 “ కాదు , నిజం గానే చెబుతున్నాను . భూమి , ఆకాశాల ప్రభువే మీ ప్రభువు . ఆయనే వాటిని సృష్టించాడు . అందుకు నేను మీ ముందు సాక్ష్యమిన్తున్నాను . దైవసాక్షి గా ! మీరు లేనప్పుడు నేను తప్పక మీ విగ్రహాల సంగతేమిటో తేల్చుకుంటాను " అని అన్నాడు ఇబ్రహీం ( అలైహి ) . (ఖుర్ఆన్‌ 21:56,57 ) .

“తర్వాత అతను ( ఇబ్రహీం ) నక్షత్రాల వైపు చూసి నాకు వంట్లో బాగాలేదు " అన్నాడు . అందువల్ల వారు ఇబ్రహీం ను వదలి వెళ్ళిపోయారు . వారు అలా పోగానే ఇబ్రాహీం వారి దేవతల విగ్రహాలు ఉన్న చోటులోకి జొరబడి విగ్రహాలతో ఇలా అన్నారు " మీరు ఏమీ తినరేమిటీ ? ఏమైంది మీకు కనీసం మాట్లాడనైనా  మాట్లాడండి ? " అన్నాడు . ఆ విగ్రహాలు ఏమీ మాట్లాడలేదు , తర్వాత అతను ఆ విగ్రహాల పై విరుచుకుపడి కుడిచేత్తో వాటిని గట్టిగా బాది విరగొట్టాడు . ” ( ఖురాన్ 37:88-93 ) .

వాటిలో ఒక పెద్ద విగ్రహాన్ని మాత్రం వదలిపెట్టాడు , వారు మారతారన్న ఉద్దేశ్యం తో ఆ పెద్ద విగ్రహాన్ని వదిలిపెట్టారు . ( ఖురాన్ 21:58 ) .

జనం తిరిగివచ్చిన తర్వాత ఈ ఘటనను చూసి , "మన దైవాలకు ఈ దుస్ధితి కలిగించింది ఎవరో చూస్తే పరమదుర్మార్గుడిలా ఉన్నాడు " అని అన్నారు . కొద్ది దూరంలో ఉన్న కొంత మంది " మేము ఇబ్రాహీం అనే యువకుడు వాటిని గురించి ప్రస్తావిస్తుంటే విన్నాము " అని అన్నారు . (ఖురాన్ 21:59,60 ) .

“ అయితే అతడి ని పట్టి తీసుకురండి జనం ముందుకు అందరూ అతని సంగతి చూస్తారు " అన్నారు వారు . ఇబ్రహీం వచ్చిన తరువాత "ఇబ్రాహీం! నువ్వేనా మా దేవతల పట్ల ఇలా ప్రవర్తించింది ? " అని అడిగారు వారు. దానికి ఇబ్రహీం "అసలు ఇదంతా వాటి నాయకుడే ( అంటే మిగిలిఉన్న ఆ పెద్ద విగ్రహం ) చేసి ఉంటాడు . అడిగి చూడండి ఆ విగ్రహాన్ని , ఎవరు ధ్వంసం చేశారో ఆ విగ్రహమే చెబుతుంది" అన్నాడు . దానికి వారు " ఆ విగ్రహం ఎలా చెబుతుంది , అది మాట్లాడలేదు కదా " అన్నారు . ( ఖురాన్ 21:61-63 ) .

ఈ మాట వినగానే వారు తమ అంతరాత్మల వైపుకు మరలి “నిజంగా మనం చాలా దుర్మార్గులం , ఈ విగ్రహాలు ను పూజించడం తప్పు , ఇవి తమని తాము కాపాడుకోలేవు ఇక మనల్ని ఎలా కాపాడుతాయి " అని అనుకున్నారు . కాని ఆ తరువాత వారి బుద్ధి వక్రీకరించింది. వారు ఇబ్రహీం తో " ఇవి మాట్లాడలేవని నీకు తెలుసు కదా ? " అన్నారు . దానికి ఇబ్రహీం " మీరు అల్లాహ్ ని వదలి మీకెలాంటి లాభం గాని , నష్టం గాని కలిగించలేని ఈ విగ్రహాలను ఎందుకు పూజిన్తున్నారు ? మీకు కాస్తయినా ఇంకిత జ్ఞానం, బుద్ధి జ్ఞానం ఉందా " అని అన్నాడు ఇబ్రహీం ( ఖురాన్ 21:64-68 )

దానికి వారి అహం దెబ్బతింది. అపుడు వారు పరస్పరం సంప్రదించుకొని ఇబ్రహీం కోసం ఓ భారీ కొలిమి లాంటి అగ్ని గుండం తయారు చేసి మండే ఆ అగ్నిగుండంలో అతడ్ని విసిరేయాలని నిర్ణయించుకున్నారు.” ( ఖురాన్ 37:97).

తర్వాత జరిగినదాని విషయమై Insha Allah రేపటి భాగము - 5 లో తెలుసుకుందాము ------------

ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-

ప్రియమైన సోదరులారా !  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు  " అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ " ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు . పై వన్నీ తెలుసుకోవాలంటే ముందు మన ఇస్లాం చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి . నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపిస్తూ , మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .

5

🕋🕋🕋🕋 బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్ 🕋🕋🕋🕋

🛐🛐🛐🛐 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన *అల్లాహ్* పేరుతో ప్రారంభిస్తున్నాను 🛐🛐🛐🛐

------------------------------------------------

       ☪☪☪☪ *ఇస్లాం చరిత్ర* ☪☪☪☪

    భాగము - 5          Date : 15/11/2017

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇబ్రహీం తో వాదన లో పూర్తిగా ఓడిపోయిన ఆ జనం పరస్పరం సంప్రదించుకొని ఇబ్రహీం కోసం ఓ అగ్ని గుండం తయారు చేసి మండే ఆ అగ్ని గుండంలో ఇబ్రహీం ని విసిరేయాలని నిర్ణయించుకున్నారు. ( ఖురాన్ 37:97 ).

వారు పెద్ద పెద్ద దుంగలను జమ చేసి, భయంకరమైన మంటను
రాజేశారు. దాని అగ్ని జ్వాలలు ఆకాశాన్ని తాకుతున్నాయా
అనిపించేంత ఎత్తుకు ఎగిసినాయి. మంటలు బాగా అంటుకున్న తర్వాత, వారు ఇబ్రహీమ్ అలైహిస్సలామ్ ని ఆ మంటలో పడవేశారు. ఆ మంటల్లో ఉన్న ఇబ్రహీం ఇలా పలికారు “ హస్బి అల్లాహు వ నేమల్ వకీల్ ( నా కొరకు అల్లాహ్ చాలు మరియు ఆయన విషయాలను చక్కబెట్టడంలొ సాటి లేనివాడు ). ” అపుడు అల్లాహ్ ఆయనను కాపాడినాడు , అప్పుడు అల్లాహ్ " " అగ్ని " ఇబ్రహీం కోసం శాంతించు, చల్లబడిపో "  అని ఆదేశించారు. అలా ఆ అవిశ్వాసుల పన్నాగాన్ని నిర్వీర్యం చేశాడు అల్లాహ్.( ఖురాన్ 21:69,70 ).

*రాజు తో భేటి* 

"ఉర్" ఇబ్రహీం అలైహిస్సలామ్ పుట్టి పెరిగిన పట్టణం. ఈ పట్టణం ఆనాటి రాజు నమ్రూద్ పాలించిన రాజ్యానికి ( ప్రస్తుత ఇరాఖ్ ) రాజధానిగా గా ఉండేది. అగ్ని పరీక్ష తర్వాత ఆ రాజు ఇబ్రహీం తో మాట్లాడాలని, ఇబ్రహీం ని పిలిపించారు. తర్వాత రాజు ఇలా అన్నాడు;

రాజు :- అల్లాహ్ విషయం లో వాదనకు దిగిన వ్యక్తి గురించి నీవు ఆలోచించావా ! దేవుడు అతనికి రాజ్యాధికారం ప్రసాదించాడు. అందుచేత అతను అధికార గర్వంతో విర్రవీగుతూ అల్లాహ్ విషయం లో వాదనకు దిగాడు.

ఇబ్రహీం :- ఎవరి అధీనం లో జీవన్మరణాలున్నాయో ఆయనే నా ప్రభువు.

రాజు :- చావు బ్రతుకులు నా ఆధీనంలో కూడా ఉన్నాయి.

ఇబ్రహీం :- అలాగనా ! అయితే అల్లాహ్ సూర్యుడ్ని తూర్పు నుండి ఉదయింపజేన్తున్నాడు కదా, నీవు సూర్యున్ని పడమర నుండి ఉదయింపజెయ్యి చూద్దాం.

దానికి ఆ తిరస్కారి సమాధానం ఇవ్వలేక తెల్లమొహం వేశాడు. అల్లాహ్ దుర్మార్గులకు ఎన్నటికీ సన్మార్గం చూపడు. ( ఖురాన్-2:258 ).

*పునర్జీవ పరీక్ష :-* 

ఇబ్రహీం : - ఓ ప్రభూ ! నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా ?

అల్లాహ్ : - నీకు నమ్మకం లేదా !

ఇబ్రహీం : - ఎందుకులేదు ! నాకు పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే ఆత్మ తృప్తికై ఇలా అడిగాను .

అల్లాహ్‌ : - నాలుగు పక్షులను తీసుకోని, వాటిని మచ్చిక చేసుకో. ఆ తర్వాత వాటిని కోసి ముక్కలు ముక్కలుగా చెయ్యి. తరువాత ఒక్కో పర్వతంపై దాని ఒక్కో మాంసపు ముక్కను ఉంచి, నువ్వు కిందకి వచ్చేసి ఆపైన ఆ పక్షులను పిలువు. అవి నీవద్దకు పరుగెత్తుకుంటూ వస్తాయి.

"అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, వివేకవంతుడన్న సంగతిని బాగా తెలుసుకో'' అని అన్నాడు అల్లాహ్. (ఖురాన్ 2:260).

*అగ్ని పరీక్ష తర్వాత* 

అగ్ని నుండి ఇబ్రహీమ్ అలైహిస్సలాం ను కాపాడిన తర్వాత, మెసపుటోమియాను విడిచి పెట్టి, ఫలస్తీనా లోని పవిత్ర స్ధలం వైపుకు వలస వెళ్ళమని ఇబ్రహీమ్ అలైహిస్సలాం ను అల్లాహ్ ఆఙ్ఞాపించాడు.

ఆయన తన పినతండ్రి కుమార్తె అయిన ‘సారహ్’ ను పెళ్ళాడినారు. ఆమెను మరియు తన సోదరుని కుమారుడైన లూత్ అలైహిస్సలాం ను వెంటబెట్టుకుని, షామ్ ( సిరియా, జోర్డాన్, ఫలస్తీనా, లెబనాన్ మొద" ) వైపు నకు ప్రయాణించారు. “ మేము ఇబ్రహీం ను, లూత్ అలైహిస్సలామ్ ను కాపాడి, లోకవాసుల కొసం శుభాలను పొందు పరిచిన భూభాగం వైపుకు తీసుకువెళ్ళాము. ( ఖురాన్ 21:71 ).

అపుడు షామ్ దేశం గడ్డ పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండటం వలన, ఆయన తన భార్య " సారహ్ " తో కలిసి ఈజిప్టుకు చేరుకున్నారు. కొన్నాళ్లకు ఆయన తన భార్యతో మరియు తన భార్యకు బానిసగా లభించిన ‘హాజరా’ అనే బానిసతో ఫలస్తీనా మరలివచ్చారు.

సంతానం కోసం ఇబ్రహీం అలైహిస్సలామ్ ఎంతో కృషి చేశారు. కానీ భార్య గొడ్డుతనం మరియు ముసలితనం వలన ఆయనకు పిల్లలు కలుగలేదు. సంతానం కొరకు తన భర్త చూపుతున్న ఆసక్తిని గమనించిన తర్వాత, తన బానిస హాజరాను ఆమె తన భర్తకు ఇచ్చి పెళ్లి చేసింది సారహ్.

ఇబ్రహీం నీ అల్లాహ్ కొన్ని విషయాల్లో ఇబ్రహీం ని పరీక్షించగా అందులో అతను కృతార్ధుడయ్యాడు. అప్పుడు అల్లాహ్ అతనితో " నేను నిన్ను యావత్తు మానవజాతికి నాయకుడిగా నియమించబోతున్నాను " అన్నాడు. దానికి ఇబ్రహీం " ప్రభూ ! మరి నా స౦తాన౦లో కూడా ఎవరికైనా ప్రపంచ నాయకత్వం ప్రసాదిస్తావా ? "అని అడిగాడు. దానికి అల్లాహ్ " అలాగే మాటిస్తున్నాను , నీ సంతానం సన్మార్గం లో ఉంటే మా ఈ వాగ్దానం వర్తిస్తుంది , దుర్మార్గం లో ఉంటే వర్తించదు అన్నాడు. ” (ఖురాన్-2:124).

ప్రభూ ! నాకు ఒక సద్గుణ సంపన్నుడైన కుమారుడ్ని ప్రసాదించు అని అల్లాహ్ ని వేడుకున్నాడు ఇబ్రహీం. మేము అతనికి సహనశీలుడైన ఒక పిల్లవాడు ఇస్మాయిల్ కలుగుతాడని శుభవార్త తెలియజేశాము. (ఖురాన్ 37:99-101).

*సంతాన శుభవార్త ను తెచ్చిన దైవ దూతలు* 

ఇక పోతే ఇబ్రహీం దగ్గరకు మా దూతలు సంతాన శుభవార్త తీసుక వెళ్లారు.

దైవ దూతలు :- మీకు శాంతి శ్రేయాలు కలుగుగాక.

ఇబ్రహీం :- మీకు కూడా శాంతి శ్రేయాలు కలుగుగాక.

ఆ తర్వాత కాసేపటికి ఇబ్రహీం అతిథు ల కోసం ఆవుదూడను కాల్చి తెచ్చి, వారికి భోజనం వడ్డించారు, కాని వారి చేతులు భోజనం మీదికి పోవడంలేదు. దాంతో అనుమానం ఇబ్రహీం లోలోన భయపడసాగాడు. దానికి దైవ దూతలు ‘భయపడకు...’ ( ఖురాన్ 11:69,70).

"మేము ఒక నేరజాతి దగ్గరకు పంపబడ్డాము. ఒక్క లూత్ కుటుంబానికి మాత్రమే మినహాయింపు ఉంది. వారిని మేము కాపాడుతాం, అయితే అతని భార్యను మాత్రం కాపాడము. ఆమె వెనుక ఉండిపోయేవారిలో చేరిపోతుందని మేము ముందుగానే నిర్ణయించాం" అన్నారు దైవదూతలు. (ఖురాన్ 15:58-60).

ఆ తర్వాత ఇబ్రహీం " ఓ నా ప్రభూ! నాకు గుణవంతుడైన కుమారుణ్ణి ప్రసాదించు "అని ప్రార్థించాడు. అందువలన మేము ( అల్లాహ్ ) అతనికి సహనశీలుడైన ఒక పసిబిడ్ద గురించిన శుభవార్తను దైవదూతల ద్వారా అందజేశాము. ( ఖురాన్ 37:100-101 ).

ఆ తర్వాత కొన్నాళ్ళకు హాజరాకు పండంటి మగబిడ్డ ఇస్మాయిల్ జన్మించాడు. ఇస్మాయిల్ జన్మించిన తర్వాత సారహ్ లో అసూయాగ్ని రగులుకోవటం మొదలైంది. హాజరాను, ఇస్మాయిల్ ను తన నుండి దూరంగా పంపించి వేయమని ఇబ్రహీం ను కోరింది. అపుడు హాజరాను మరియు పసిబిడ్డ ఇస్మాయిల్ ను తీసుకుని, మక్కాలో వదిలి పెట్టమని అల్లాహ్ ఇబ్రహీం అలైహిస్సలాం ను ఆదేశించాడు.

ఆ కాలంలొ మక్కా ప్రాంతంలో నీళ్ళు కూడా దొరకని, జనసంచారం లేని ఒక నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది. ఇబ్రహీం అల్లాహ్ ఆజ్ఞను అనుసరించి, హాజరాను మరియు ఇస్మాయిల్ ను తీసుకుని మక్కా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ వారిని వదిలి పెట్టి, రెండు అడుగులు వెనక్కి వేసి ఫలస్తీనా వైపుకు తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు. అపుడు హాజరా ఆయనతో “ ఎవరి కోసం మమ్మల్ని ఈ నిర్మానుష్య లోయలో ఒంటరిగా వదిలివెళుతున్నారు?  అని ప్రశ్నించసాగింది. కానీ ఇబ్రహీం అలైహిస్సలాం ఏమీ జవాబివ్వకుండా నిశ్శబ్దం గా ఉండిపోయారు. అపుడు హాజరా “ ఇలా చేయమని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపించాడా ? ” అని అడుగగా , “అవును ” అని ఆయన జవాబిచ్చారు.

అపుడు హాజరా “ అలా అయితే మాకేమీ హాని కలుగకుండా అల్లాహ్ యే చూసుకుంటాడు ” అని పలికింది. తన ప్రభువు ఆజ్ఞకు ఇబ్రహీం అలైహిస్సలామ్ సమర్పించుకున్నారు.

తన భార్య మరియు లేక లేక కలిగిన పసిబిడ్డ దూరమవటాన్ని ఎంతో సహనంతో ఓర్చుకున్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఆయన హాజరా , ఇస్మాయిల్ ను వదిలి పెట్టిన లోయ వైపు కు తిరిగి ( నేటి కాబా గృహం వైపు తిరిగి ) అల్లాహ్ ను ఇబ్రహీం ఇలా వేడుకున్నాడు " ప్రభూ! ఈ మక్కా నగరాన్ని శాంతి నగరంగా చెయ్యి. నన్ను, నా సంతానాన్ని విగ్రహారాధన నుండి కాపాడు. ప్రభూ ! ఈ విగ్రహాలు అనేకమందిని దారి తప్పించాయి. నా సంతానాన్ని కూడా దారి తప్పించే ప్రమాదముంది. కనుక వారిలో నా విధానాన్ని అనుసరించే వారు నా వారవుతారు. నా విధానానికి వ్యతిరేకంగా నడిచేవారికి నీవే దిక్కు. నీవు క్షమించేవాడవు, కరుణించేవాడవు. (ఖురాన్14:35,36).

“ ప్రభూ ! నేను నా సంతానాన్ని ఎలాంటి చెట్టూ , పుట్టా లేని ఎడారి ప్రాంతంలోకి తీసుకొచ్చి వశింపజేశాను, భవిష్యత్తులో వీరిక్కడ నమాజు వ్యవస్థ ను నెలకొల్పుతారన్న ఆశతో వదిలి వెళ్తున్నాను. కనుక వీరిపట్ల నీవు ప్రజల హృదయాల్లో ఆసక్తి అభిమానాలు కలిగించు. వీరికి తినడానికి పండ్లు, ఫలాలు ప్రసాదించు, బహుశా అందుకు వీరు నీకు కృతజ్ఞులై ఉంటారు. ప్రభూ ! మేము దాస్తున్నది, బహిర్గతం చేస్తున్నది అంతా నీకు తెలుసు. అల్లాహ్ కు భూమి , ఆకాశాలతో ఏదీ కనుమరుగుగా లేదు. (ఖురాన్ 14:37,38 ).

ఇబ్రహీమ్ అలైహిస్సలాం తమ కొరకు వదిలి పెట్టి వెళ్ళిన అన్నపానీయాలు సేవిస్తూ హాజరా, ఇస్మాయిల్ మక్కా లోయలో నివసించసాగారు. కొన్నాళ్ళకు వారి దగ్గర ఉన్న నీళ్లు అయిపోయాయి. దాహం తో ఆమె మరియు ఆమె పసిబిడ్డ ఇస్మాయిల్ తపించసాగారు. అపుడు ఆమె నీటి  కోసం వెతకడం ప్రారంభించింది. ఇస్మాయిల్ ను లోయలో పడుకోబెట్టి ఇరువైపులా ఉన్న సఫా మరియు మర్వా కొండలపై ఎక్కి కనుచూపు మేర నీటి కోసం చూసింది. అయితే, ఆమెకు నీటి అనవాళ్ళేమీ ఆ దరిదాపులలో కనబడలేదు. అలా ఆమె ఏడు సార్లు సఫా మరియు మర్వా కొండలపై ఎక్కి నీటి కోసం అన్వేషించింది. అపుడు నిస్పృహ తో ఇస్మాయిల్ వైపు తిరిగి చూడగా, ఆయన పాదాల క్రింద వేగంతో సాగుతున్న నీటి ఊట ఆమె కళ్ళబడింది. ఎంతో సంతోషంతో తను కొంత నీరు త్రాగి, తన పసిబిడ్దకు కూడా త్రాగించింది. ఆ తర్వాత నీటి ఆనవాళ్ళ కనిబెట్టి జుర్హుమ్ అనే తెగ అక్కడకు చేరుకుని, తాము కూడా ఆ నీటి ప్రవాహం ప్రక్కనే నివసించేందుకు ఆమె అనుమతి కోరింది, ( ఈ నీటి ఊట ఇప్పటివరకు ఇలానే ఉంది , ఈ నీటినే జమ్ జమ్ నీరు అంటారు ) ఆమె అనుమతితో వారు కూడా అక్కడ నివసించసాగారు, ఆ తెగ వారి నుండి హాజరా మరియు ఇస్మాయిల్ అరబీ భాష నేర్చుకున్నారు.

అపుడపుడు ఇబ్రహీమ్ అలైహిస్సలాం అక్కడికి వచ్చి, తన కుమారుడిని, భార్య ని చూసుకునేవారు. ఒకసారి అలా వచ్చినపుడు, ఇబ్రహీమ్ అలైహిస్సలాం కు ఒక కల వచ్చింది. దానిలో ఆయన తన  కుమారుడైన ఇస్మాయీల్ ను బలివ్వమని అల్లాహ్ తనను ఆజ్ఞాపించినట్లుగా ఆయన చూశారు. 

ప్రవక్తల స్వప్నాలు నిజ స్వప్నాలై ఉంటాయి. కాబట్టి, అప్పటికే తను ముసలివాడై చావుకు దగ్గరలొ ఉన్నా మరియు ఇస్మాయీల్ తన ఏకైక సంతానమై ఉన్నా కూడా, ఆయన అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించి , తన కుమారున్ని బలివ్వాలని నిర్ణయించుకున్నారు.

తరువాత జరిగిన విషయమై Insha Allah రేపటి భాగము - 6 లో తెలుసుకుందాము.

ముస్లిం సోదరులకు ఒక చిన్న విజ్ఞప్తి  :-

ప్రియమైన ముస్లిం సోదరులారా!  ఇప్పటికి కూడా మనలో చాలా మంది ముస్లిం సోదరులకు అసలు ఇస్లాం అంటే ఏంటి ? , దీన్ అంటే ఏంటి ? , మన నబీ ఎవరు ? , అసలు మనం ఎందుకోసం పుట్టాము ?  ------ ఇలాంటి అనేకమైన విషయాలు తెలియదు .మనకు ఈ జీవితాన్ని ఇచ్చినది అల్లాహ్ , అలాంటి అల్లాహ్ కోసం 24 గంటల్లో ఒక్క 5 నిమిషాల సమయం కేటాయించి ఈ msg ను చదవలేమా , కేవలం 5 నిమిషాలు కేటాయించి ఇస్లాం చరిత్ర తెలుసుకుంటారని ఆశిస్తున్నాము. నాకు ఈ msg లు ఒక ముస్లిం సోదరుడు పంపించాడు , నేను మీకు పంపిస్తున్నాను ; అలాగే మీరు కూడా ఈ msg లను ముందుకు పంపించండి , ఇదేదో 10 మందికి send చేస్తే మంచి జరుగుతుంది , send చేయకపోతే చేడు జరుగుతుంది అనుకునే msg లు కావు . కాబట్టి మన ముస్లిం లలో దీన్ ను నింపవల్సిన బాధ్యత అల్లాహ్ మన పై ఉంచాడు అని తెలుసుకుంటూ , ఇస్లాం ఉనికి ని చాటి చెప్తారని ఆశిస్తున్నాము .