298

🤝🏻  *అస్సలాము అలైకుమ్ వరహమతుల్లాహి వబరకాతుహు*  🤝🏻

🕋🇸🇦🕋   *బిస్మిల్లాహ్ హిర్రహ్మా నిర్రహీమ్*    🕋🇸🇦🕋

*❂―――•――•――•―○―•――•――•―――❂*

🛐🕌☪         *ఇస్లాం చరిత్ర* *- 298*         ☪🕌🛐

🇸🇦🕋  *ముహమ్మద్ (సల్లం) జీవితచరిత్ర - 213*  🕋🇸🇦

*❂―――•――•――•―●―•――•――•―――❂*

*రాజులకు, సర్దారులకు పంపించిన లేఖలు : - 3*

*4. రోము చక్రవర్తి కైజరుకు పంపిన లేఖ : -*

సహీ బుఖారీ గ్రంథంలోని ఓ సుదీర్ఘమైన హదీసులో ఓ లేఖ గురించిన ఆధారం లభిస్తోంది. ఈ లేఖను దైవప్రవక్త (సల్లం) రోమన్ చక్రవర్తి 'హిరక్ల్'కు పంపించింది. ఆ లేఖ ఇది: ↓

       *బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం*

  *అల్లాహ్ దాసుడు మరియు ప్రవక్త అయిన ముహమ్మద్ తరఫున మూడవ హిరక్ల్ చక్రవర్తికి.*

  *సన్మార్గాన్ని అవలంభించే వ్యక్తికి శుభాలు. మీరు ఇస్లాంను స్వీకరించండి క్షేమంగా ఉంటారు. ఇస్లాం స్వీకరించండి అల్లాహ్ మీ ప్రతిఫలాన్ని రెట్టింపుజేస్తాడు. మీరే గనక దీన్ని తిరస్కరిస్తే 'పరారీసీల' (మీ ప్రజల) పాపభారం కూడా మీ భుజస్కంధాలపైన్నే పడుతుంది.*

  *ఓ గ్రంథవహులారా! మాకూ, మీకు మధ్య సమానంగా ఉన్న విషయం వైపునకు రండి. అదేమిటంటే అల్లాహ్ తప్ప మనం మరెవ్వరినీ ఆరాధించము అనీ, ఆయనకు మరెవ్వరినీ సాటి కల్పించము అనీ మరియు మనలో ఏ ఒక్కడూ మరొకరిని, అల్లాహ్ తప్ప ప్రభువుగా చేసుకోము అనేదే. ఒక వేళ వారు దాన్ని తిరస్కరిస్తే చెప్పేయండి, మేము ముస్లిములము, మీరే దీనికి సాక్షి అని.*

ఈ లేఖను అందించడానికి 'దిహ్యా బిన్ ఖలీఫా కలబీ (రజి)'ను ఎంచుకోవడం జరిగింది. దైవప్రవక్త (సల్లం) ఆయనకు ఆదేశమిస్తూ, *"మీరు దీన్ని బస్రా గవర్నరుకు అందించండి, అతను దీన్ని కైసరు వద్దకు పంపుతాడు"* అని చెప్పారు.

ఈ లేఖ రోమ్ చక్రవర్తికి జెరుసలేంలో ఉన్నప్పుడు అందింది. అప్పుడాయన దైవప్రవక్త (సల్లం) వివరాలు తెలుసుకోవడానికి అరబ్బు వర్తకుల్ని గురించి ఆరాదీశాడు. యాదృచ్ఛికంగా ఆ రోజుల్లో మక్కా నుండి అబూ సుఫ్యాన్, మరికొందరు ఖురైషీయులు వ్యాపార నిమిత్తం బయలుదేరి జెరుసలేంకు వచ్చి ఉన్నారు. రోమ్ చక్రవర్తి వెంటనే వాళ్ళను తన దర్బారుకు పిలిపించుకున్నాడు. సంభాషణానువాదం కోసం ఓ 'దుబాషీ'ని కూడా నియమించాడు.

*"ఇప్పుడు తనను తాను దైవప్రవక్తగా ప్రకటించిన ఈ వ్యక్తికి, మీలో ఎవరు వంశం రీత్యా దగ్గరి సంబంధం కలిగి ఉన్నారు?"* అని అడిగారు.

*"నేను ఆయన వంశం రీత్యా అతనికి (సల్లం) దగ్గరివాణ్ణి"* అని బదులిచ్చాడు అబూ సుఫ్యాన్.

*"ఇతణ్ణి (అబూ సుఫ్యాన్ ని) నాకు దగ్గరగా తీసుకురండి, ఇతని (అబూ సుఫ్యాన్) అనుచరుల్ని కూడా అతని వెనుకాలే కూర్చోబెట్టండి"* అని ఆదేశించాడు హిరక్ల్.

అనంతరం అతను తన దుబాషీని సంబోధిస్తూ, *"ఆయన (అబూ సుఫ్యాన్) వెంట ఉన్న మనుషులతో చెప్పు, ఇతనే (అబూ సుఫ్యాన్) గనక అసత్యమాడితే వెంటనే దాన్ని మీరు ఖండించాలి"* అని అన్నాడు

అప్పుడు అబూ సుఫ్యాన్ తన మదిలో, *"దైవసాక్షి! అగౌరవం పాలు అవుతాననే భయమే లేకుండా ఉండి ఉంటే నేను ముహమ్మద్ (సల్లం) గురించి అసత్యమాడేవాణ్ణే కదా!"* అని అనుకున్నాడు.

దుబాషీ మాధ్యమంగా ఆ ఇరువురి నడుమ కొనసాగిన సంభాషణ ఇలా ఉంది....; ↓

అతను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, *"ఆయన (సల్లం) వంశం ఎలాంటిది అని అనుకుంటున్నారు మీరు?"*

*అబూ సుఫ్యాన్ : -* ఆయన (సల్లం) గొప్ప వంశానికి చెందినవాడు.

*హెరక్ల్ : -* నీవే కాకుండా ఈ మాట మీరెవరైనా ఇది వరకు అని ఉన్నారా?

*అబూ సుఫ్యాన్ : -* లేదు.

*హెరక్ల్ : -* ఈయన తాతముత్తాతల్లో ఎవరైనా రాజుగా రాజ్యమేలారా?

*అబూ సుఫ్యాన్ : -* లేదు.

*హెరక్ల్ : -* సరే, ధనవంతులు ఆయన్ను అనుసరించారా లేదా బలహీనులా?

*అబూ సుఫ్యాన్ : -* అందరూ బలహీనులే.

*హెరక్ల్ : -* వీరి సంఖ్య అధికం అవుతుందా లేదా క్షీణిస్తుందా?

*అబూ సుఫ్యాన్ : -* పెరుగుతూనే ఉంది.

*హెరక్ల్ : -* ఈ ధర్మంలో ప్రవేశించిన తరువాత ఏ ఒక్కడైనా ఈ ధర్మం నుండి బయటపడి ధర్మ భ్రష్టుడయ్యడా?

*అబూ సుఫ్యాన్ : -* లేదు.

*హెరక్ల్ : -* ఈయన ఏ విషయాన్నయితే చెబుతున్నాడో ఆ విషయం గురించి ఇంతకు పూర్వం అతని కంటే ఎవరైనా చెప్పి ఉన్నారా?

*అబూ సుఫ్యాన్ : -* లేదు.

*హెరక్ల్ : -* ఆయన చెప్పిన మాటను ఎప్పుడైనా తప్పడం జరిగిందా?

*అబూ సుఫ్యాన్ : -* లేదు. అయితే మేము ఇప్పుడు అతనితో చేసుకున్న ఒప్పందంలో కుదుర్చుకున్న కాలాన్ని గడుపుతున్నాం. ఈ కాలంలో అతను తన మాటను నిలుపుకుంటాడో లేదో మాకు తెలియదు.

అబూ సుఫ్యాన్ కథనం ప్రకారం....; *"ఈ ఒక్క మాట తప్ప మరే మాటనూ నేను నా తరపు నుంచి చెప్పే అవకాశం నాకు లభించలేదు."*

*హెరక్ల్ : -* మీరు ఆయనతో యుద్ధం చేయడం జరిగిందా?

*అబూ సుఫ్యాన్ : -* అవును, మేము ఆయనతో యుద్ధం కూడా చేశాము.

*హెరక్ల్ : -* అయితే మీకు ఆయనకు మధ్య జరిగిన యుద్ధ పరిణామాలు ఎలాగున్నాయి?

*అబూ సుఫ్యాన్ : -* యుద్ధం మాకు ఆయనకు నడుమ ఓ బొక్కెన లాంటిది. ఆయన మమ్మల్ని నష్టబెడితే మేము ఆయన్నూ నష్టానికి గురిచేసేవారం.

*హెరక్ల్ : -* ఆయన మీకు దేని గురించి ఆదేశిస్తున్నాడు.

*అబూ సుఫ్యాన్ : -* ఆయన చెప్పేది, మేము కేవలం అల్లాహ్ నే ఆరాధించాలని, ఆయనకు మరెవ్వరినీ సాటి కల్పించరాదని, మీ తాతముత్తాతలు ఏవైతే చెబుతూ వచ్చారో దాన్ని వదిలేయమని. ఆయన మాకు నమాజు చేయమని, సత్యం పలకమని, చెడుకు దూరంగా ఉండమని, సౌశీల్యం మరియు బంధువుల ఎడల సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశిస్తున్నాడు.

ఆ తరువాత హెరక్ల్ తన దుబాషీని సంభోదిస్తూ, నీవు ఇతనితో (అబూ సుఫ్యాన్ తో) ఇలా చెప్పు అంటూ తన అభిప్రాయాన్ని ఇలా బహిర్గతం చేశాడు.

*"నేను ఆయన వంశం గురించి అడిగినప్పుడు, ఆయన ఉన్నతమైన వంశానికి చెందినవాడని నీవు చెప్పావు. ప్రవక్తలు తన జాతిలోని ఉన్నత వంశం నుండే ప్రభవింపజేయబడతారు.*

*ఈ మాటలు మీలో ఇంకెవరైనా చెప్పి ఉన్నారా? అని అడిగినప్పుడు, అలా ఎవరూ చెప్పలేదని నీవు అన్నావు. ఈ మాటలు ఇంతకు పూర్వం ఇంకెవరైనా చెప్పి ఉండి ఉంటే, ఇతను వాటినే వల్లిస్తున్నాడని నేను అనుకుని ఉండేవాణ్ణి.*

*ఈయన తాతముత్తాతల్లో ఎవరైనా రాజుగా చెలామణి అయ్యారా? అని అడిగినప్పుడు, లేదు అని సమాధానమిచ్చావు నీవు. ఇతని తాతముత్తాతల్లో ఎవరైనా రాచరికం చేసి ఉంటే, ఈయన తన తాతముత్తాతల రాచరికాన్ని కోరుకుంటున్నాడని అనుకొని ఉండేవాణ్ణి.*

*అలాగే, ఏ మాట అయితే ఆయన అంటున్నాడో అంతకు పూర్వం మీరు దాన్ని అసత్యంగా ఖండించి ఉన్నారా? అని నేను అడిగినప్పుడు, అలా జరగలేదని నీవు అన్నావు. అందుకని ఆయన మీతో ఎప్పుడూ అసత్యం పలకనప్పుడు అల్లాహ్ గురించి ఎలా అసత్యం పలుకగలడు?*

*సంపన్నులు ఆయనను అనుసరిస్తున్నారా లేదా పేదవారా? అని నేను అడిగినప్పుడు, బలహీన ప్రజలు, పేదలే ఆయన్ను అనుసరిస్తున్నారని నీవు అన్నావు. యధార్థంగా ఇలాంటివారే ప్రవక్తలను అనుసరించేవారుగా ఉంటారు.*

*ఆయన ధర్మాన్ని అవలంభించిన తరువాత ఏవరైనా తిరిగి ఆ ధర్మాన్ని వదలి మార్గభ్రష్టులైపోతున్నారా? అని అడగగా, లేదు అని నీవు సమాధానమిచ్చావు. యదార్థం ఏమిటంటే, విశ్వాస మాధుర్యం హృదయాల్లో చోటు చేసుకున్నప్పుడే అలా జరుగుతుంది.*

*ఆయన ఆడిన మాట ఎప్పుడైనా తప్పారా అని అడగగా, అలా ఎప్పుడు జరగలేదని నీవు సమాధానమిచ్చావు. ప్రవక్తలు అలాగే అంటారు. ఎప్పుడూ ఆడిన మాటను జవదాటరు.*

*నేను నిన్ను, ఆయన వేటిని గురించి ఆదేశిస్తున్నాడు? అని అడిగినప్పుడు, ఆయన అల్లాహ్ ను ఆరాధించమని, ఆయనకు మరెవ్వరినీ సాటి కల్పించకు అనే ఆదేశం ఇస్తున్నాడు అనీ, విగ్రహారాధన విడువమనీ, నమాజు, సత్యం మరియు సౌశీల్యం గురించి బోధిస్తున్నాడని నీవు చెప్పావు.*
  *నీవు చెప్పిందే నిజమైతే ఈ వ్యక్తి అతి త్వరలోనే నా ఈ కాళ్ళ క్రింద ఉన్న భూభాగానికి యజమాని అవుతాడు. ఓ ప్రవక్త వస్తాడన్న విషయం నాకు తెలుసు. అయితే ఆయన మీ జాతి నుండి ప్రభవించడని నేను అనుకున్నాను. నేను ఆయన వద్దకు వెళ్ళే నమ్మకమే ఉండివుంటే ఆయన వద్దకు వెళ్ళే శ్రమ తీసుకునేవాణ్ణే. ఆయన సాన్నిధ్యంలోనికి వెళ్ళగలిగితే ఆయన రెండు కాళ్ళను కడిగేవాణ్ణే."*

ఆ తరువాత హిరక్ల్, దైవప్రవక్త (సల్లం) గారి లేఖను తెప్పించి అక్కడున్న వారందరికీ చదివి వినిపించాడు. లేఖ చదవడం పూర్తి కాగానే అక్కడ బిగ్గరగా మాట్లాడుకోవడం, పెద్ద గోల జరగడం వినిపించింది.

ఆ తర్వాత రోమ్ చక్రవర్తి, అరబ్బు వర్తకుల్ని బయటకు పంపించేయమని ఆదేశమివ్వగా, వారిని బయటకు పంపించడం జరిగింది.

అబూ సుఫ్యాన్ కథనం ప్రకారం....; ↓

*"మేము బయటకు వచ్చిన తరువాత నేను నా అనుచరులతో, _"'అబూ కబ్షా★' కుమారుని వ్యవహారం బాగా ముదిరిపోయింది. ఇతనంటే, బనుల్ అస్ఫర్ (రోమనుల)☆ రాజు కూడా భయపడుతున్నాడు."_ అన్నాను. ఈ సంఘటన తరువాత నాకు దైవప్రవక్త (సల్లం) గారి ధర్మమే ప్రాబల్యం పొందగలదనే గట్టి నమ్మకం కుదిరింది. చివరకు నా హృదయ కవాటాలను అల్లాహ్ ఇస్లాం కోసం తెరిచేశాడు."*

కైసరుపై, దైవప్రవక్త (సల్లం)గారి లేఖ ఎలాంటి ప్రభావం చూపిందో అబూ సుఫ్యాన్ మాటల వల్ల అర్థం చేసుకోవచ్చు. కైసరు, దైవప్రవక్త (సల్లం) గారి లేఖ నందించడానికి వెళ్ళిన దూత 'హజ్రత్ దిహ్యా కలబీ (రజి)' గారికి డబ్బు, వస్త్రాలిచ్చి సత్కరించాడు. కాని హజ్రత్ దిహ్యా కలబీ (రజి) వాటిని తీసుకొని మదీనాకు వచ్చేటప్పుడు 'జిజామ్' తెగకు చెందిన కొందరు వ్యక్తులు దోపిడీ చేసి అవన్నీ దోచుకోవడం జరిగింది. ఆయన మదీనాకు చేరి నేరుగా దైవప్రవక్త (సల్లం) గారి సన్నిధికే వెళ్ళారు. వివరాలన్నీ ఆయన (సల్లం)కు తెలియజేశారు. మహాప్రవక్త (సల్లం), 'జైద్ బిన్ హారిసా (రజి) నేతృత్వంలో అయిదు వందల మంది సహాబాల ఓ సైనిక పటాలాన్నిచ్చి 'హుస్మా'కు పంపించారు.

హజ్రత్ జైద్ (రజి), జిజామ్ తెగ వారిపై రాత్రి పూట దాడి చేసి చాలా మందిని సంహరించారు. వారి పశువుల్ని, స్త్రీలను తోలుకొని మదీనాకు వచ్చారు. పశువుల్లో వేయి ఒంటెలు, అయిదు వేల మేకలు ఉన్నాయి. ఖైదీల్లో వంద మంది స్త్రీలు, పిల్లలూ ఉన్నారు.

జిజామ్ తెగ వారికి, దైవప్రవక్త (సల్లం)కు నడుమ అప్పటికే సంధి కుదిరి ఉన్నందువలన ఆ తెగకు చెందిన ఓ సర్దారు 'జైద్ బిన్ రిఫాఅ జిజామీ' పరుగున దైవప్రవక్త (సల్లం) వద్దకు వచ్చి నిరసన ప్రకటిస్తూ వేడుకున్నాడు. జైద్ బిన్ రిఫాఅ, ఆ తెగకు చెందిన కొందరు వ్యక్తులతో సహా ఇదివరకే ఇస్లాం స్వీకరించి ఉండడం, దోపిడి జరిగినప్పుడు ఆయన హజ్రత్ జైద్ (రజి)కు కూడా సహాయపడి ఉండడం మూలంగా దైవప్రవక్త (సల్లం) అతని నిరసనను స్వీకరించి యుద్ధధనాన్ని, ఖైదీలను అతనికి అప్పజేప్పేశారు.

'గజ్వా'ల చరిత్ర రాసేవారు చాలా మంది ఈ సంఘటన హుదైబియా ఒప్పందం కంటే ముందు జరిగిన సంఘటన అని చెబుతారు. కాని ఇది పెద్ద పొరపాటు. ఎందుకంటే కైసరు వద్దకు లేఖ పంపించింది హుదైబియా ఒప్పందం తరువాతనే. అందుకని, అల్లామా ఇబ్నె ఖైమ్ గ్రంథస్తం చేసిన దాని ప్రకారం, ఈ సంఘటన హుదైబియా ఒప్పందం తరువాతనే సంభవించిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

_(★→ 'అబూ కబ్షా' కుమారుడు అంటే దైవప్రవక్త (సల్లం) అన్నమాట. అబూ కబ్షా, ఆయన (సల్లం)గారి తాతో పితామహులు లేదా మాతామహుల్లో ఒకరి మారు పేరు. ఆయనకు పాలు పట్టిన తల్లి 'హలీమా' గారి భర్త పేరు కూడా అదే అని చెప్పడం జరుగుతోంది. మొత్తానికి అబూ కబ్షా పేరు అంత ప్రాచుర్యంలో లేని పేరు. అరబ్బుల్లో, ఎవరినైనా అగౌరవపర్చాలంటే అతని వంశంలోనే అప్రసిద్ధ వ్యక్తితో జోడించి చెప్పడం ఆచారంగా వస్తూ ఉండేది.)_

_(☆→ బనుల్ అస్ఫర్ (అస్ఫర్ సంతతి, అస్ఫర్ అంటే పసుపు రంగు అని అర్థం). రోమనులను బనుల్ అస్ఫర్ అనడానికి కారణం ఏమిటంటే, రోమనుల ఏ వ్యక్తి ద్వారా అయితే రోమను సంతతి వికసించిందో అతణ్ణి 'అస్ఫర్' (పసుపు రంగువాడు) అని ప్రాచుర్యం పొందడమే.)_

*5. మున్జిర్ బిన్ సావీ పేరున రాసిన లేఖ : - ↓*

*In Sha Allah రేపటి భాగంలో....; →*


No comments:

Post a Comment